ASR: డుంబ్రిగూడ మండలంలోని టిక్కిలి బెడ్డా గ్రామంలో మానవ హక్కుల నేర నిరోధక సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కృష్ణకుమారి సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఉన్న ఆదిమ జాతి నిరుపేద చిన్నారులకు బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కష్టాల్లో ఉన్న గిరిజనులకు తమ వంతు ఎంతో కొంత సహాయం అందజేస్తున్నామని పేర్కొన్నారు.
NTR: రెడ్డిగూడెం మండలం కూనపరాజుపర్వ గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ను సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. నీటి సంఘాల ఎన్నికలు ఏకగ్రీవం కావడాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యేని కలిసినట్లు వారు వెల్లడించారు. నీటి సంఘం ప్రతినిధులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. సాగునీటిని సకాలంలో సరఫరా చేసి, రైతులకు సేవలను అందించాలని అన్నారు.
VSP: ఏపీలో పర్యటక రాజధానిగా విశాఖను తీర్చిదిద్దాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనల మేరకు అధికారులు చర్యలు చేపట్టారు. సందర్శకుల కోసం కైలాసగిరిలో స్కై సైక్లింగ్ జిప్ లైనర్ ఇటీవల ఏర్పాటు చేశారు. ఒక్కొక్కరికి రూ.300గా టిక్కెట్ ధరను నిర్ణయించారు. జల విన్యాసాలపై అసక్తి ఉన్నవారి కోసం రుషికొండ బీచ్లో మళ్లీ స్కూబా డైవింగ్ అందుబాటులోకి వచ్చింది.
బాపట్ల: జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ప్రకార్ జైన్ అధికారులతో కలిసి పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చి ప్రజలు అందించిన సమస్యల అర్జీలను స్వీకరించారు. ప్రతి అర్జీని క్షుణంగా పరిశీలించి ఆయా శాఖలకు పంపి సమస్యలు సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు చేపడతానని ఆయన తెలిపారు.
W.G: ఉంగుటూరు మండల సర్వసభ్య సమావేశం ఈనెల 21వ తేదీ ఉదయం 10 గంటలకు జరుగుతుందని ఎంపీడీవో గంజి రాజు మనోజ్ తెలిపారు. మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశం ఉంగుటూరు ఎంపీపీ గంటా శ్రీలక్ష్మి అధ్యక్షతన జరుగుతుందన్నారు. మండలంలో సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, మండల స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని ఎంపీడీవో కోరారు.
కృష్ణా: బాపులపాడు మండలం వీరవల్లి పీఎస్ పరిధిలోని NSM కంపెనీ క్వార్టర్స్లో దొంగ నోట్లు చలామణి చేసే ముఠాను, ఒక ప్రింటర్ను సోమవారం వీరవల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు భాషా, మస్తాన్ అనే వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. రాజోలు కేంద్రంగా చేసుకొని, గన్నవరంలో ఇల్లు అద్దెకు తీసుకొని నివసిస్తూ దొంగనోట్ల చలామణికి పాల్పడుతున్నట్లు పోలీసుల సమాచారం.
ప్రకాశం: అద్దంకి మండల పరిషత్ కార్యాలయంలో PR&RD వారి ఆధ్వర్యంలో LSDGS పంచాయతీలు సుస్థిర అభివృద్ధి ఎలా సాధించాలి అనే అంశం పై సోమవారం ట్రైనింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని అద్దంకి మండల అభివృద్ధి అధికారి బి సింగయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ.. ఈ నెల 16వ తేదీ నుంచి 19 తేదీ వరకు సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు, శిక్షణ నిర్వహిస్తున్నామన్నారు.
