• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యేను సత్కరించిన ఆలయ కమిటీ సభ్యులు

కోనసీమ: అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావుని అమలాపురం వెంకటేశ్వర స్వామి దేవస్థానం కమిటీ సభ్యులు ఆదివారం రాత్రి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అమలాపురం వెంకటేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ మోకా వెంకట సుబ్బారావు, ట్రస్ట్ బోర్డు సభ్యులు జంగా అబ్బాయి వెంకన్న, దున్నాల వేణు పాల్గొన్నారు.

December 16, 2024 / 08:02 AM IST

ఇండియన్ గ్రాండ్ మాస్టర్ గుకేష్ చిత్రాభినందన

E.G: కేవలం 18 ఏళ్లకే ప్రపంచంలో పిన్న వయస్సులో ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా అవతరించి చరిత్ర సృష్టించిన మన తెలుగు తేజం ఇండియన్ గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేష్ చిత్రలేఖనం పోలిశెట్టి నరసింహ చంద్రకుమార్ చిత్రం ద్వారా అభినందనలు తెలిపారు. అమలాపురం మండలం పాలగుమ్మి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల చిత్రలేఖనం ఉపాధ్యాయుడు చంద్రకుమార్ గుకేష్ చిత్రాన్ని వేశారు.

December 16, 2024 / 07:57 AM IST

ఆలయంలో చోరీ.. నిందితుడు అరెస్ట్

పల్నాడు: వెల్దుర్తి మండల పరిధిలోని కండ్లకుంట గ్రామంలోని ఓ దేవాలయంలో శనివారం దొంగతనం జరిగింది. ఎస్సై సముందర్ వలీ తెలిపిన వివరాల మేరకు.. ఆలయ అర్చకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఈ మేరకు నిందితుడి నుంచి చోరీ చేసిన రూ.1,08,250 నగదు స్వాధీనం చేసుకుని సోమవారం కోర్టులో హాజరు పరుస్తామన్నారు.

December 16, 2024 / 07:51 AM IST

సీపీఐ పార్టీ మాజీ కార్యదర్శి, లాయర్ ఖాసీం సాహెబ్ మృతి

NDL: డోన్ పట్టణానికి చెందిన మండల సీపీఐ పార్టీ మాజీ కార్యదర్శి, లాయర్ ఖాసీం సాహెబ్ సోమవారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో కర్నూల్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌కు తరలించగా మరణించారు . ఈ సందర్భంగా సీపీఐ, సీపీఎం, టీడీపీ , వైసీపీ, కాంగ్రెస్ నాయకులు ఆయన మృతి పట్ల సంతాపం వెలిబుచ్చారు. ఆయన సేవలను పొరలు కొనియాడారు.

December 16, 2024 / 07:49 AM IST

నేడు నరసాపురంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ

పశ్చిమగోదావరి: నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల వ్యవస్థ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఆర్డీవో దాసి రాజు తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. డివిజన్‌లోని అన్ని శాఖల అధికారులు ఉదయం 10.30 గంటలు నుంచి అందుబాటులో ఉంటారని కావున ప్రజలు తమ సమస్యలకు సంబంధించి ఫిర్యాదులను, దరఖాస్తులను అందించాలని కోరారు.

December 16, 2024 / 07:47 AM IST

చీడికాడలో యువకుడి ఆత్మహత్య

విశాఖ: చీడికాడకు చెందిన వేచలపు మణికంఠ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ సతీశ్ చెప్పారు. మణికంఠ ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తక్కువ కులం అమ్మాయిని పెళ్లి చేసుకున్నావని ఎవరో అవమానించడంతో ఈనెల 11న ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు.

December 16, 2024 / 07:45 AM IST

రేపటి నుంచి నెల్లూరులో భారీ వర్షాలు

NLR: ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో గతంలో కురిసిన భారీ వర్షాలకు నెల్లూరు జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మళ్లీ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లాలో రేపటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. బుధ, గురు వారాల్లో సముద్రం అలజడిగా మారుతుందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని IMD హెచ్చరించింది.

December 16, 2024 / 07:43 AM IST

పాతపాటేశ్వరి తిరునాళ్లకు హాజరైన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే

PLD: గురజాల పట్టణంలోని పాతపాటేశ్వరి అమ్మవారి తిరునాళ్ల మహోత్సవ వేడుకలకు టీటీడీ పాలకమండలి సభ్యులు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావులు ఆదివారం రాత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అమ్మవారి దయవల్ల పల్నాడులో పాడి పంటలు బాగుండాలని కోరుకున్నట్లు పేర్కొన్నారు. అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు వారిని శాలువాలతో సన్మానించారు.

