కర్నూలు: ఎమ్మిగనూరు మండలం పార్లపల్లిలోని ZP ఉన్నత పాఠశాలలో 8వ తరగతి విద్యార్థి కీర్తనపై దాడి చేసిన ఎంఈవో-2 మధుసూదన న్ను తక్షణమే విధుల నుంచి తొలగించాలని ఎస్ఎఫ్ఎస్ఐ జిల్లా సహాయ కార్యదర్శి విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. పాఠశాల పర్యవేక్షణకు వెళ్లిన ఎంఈవో.. విద్యార్థినిని అందరి ముందు చెంప, వీపుపై కొట్టడం సరైన వైఖరి కాదని మండిపడ్డారు.
KRNL: ఆదోనిలోని అమరావతి నగర్లో బెరాకా ప్రార్థనా మందిరంలో పాస్టర్ ఆశీర్వాదం ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ వెల్లాల లలితమ్మ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని, అన్ని మతాలు సమానంగా గౌరవించబడతాయని, మతగ్రంథాలు సన్మార్గంలో నడవాలని ఉపదేశించాయని చెప్పారు.
ప్రకాశం: ఒంగోలులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఆదివారం అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త గౌస్ పాల్గొని పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. ఉన్నత ఉద్యోగాన్ని వదులుకొని ప్రత్యేక రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు తన ప్రాణాలను అర్పించాడన్నారు.
ATP: కడపలో ముస్లిం మైనారిటీ సమస్యల పరిష్కారం కోసం ఆదివారం సాయంకాలం జరుగునున్న బహిరంగ సభకు ఆదివారం గుత్తి పట్టణంలో ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో పట్టణంలోని ముస్లిం మైనారిటీ మత పెద్దలు, మసీదుల ముతవల్లిలు భారీగా తరలి వెళ్లారు. కమిటీ సభ్యులు జిలాన్, రఫిక్ మాట్లాడుతూ కడపలో ముస్లిం మైనారిటీ సమస్యల కోసం జరుగుతున్న బహిరంగ సభకు తరలి వెళ్లారన్నారు.
కర్నూలు: దేశం, రాష్ట్రం కోసం మహనీయులు చేసిన సేవలు మరువలేనని కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు మురళీకృష్ణ పేర్కొన్నారు. ఆదివారం కర్నూలులోని పార్టీ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు, సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మహనీయులు చేసిన సేవలను కొనియాడారు.
PPM: గ్రామస్థాయిలో YSRCP బలోపేతంగానే ఉందని మన్యం జిల్లా వైసీపీ అధ్యక్షులు శత్రుచర్ల పరిక్షిత్ రాజు అన్నారు. ఆదివారం వీరఘట్టం వండవ గ్రామానికి వచ్చిన ఆయన పాలకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి.కళావతితో సమావేశం అయ్యారు. గ్రామస్థాయిలో నూతన కమిటీలను ఏర్పాటు చేసేందుకు ఆమెతో చర్చించారు. ఈ నెల 13న జరిగిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం విజయవంతం అయ్యిందన్నారు.
KKD: కాకినాడలోని జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం యథావిధిగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ షాన్మోహన్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం పరుచుకోవాలన్నారు.
KKD: కాకినాడలోని జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం యథావిధిగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ షాన్మోహన్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం పరుచుకోవాలన్నారు.
E.G: దేవీపట్నం మండలం నుంచి పాపికొండల విహారయాత్రకు వెళ్లే పర్యాటక బోట్లను నిలిపివేసినట్లు టూరిజం శాఖ అధికారి సాంబశివరావు తెలిపారు. ఈరోజు సోమవారం రెండు రోజులు గోదావరి నదిలో పర్యాటక బోట్లు ప్రయాణించవని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు పరిశీలన నేపథ్యంలో అన్ని పర్యాటక బోట్లను నిలిపివేసినట్లు తెలిపారు.
నంద్యాల: బనగానపల్లెలోని పాత బస్టాండ్ వద్ద ఉన్న జుర్రేరు వాగుపై చేపట్టిన వంతెన మరమ్మతు పనులు పూర్తైన నేపథ్యంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదివారం పరిశీలించారు. అనంతరం వాగు పరిసర ప్రాంతాలనూ పరిశీలించారు. వాగు ప్రక్షాళనకు వేగవంతంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
KDP: ఓం శాంతి బ్రహ్మకుమారి 2025 నూతన క్యాలెండర్ ఆవిష్కరణ ప్రారంభోత్సవం ఆదివారం మండలంలోని మాధవరం-1గ్రామంలో చేపట్టారు. ఈ క్యాలెండర్ ఆవిష్కరణకు ముఖ్యఅతిథిగా ఉమ్మడి కడప జిల్లా జనసేన పార్టీ నేత అతికారి కృష్ణ హాజరై క్యాలెండర్ ఆవిష్కరించారు.అనంతరం హ్యాపీ కిడ్స్ పాఠశాల సమీపంలో ఉన్న సెలూన్,షాపును ప్రారంభించారు.కూటమినేతలు పాల్గొన్నారు.
ELR: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ఈనెల 14వ తేదీన నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్కు జిల్లా వ్యాప్తంగా 33 బెంచీలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి పురుషోత్తం కుమార్ ఆదివారం తెలియజేశారు. జాతీయ లోక్ అదాలత్ నందు జిల్లా వ్యాప్తంగా కేసులను రాజీ చేయడం జరిగిందన్నారు. 5616 కేసులు మరియు 87 ప్రీ లిటిగేషన్ కేసులు పరిష్కారించబడ్డాయని తెలిపారు.
VZM: గజపతినగరం పంచాయతీ కార్యాలయంలో ఆదివారం అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమరజీవి శ్రీరాములు చిత్రపటానికి సర్పంచ్ నరవ కొండమ్మ, పంచాయతీ కార్యనిర్వహణ అధికారి జి జనార్దనరావులు పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావానికి ప్రాణత్యాగం చేశారని కొనియాడారు.
E.G: తణుకు స్థానిక మహిళా కళాశాలలో డిసెంబర్ 15 న జరిగిన ఇంటర్ స్టేట్ కరాటే పోటీల్లో రాజమండ్రి రూరల్ కడియం విద్యార్థులు పొల్గొని ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు సాధించారు. సాయి సాన్విత, కార్తీక్, కనక సాగరిక ప్రథమ స్థానం సాధించారు. స్థానిక పెద్దలు పిల్లలను కోచ్ జానకి రాముడుని అభినందించారు.
E.G: కొవ్వూరు మండలం వాడపల్లి-బంగారమ్మపేట దగ్గర ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో అటుగా వెళుతున్న ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు వెంటనే స్పందించారు. ఘటనలో గాయాల పాలైన బాధితులను హుటాహుటిన కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి 108లో తరలించి హాస్పటల్ సూపరింటెంట్కి ఫోన్ చేసి మెరుగైన అత్యవసర చికిత్స అందించమని ఆదేశించారు.