ASR: జాతీయ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో చింతూరు కేజీబీవీలో 12వ తరగతి చదువుతున్న గుత్తుల మధు చందన సిల్వర్ మెడల్ కైవసం చేసుకుంది. ఢిల్లీలో ఈనెల 9నుంచి 15వ తేదీ వరకు జరిగిన పోటీల్లో ప్రతిభ చాటింది. జాతీయ స్థాయి గుర్తింపు పొందిన మధు చందనను అధ్యాపకులు, స్థానికులు అభినందించారు. ఆమె తల్లిదండ్రులు శ్రీనివాస్, పూర్ణిమ చింతూరులో బజ్జీలు అమ్మి జీవనం సాగిస్తున్నారు.
ASR: డుంబ్రిగూడ మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన చాపరాయి జలపాతం వద్ద శని, ఆదివారాలు రెండు రోజులు సెలవు రోజులు కావడంతో పర్యాటకుల తాకిడి భారీగా పెరిగింది. శనివారం 3,045 మంది సందర్శించారని ప్రవేశ రుసుము ద్వారా రూ.1,46,230 ఆదాయం వచ్చిందని, ఆదివారం 4,580 మంది పర్యాటకులు సందర్శించుకోగా రూ.2,25,510 ఆదాయం వచ్చినట్లు సిబ్బంది తెలిపారు.
W.G:పెరవలి మండలం కొత్తపల్లి అగ్రహారంలో రూ.18 లక్షలు వ్యయంతో నిర్మిస్తున్న సిమెంటు రహదారి నిర్మాణానికి గ్రామ సర్పంచ్ బండారు వెంకటరమణ సాయిబాబా సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో నాయకులు అబ్బిశెట్టి సత్తిరాజు, మారిశెట్టి పోతురాజు, ఆదినారాయణ, కేత నాగేశ్వరరావు పాల్గొన్నారు.
ప్రకాశం: సంతమాగులూరు గ్రామంలో మంగళవారం రెవెన్యూ సదస్సు నిర్వహించనున్నట్లు తహసీల్దార్ రవిబాబు సోమవారం తెలిపారు. గ్రామంలోని సచివాలయం – 2 వద్ద ఉదయం 9 గంటలకు సదస్సు మొదలవుతుంది. గ్రామంలో ఎవరికైనా అడంగల్, 1బి, మ్యుటేషన్ సేవల కోసం దరఖాస్తు చేసుకుంటే వారికి నగదు చెల్లించకుండానే అందిస్తామని పేర్కొన్నారు.
ప్రకాశం జిల్లా సంతమాగులూరు ఆర్గానిక్ వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలను వ్యవసాయ ఎంటీ శిరీష సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆర్గానిక్ వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్లో మంచి గిరాకీ ఉందన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఆర్గానిక్ వ్యవసాయ ఉత్పత్తి వాడటం ద్వారా ఆరోగ్యంగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సిబ్బంది, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
GNTR: అమరావతి ప్రాంతంలోని తుళ్ళూరులో ఆదివారం సాయంత్రం ఎన్టీఆర్ విగ్రహాన్ని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ ఆవిష్కరించిన విషయం తెలిసిందే. కాగా, ఈ కార్యక్రమానికి కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరైన నేపథ్యంలో జేబు దొంగలు కూడా ప్రత్యక్షమయ్యారు. సుమారు రూ.70వేల వరకు అపహరణకు గురైనట్లు స్థానికులు చెబుతున్నారు.
అన్నమయ్య: చిన్నమండెంలోని గ్రామ సచివాలయాన్ని సోమవారం రాష్ట్ర యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలని తెలిపారు. ప్రభుత్వ సేవలను జాప్యం లేకుండా, నిర్ణీత గడువులోగా, పారదర్శకంగా అందించినప్పుడే ప్రజలకు మనపై నమ్మకం కలుగుతుందన్నారు.
GNTR: మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రసెల్ సిస్టం) కార్యక్రమంలో భాగంగా ప్రజలు నుంచి కమిషనర్ అలీం భాషా వినతులు స్వీకరించారు. పలు సమస్యలను అప్పటికప్పుడే పరిష్కరించిన ఆయన పలు సమస్యలపై నిర్దేశిత గడువులోగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కమిషనర్ ఆదేశించారు.