KRNL: ఆదోని నుంచి డణాపురం మీదుగా నానాపురం గ్రామం వద్ద రోడ్డుకు ఇరువైపులా ముళ్ల చెట్లు ఏపుగా పెరిగాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఆ రోడ్డులో ప్రయాణించే వాహనదారులకు ఎదురుగా వచ్చే వాహనాలను గుర్తించలేక, ఇటీవల ఓ వ్యక్తి మరణించాడని వాహనదారులు తెలిపారు. సంబంధిత అధికారులు స్పందించి మలుపు వద్ద ప్రమాదకరంగా ముళ్లపొదలను తొలగించాలని కోరుతున్నారు.
కృష్ణా: ప్రభుత్వ పాఠశాలల్లోని స్వీపర్లకు పెండింగ్లో ఉన్న 6 నెలల వేతనాలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏఐసీసీటీయూ ఆధ్వర్యంలో సోమవారం నూజివీడులోని సబ్ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీవో వాణికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు హరినాథ్, పుల్లారావు, తదితరులు పాల్గొన్నారు.
ELR: పెదవేగి మండలం దుగ్గిరాల టీడీపీ కార్యాలయంలో సోమవారం పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా చింతమనేని వారి సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరించారు. అనంతరం వాటిని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
NDL: డోన్ పట్టణ వెలుగు కార్యాలయంలో ఈ నెల17, 18వ తేదీలలో వివిధశాఖల అధికారులకు, సర్పంచులకు, రెండవ విడత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో వెంకటేశ్వరరెడ్డి సోమవారం తెలిపారు. ఈసమావేశంలో అన్నిశాఖల సమీక్ష జరుగుతుందని, కావున అధికారులు పూర్తిసమగ్ర నివేదికతో హాజరుకావాలని ఎంపీడీవో కోరారు.
VZM: సౌత్ సెంట్రల్ రైల్వే పరిధి గుంతకల్ డివిజన్లో ఆధునిక కారణాలతో నిత్యం నడిచే మార్గంలో కాకుండా వేరే మార్గంలో మల్లిస్తున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం కే.సందీప్ సోమవారం తెలిపారు. రైలు నెంబరు 02811 భువనేశ్వర్ యశ్వంత్ పూర్ స్పెషల్ ఎక్సప్రెస్ ఈ నెల 21న, నెంబరు 02812 యశ్వంత్ పూర్ భువనేశ్వర్ రైలు 23న, దారి మల్లిస్తున్నట్లు చెప్పారు.
PLD: నరసరావుపేటలోని కలెక్టరేట్లో కలెక్టర్ అరుణ్ బాబు సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని పలు గ్రామాలు, పట్టణాలకు చెందిని ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో కలెక్టర్కు అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వచ్చిన ప్రతి ఫిర్యాదును కచ్చితంగా పరిష్కరించి సమాధానం ఇవ్వాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.
NLR: జిల్లా కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం కలెక్టర్ ఆనంద్ నిర్వహించారు. అర్జీదారుల నుండి అర్జీలు కలెక్టర్ ఆనంద్ స్వీకరించారు. ఉదయం 9 గంటలకే అర్జీదారులు బారులు తీరారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె.కార్తీక్, డీఆర్వో ఉదయ భాస్కర్ రావు ఇతర అధికారులు పాల్గొన్నారు.
PLD: గురజాల మండలం పులిపాడు గ్రామ సమీపంలో సోమవారం ఉదయం నీటి గుంతలో పడి స్కూల్ బస్సు డ్రైవర్, విద్యార్థి మృతి చెందారు. ఈ క్రమంలో గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు గురజాల ప్రభుత్వ ఆసుపత్రిలో డ్రైవర్, విద్యార్థి మృతదేహాలను సందర్శించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఎమ్మెల్యే ఈ ప్రమాదం ఎలా జరిగిందో అడిగి తెలుసుకుని దైర్యం చెప్పారు.
కోనసీమ: ఆలమూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల శిథిలావస్థకు చేరుకొని 20 సంవత్సరాలు దాటిందని, వెంటనే నూతన భవనం నిర్మించాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య డిమాండ్ చేసింది. ఈ అంశంపై సోమవారం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కాలేజీ ఎదుట విద్యార్ధులు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. జిల్లా అధ్యక్షులు వెంకట్ మాట్లాడుతూ.. అందుబాటులో ఉన్న ఈ ప్రభుత్వ కళాశాలను కాపాడుకోవాలని అన్నారు.
NDL: ఉయ్యాలవాడ మండలం గోవిందపల్లె గ్రామంలో సోమవారం సోలార్ ప్లాంట్ నిర్మాణానికి ఆళ్లగడ్డ MLA భూమా అఖిలప్రియ భూమి పూజ చేశారు. గోవిందపల్లె గ్రామంలో రూ.400 కోట్ల నిధులతో ఆళ్లగడ్డ చరిత్రలోనే మొట్టమొదటి సారిగా సోలార్ ఇండస్ట్రీ ప్లాంటును నిర్మించడం చాలా సంతోషంగా ఉందని MLA అఖిలప్రియ హర్షం వ్యక్తం చేశారు. అధికారులు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
PLD: నూజెండ్ల మండలంలో నలుగురు దొంగలను ఐనఓలు పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. నరసరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు వివరాల మేరకు.. పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో పొలాల్లోని ట్రాన్స్ఫార్మర్లను పగులగొట్టి అందులోని కాపర్ వైర్లు దొంగిలించి అమ్ముకుంటున్న నలుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని చెప్పారు. వారి వద్ద నుంచి 350 కేజీల కాపర్ స్వాధీనం చేసుకున్నారు.
VZM: గ్రామస్థాయిలో భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ గ్రామ సభలు అని ఎస్కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి అన్నారు. సోమవారం లక్కవరపుకోటలో నిర్వహించిన గ్రామ రెవిన్యూ సదస్సులో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామస్థాయిలో భూమి తగాదాలు, రీ సర్వే అవకతవకలను పరిష్కరించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు.
కోనసీమ: మండపేట పురపాలక సంఘ పరిధిలో ఆధార్ ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నట్లు కమిషనర్ టీవీ రంగారావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 27 నుంచి 28 వరకు ఆధార్ క్యాంపులు జరగనున్నట్లు పేర్కొన్నారు. పట్టణ ప్రజలందరూ ఈ ఆధార్ క్యాంప్ వద్ద 0-6 సంవత్సరాల వయసుగల పిల్లలకు బాల ఆధార్, ఆ వయసు దాటిన పిల్లలకు తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
PLD: వినుకొండలోని ఓ ఛారిటబుల్ ట్రస్ట్కు మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు విరాళం అందజేశారు. సోమవారం పట్టణంలోని మక్కెన కార్యాలయంలో విరాళంగా రూ.1,00,116లను అందించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ప్రతినిధి జెట్టి శ్రీనివాసరావు మక్కెన మల్లికార్జునరావుకు కృతజ్ఞతలు తెలిపారు.
PLD: వినుకొండ పట్టణంలోని ప్రజా సమస్యల పరిష్కారానికై సోమవారం రోజు మున్సిపల్ కార్యాలయంలో చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి నేరుగా వినతులను స్వీకరించారు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రజల సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించకూడదని తెలిపారు.