December 16, 2024 / 07:43 AM IST

శ్రీశైలంలో నిలకడగా నీటి నిల్వలు

NDL: శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు నిలకడగా నమోదయ్యాయి. సోమవారం ఉదయం 6 గంటల సమయానికి జలాశయం గరిష్ఠ నీటి నిల్వలు 215.8070 టీఎంసీలకు గానూ 118.0544 టీఎంసీలు ఉన్నాయి. అదేవిధంగా గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులకు గానూ 863.80 అడుగులు నమోదయ్యాయి. కాగా జలాశయం నుంచి దిగువ ప్రాజెక్టులకు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు నీటి విడుదలను పూర్తిగా నిలిపివేశారు.

December 16, 2024 / 07:43 AM IST

‘రహదారులపై ఆక్రమణలు తొలగించాలి’

KRNL: నగరంలో రహదారులపై ఆక్రమణలను తొలగించాలని నగరపాలక కమిషనర్ రవీంద్రబాబు ఆదేశించారు. స్థానిక రైల్వేస్టేషన్ కూడలి, అశోక్ నగర్, నరసింహారెడ్డి నగర్, సంకల్బాగ్ కాలనీల్లో కమిషనర్ పర్యటించి, మాట్లాడారు. రైల్వేస్టేషన్ వద్ద ట్రాఫిక్కు ఇబ్బంది కలిగించే విధంగా ఉన్న ఆక్రమణలను తొలగించాలన్నారు. అక్రమ నిర్మాణాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.

December 16, 2024 / 07:42 AM IST

కర్నూలులో అలరించిన పౌరాణిక నాటకాలు

కర్నూలు: టీజీవీ కళాక్షేత్రంలో సాయంత్రం 6 గంటలకు పౌరాణిక నాటకాలు భవాని చింతామణి సీను, సత్య హరిచంద్ర, వారణాసి, కాటిసీను నాటకాలు ప్రదర్శించారు. టీజీవీ కళాక్షేత్రం వారి సౌజన్యంతో కళావాహిని సాహితీ సంస్థ కర్నూలు వారిచే ఉచిత పౌరాణిక నాటక ప్రదర్శనకు టీజీవి కళాక్షేత్రం పత్తి ఓబులయ్య రూ.10 వేలు పారితోషికం ఇచ్చారు.

December 16, 2024 / 07:38 AM IST

నేడు ఎస్పీ కార్యాలయంలో PGRS

NDL: జిల్లాలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం PGRS కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని అన్ని మండలాల సబ్ డివిజన్ కార్యాలయాల్లో, పోలీస్ స్టేషన్లలో నిర్వహించాలని ఎస్పీ ఆదేశించారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ పిలుపునిచ్చారు.

December 16, 2024 / 07:37 AM IST

బైపాస్ రోడ్డులో మృతదేహం

VZM: సాలూరు బైపాస్ రోడ్డులో మృతదేహాన్ని గుర్తించామని పట్టణ సీఐ అప్పలనాయుడు తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. సుమారు 45 సంవత్సరాల ఉన్న గుర్తు తెలియని వ్యక్తి మృతదేహంగా తెలిపారు. మృతి చెందిన వ్యక్తికి కుడి చేతి అరచేయి లేని వికలాంగుడు అని పేర్కొన్నారు. అతని వద్ద ఒక గోనె సంచి ఉందని, అందులో ఖాళీ ప్లాస్టిక్ సీసాలు ఉన్నాయని తెలిపారు.

December 16, 2024 / 07:37 AM IST

సుగవాసితో కృష్ణారెడ్డి చెరువు సంఘం నేతలు భేటీ

KDP: రాజంపేట టీడీపీ ఇన్‌ఛార్జ్ సుగవాసి బాల సుబ్రహ్మణ్యంతో కృష్ణారెడ్డి చెరువు సంఘం నేతలు భేటీ అయ్యారు. ఆదివారం రాత్రి రాయచోటిలోని సుగవాసి ఇంటికి వెళ్లి ఆయనను కలిసి వారు కృతజ్ఞతలు తెలిపారు. సుగవాసి మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో సాగునీటి వినియోగదారుల సంఘాలకు ఎన్నికలు నిర్వహించకుండా వాటిని నిర్వీర్యం చేశారని అన్నారు.

December 16, 2024 / 07:37 AM IST

‘ఐదు నిమిషాలు ముందుగానే ఉపాధ్యాయులు హాజరుకావాలి’

కోనసీమ: జిల్లాలో ఉప విద్యాశాఖ అధికారులు, మండల విద్యా శాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ సలీం ఆదివారం సూచనలు చేశారు. పాఠశాల ప్రారంభ సమయానికి కనీసం 5 నిమిషాల ముందు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విధిగా హాజరు కావాలన్నారు. ప్రతిరోజూ పాఠశాల అసెంబ్లీలో, ఖాళీ పీరియడ్లలో విద్యార్థులకు నైతిక విలువలపై ఉపన్యాసాలు ఇవ్వాలని తెలిపారు.

December 16, 2024 / 07:36 AM IST