SKLM: జిల్లా పరిషత్ కార్యాలయం ఆవరణంలో వర్మీ కంపోస్టు అమ్మకపు స్టాల్ను సోమవారం జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి సదర్శించారు. జిల్లాలో ఉన్న వివిధ గ్రామ పంచాయతీలలో తయారీ కాబడిన వర్మీ కంపోస్టు పరిశీలించారు. శ్రీకాకుళం కలెక్టరు స్వప్నిల్ దినకర్ పుండ్కర్ చేతుల మీదుగా ఎస్పీ వర్మీ కంపోస్టు కొనుగోలు చేశారు.
ELR: ఏలూరులో రైలు ఢీకొనడంతో ఏపీఎస్పీ పోలీస్ కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా రైల్వే ఎస్సై సైమన్ వివరాలు వెల్లడించారు. గొల్లయిగుడెంకు చెందిన మధుబాబు (41) కాకినాడలో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు. సెలవులకు ఇంటికి వచ్చి తిరిగి వెళుతున్న సమయంలో రైలు ఢీకొనడంతో మృతి చెందాడన్నారు.
TPT: ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని సీపీఎం, సీఐటీయూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. గూడూరులోని క్లాక్ టవర్ సెంటర్లో సోమవారం రోజు రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు సీపీఎం, సీఐటీయూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్మార్ట్ మీటర్లు ఆపాలని, పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని ఆందోళన చేశారు.
ATP: ఏళ్ల తరబడి సేవలందిస్తున్న గిరిజన గురుకుల ఉద్యోగులకు ప్రభుత్వం న్యాయం చేయాలని ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి కోరారు. సోమవారం ఆయన అనంతపురం జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ కార్యాలయం ముందు గిరిజన గురుకుల ఉద్యోగులతో కలసి ఆయన ధర్నా చేపట్టారు.పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కృష్ణా: చాట్రాయి మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సోమవారం చాట్రాయి ఎంఈవో 2 బ్రహ్మచారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలకు అనుగుణంగా ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం ఛార్జీలను పెంచాలని డిమాండ్ చేశారు.
GNTR: సత్తనపల్లి మండలంలో గుంతల మయంగా ఉన్న రోడ్లకు ఆర్అండ్బి శాఖ మరమ్మతులు చేపట్టింది. రామకృష్ణాపురం అడ్రోడ్ నుంచి గుడిపూడి, పెద్ద మక్కెన వరకు కాలచక్ర రహదారిపై ఉన్న గుంతలను పూడ్చారు. గతంలో అడుగుకు ఒక గుంత ఉండదని ఇప్పుడు మరమ్మతులు చేపట్టడంతో వాహనదారులు ఇబ్బందులు లేకుండా ప్రయాణం కొనసాగిస్తున్నారని ప్రజలు వాహనదారులు తెలిపారు.
నంద్యాల: కుటుంబ కలహాలతో అరుణకుమారి అనే మహిళ తన ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు బనగానపల్లె మండలం జిల్లెల్ల గ్రామంలో ఈ సంఘటన జరిగింది. మృతురాలికి భర్త ఇద్దరు పిల్లలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
కృష్ణా: కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ను గుంటూరులోని వారి కార్యాలయంలో మోపిదేవి మండలం పెదకళ్లేపల్లి జనసేన నేతలు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పంచాయతీ పరిధిలోని శివారు గ్రామాలకు రహదారుల సౌకర్యం కల్పించమని ఆయనను కోరారు. తమ సమస్యలపై పెమ్మసాని సానుకూలంగా స్పందించారని జనసేన నేతలు తెలిపారు.
అన్నమయ్య: గవర్నమెంట్ గెజిటెడ్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా మదనపల్లె పట్టణంలోని బిటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ మలిగి రాఘవరెడ్డి ఎన్నిక అయ్యారు. ఈ మేరకు సోమవారం కళాశాల నందు ఆయనకు తోటి అధ్యాపకులు సిబ్బంది ఘనంగా సత్కరించారు. అధ్యాపకుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు
కృష్ణా: ముదినేపల్లి మండలంలోని ఊటుకూరులో మంగళవారం రెవెన్యూ సదస్సు నిర్వహిస్తున్నట్లు తహశీల్దార్ జె. సుభానీ ఓ ప్రకటనలో తెలిపారు. మంగళవారం ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుందని చెప్పారు. గ్రామంలోని ప్రజలకు భూ సమస్యలు, భూములు మార్పులు, చేర్పులు వంటి సమస్యలు పరిష్కారించుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని గ్రామస్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
GNTR: మంగళగిరి నీరుకొండలో మంత్రి నారాయణ సోమవారం పర్యటించారు. నీరుకొండలో ఎంజీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం అమరావతిని నాశనం చేసే ఉద్దేశంతో R5 జోన్ తీసుకొచ్చిందని, R5 జోన్లో పట్టాలు ఇచ్చిన పేదలకు గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో స్థలాలు కేటాయిస్తామని పేర్కొన్నారు.
PPM: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జెసి శోభిక ఆధ్వర్యంలో సోమవారం నిర్వహిస్తున్న పబ్లిక్ గ్రీవెన్స్లో కురుపాం మండలం మొండెంఖల్లులో బ్యాంకు ఏర్పాటు చేయాలని, మండల పరిధిలో అక్రమ లేఔట్లు తొలగించాలని కొమరాడ ఈదలవలస పివిటిజి గ్రామంలో మినీ అంగన్వాడి కేంద్రం ఏర్పాటు చేయాలని పలువురు గిరిజన సంఘాల నాయకులు జెసి శోభికకు వినత పత్రం అందించారు.
TPT: పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి పదవులు ఇవ్వడం జరిగిందని గూడూరు ఎమ్మెల్యే పి సునీల్ కుమార్ అన్నారు. సోమవారం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సాగునీటి సంఘ ఎన్నికల సందర్భంగా టీడీపీ గూడూరు నియోజకవర్గంలో క్లీన్ స్వీప్ చేసిందని తెలిపారు. ఈ నేపథ్యంలో రాబోయే ఏ ఎన్నికలైనా టీడీపీ కోసం పనిచేసిన వారికి పదవులు ఇవ్వడం జరుగుతుందన్నారు.
కర్నూలు: ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని సోమవారం నాడు డివైఎస్ఐ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఎ నాయకులు నాగేష్ మాట్లాడుతూ.. రోగుల సంఖ్యకు అనుగుణంగా బెడ్లు, స్టేచైర్స్ ఏర్పాటు చేయాలని, ఒకే బెడ్ మీద ఇద్దరు రోగులు పడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని వారు విమర్శించారు.