ప్రకాశం: వేటపాలెంలో వాసవి ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై వెంకటేశ్వర్లు పాల్గొని ఆంధ్ర బ్యాంక్ సెంటర్లో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అమరజీవి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని ఎస్సై చెప్పారు.
CTR: శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో గురువారం రాత్రి జ్ఞాన ప్రసన్నాంబ వద్ద బాల దీపాల ఉత్సవాన్ని నిర్వహించారు. ముందుగా కలశస్థాపన గణపతి పూజ పుణ్యావచనము కలశానికి పుష్పాలతో పూజలు చేసి హారతి సమర్పించి ఆలయ ఆవరణంలో బాల దీపాలు వెలిగించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో బాపిరాజు దంపతులు ఆలయ అధికారులు పాల్గొన్నారు.
EG: ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితుడిని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పరామర్శించారు. స్థానిక 11వ డివిజన్ విఎల్ పురం స్కూల్ వీధిలో టైలర్ మల్లిబాబుకు చెందిన షాప్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇల్లు దగ్ధమైంది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి ఘటనా స్థలాన్ని సందర్శించారు. బాధితుడు మల్లిబాబుకు ధైర్యం చెప్పారు.
ASR: ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకూ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ఆదివారం విమర్శించారు. నియోజకవర్గంలో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారానికి “మన ఎమ్మెల్యే.. మా ఊరు” పేరుతో పంచాయతీలను సందర్శిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులతో కలిసి నేరుగా ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
ELR: ఎస్టీల్లోని ఉపకులాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక కృషిచేస్తోందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. ఏలూరు గిరిజన్ భవన్లో ఆదివారం అఖిల భారత ఆదివాసి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి ఎస్టీల అభివృద్ధికి కృషి చేశారన్నారు.
EG: ఏలేశ్వరం మండలం చిన్నంపేట జీడిపిక్కల పరిశ్రమ కార్మికుల న్యాయబద్ధమైన పోరాటానికి స్కీం వర్కర్లు ఆదివారం మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి చంద్రమౌళి పద్మ, మధ్యాహ్నం భోజన కార్మికుల యూనియన్ జిల్లా కార్యదర్శి నార్ల ఈశ్వరి మాట్లాడారు. తక్షణమే పరిశ్రమ తెరిపించి 409 మందికి ఉపాధి కాపాడాలని లేని పక్షంలో నిరసన చేస్తమన్నారు.
ELR: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పర్యటన నేపథ్యంలో ఆదివారం రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక అధికారులు, ఇరిగేషన్ శాఖ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం సీఎం పర్యటన నేపథ్యంలో భద్రతా చర్యలు గురించి అడిగి తెలుసుకున్నారు.
KRNL: హరిజనులను దేవాలయంలోకి ప్రవేశింపజేసిన ఘనుడు ఉద్యమ నాయకుడు పొట్టి శ్రీరాములు అని కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ గుప్త అన్నారు. ఆదివారం పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా గుప్త పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించారు. మహాత్మా గాంధీ స్ఫూర్తితో ఉద్యమాలు చేసి నిరసన తెలిపి ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించారని గుర్తు చేశారు.
కడప: టీటీడీ మరియ జమ్మలమడుగు శ్రీవారి సేవ సమితి ఆధ్వర్యంలో ఈ రోజు మార్గశిర పౌర్ణమి సందర్బంగా జమ్మలమడుగు పట్టణంలోని శ్రీ నారాపుర వెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో శ్రీదేవి, భూదేవి సమ్మెత శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం కన్నులపండుగగా జరిగినది. భక్తులు పెద్ద సంఖ్యల్లో గోవింద నామ స్మరణం చేస్తూ రథోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ జరిగింది.
KDP: సమ్మేటివ్ పరీక్షలు జరుగుతున్న సమయంలో ఉపాధ్యాయులకు నాయకత్వ శిక్షణా తరగతులు నిర్వహించడం సరికాదని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాదన విజయకుమార్ పాలెం మహేశ్ బాబు తెలిపారు. UTF భవన్ నందు జరిగిన టీచర్ ఎమ్మెల్సీ షేక్ సాబ్ది వర్ధంతి పురస్కరించుకొని చిత్రపటానికి పూలమాలలు వేసి యూటీఎఫ్ నాయకులు నివాళులర్పించారు.
అన్నమయ్య: చక్రాయపేట మండలం సిద్ధారెడ్డి గారి పల్లెలో ఉన్న తన మేనమామ లోమడ చిన్న గంగిరెడ్డిని ఆదివారం మంత్రి రాంప్రసాద్ రెడ్డి పరామర్శించారు. చిన్న గంగిరెడ్డి అనారోగ్యానికి గురి కావడంతో ఈ విషయం తెలుసుకున్న మంత్రి చక్రాయపేటకు వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డిని సిద్ధారెడ్డిపల్లె వాసులు ఆయనకు పూలమాలలతో ఘనంగా సత్కరించారు.
KKD: కాకినాడ పోర్టు నుంచి పిడిఎస్ బియ్యం అక్రమ ఎగుమతులను నిరోధించే చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇటీవల ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ను ఆదివారం జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా పరిశీలించారు. ఇందులో భాగంగా ఆయన పోర్టులో ఉన్న ఉషశ్రీ ట్రేడర్స్కు చెందిన స్టఫ్డ్ రైస్ కంటైనర్ల నుండి చెక్ పోస్ట్ టీమ్తో నమూనాలు సేకరించి పరీక్షలు చేయించారు.
NLR: కావలి ఎక్సైజ్ సీఐ శ్రీనివాసులు, ఎస్సై దేవిక ఆధ్వర్యంలో జలదంకి మండలంలోని హనుమకొండ గ్రామంలో తనిఖీలు చేపట్టారు. గ్రామానికి చెందిన జాన్ మురళి అనే వ్యక్తి వద్ద నుంచి 15 మద్యం బాటిల్లను అదుపులోకి తీసుకున్నారు. మద్యం విక్రయిస్తున్నారని సమాచారం రావడంతో ఈ దాడులు నిర్వహించారు.
అనంతపురం జిల్లా మడకశిర మండల పరిధిలోని జిల్లెడగుంట గ్రామంలో జరిగిన ఆంజనేయ స్వామి రథోత్సవంలో MLA రాజు పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల కోలాహలం మధ్య శ్రీ ఆంజనేయ స్వామి రథాన్ని దేవాలయం నుంచి లాగారు. అంజన్న స్వామి అంటూ నామస్మరణతో గ్రామం అంత మార్మోగింది. సీఐలు రామయ్య, రాజకుమార్ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు నిర్వహించారు.
EG: రాజవొమ్మంగి అటవీ శాఖ రేంజ్ పరిధిలో ఉన్న పులి సంచరించిన కనపర్తి, పరిసర ప్రాంతాలను అటవీ శాఖ సిబ్బంది ఆదివారం పరిశీలించారు. గ్రామ సమీపంలో వాగు, చెరువు ప్రాంతాలను ఫారెస్ట్ అధికారులు అర్జున్, బాపిరాజులు పరిశీలించారు. పులి పాదముద్రలు సక్రమంగా కనిపించకపోవడంతో ఈ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు.