• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

లక్ష్యసాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములే: ఎంపీడీవో

PLD: సుస్థిరాభివృద్ధి లక్ష్యసాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మాచవరం ఎంపీడీవో శ్రీనివాసరావు సూచించారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో సుస్థిరాభివృద్ధిపై శిక్షణా తరగతులను ఆయన ప్రారంభించారు. ఆయా గ్రామాల్లోని పంచాయతీ కార్యదర్శులు, సచివాలయం సిబ్బంది, సర్పంచులకు, మండల స్థాయి అధికారులకు ఈ శిక్షణ తరగతులు నిర్వహించామన్నారు.

December 16, 2024 / 05:01 PM IST

జంగిల్ క్లియరెన్స్ చేపట్టాలి

SKLM: ఆమదాలవలస – పాలకొండ ప్రధాన రహదారిలో ఆమదాలవలస నుంచి అక్కులపేట గ్రామం వరకు రోడ్డు ఇరువైపులా జంగిల్ క్లియరెన్స్ చేపట్టాలని ప్రయాణికులు, వాహన చోదకులు కోరుతున్నారు. రోడ్డుకి ఇరువైపులా జంగిల్ ముళ్ళు పొదలు పేరుకుపోవడంతో, మలుపులు వద్ద ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు తెలిపారు. అధికారులు స్పందించి జంగిల్ క్లియరెన్స్ చేపట్టాలని అన్నారు.

December 16, 2024 / 05:00 PM IST

అమృతోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

PLD: నరసరావుపేటలో నిర్వహించిన అమృతోత్సవంలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు సోమవారం పాల్గొన్నారు. కేరళ, ఉత్తరాఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల నుంచి స్వాములు, గురువులు, ఆశ్రమ పీఠాధిపతులు హాజరు కావడం పట్ల ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. భాష్య పారాయణంతో అన్ని రకాల సమస్యలను పరిష్కరించుకోవచ్చు అన్నారు.

December 16, 2024 / 04:59 PM IST

చింతలపాటికి నివాళులు అర్పించిన కలెక్టర్

W.G: జువ్వలపాలెం రోడ్డు అడ్డ వంతెన దగ్గర ఉన్న చింతలపాటి సీతారామచంద్ర వరప్రసాద్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ నాగరాణి నివాళులర్పించారు. సోమవారం చింతలపాటి 106వ జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వంద సంవత్సరాల క్రితం చదువే అభివృద్ధికి మూలం అని గ్రహించి, ఆడపిల్లల విద్యకు ప్రోత్సాహం అందించిన మూర్తి రాజు అని కొనియాడారు.

December 16, 2024 / 04:59 PM IST

శానిటేషన్ డ్రైవ్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే

GNTR: నరసరావుపేటలోని 14వ వార్డు కంభంపాలెంలో శానిటేషన్ డ్రైవ్‌లో నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు సోమవారం పాల్గొన్నారు. ప్రజలు పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. శానిటేషన్ సిబ్బందికి సహకరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

December 16, 2024 / 04:56 PM IST

కూరగాయల పొలాలను సందర్శించిన అధికారులు

NLR: ఇందుకూరుపేట మండలం, డేవిస్ పేటలో సోమవారం సాగు చేస్తున్న పంట పొలాలను వ్యవసాయ శాఖ సిబ్బంది, అధికారులు సందర్శించారు. రసాయన ఎరువులు వాడకం తగ్గించాలని రైతులకు సూచించారు. కూరగాయల పంటల పైన ద్రవ రూపంలో ఉన్న ఎరువులు నానో ఏరియా నానో డిఏపి కూడా ఉన్నాయన్నారు. అనంతరం నానో యూరియా, డీఏపీ క్యాబేజీ పంట పైన పిచికారి చేయించారు.

December 16, 2024 / 04:53 PM IST

ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలి

ASR: కొయ్యూరు మండలం బూదరాళ్ల పంచాయతీ బాలరేవుల గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని వార్డు సభ్యులు సాగిన సంజీవ్, తేజ కోరారు. సోమవారం ఏపీఎస్ఆర్టీసీ రీజినల్ బోర్డు ఛైర్మన్ సివేరి దొన్నుదొరను కలిసి వినతి అందజేశారు. బూదరాళ్ల పంచాయతీలో ఉన్న 33 మారుమూల గ్రామాలకు బాలరేవుల కేంద్రంగా ఉందన్నారు. ఈమేరకు బాలరేవుల వరకు బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు.

December 16, 2024 / 04:53 PM IST

సమస్యలను సత్వరమే పరిష్కరించాలి: ఎస్పీ

KKD: ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు జిల్లాలోని పోలీస్ అధికారులు కృషి చేయాలని ఎస్పీ విక్రాంత్ పార్టీ ఆదేశాలు జారీ చేశారు. సోమవారం కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కారం వేదిక కార్యక్రమంలో ఎస్పీ ప్రజల వద్ద నుండి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. 58 మంది అర్జీదారులు తమ ఫిర్యాదులను ఎస్పీకి అందజేశారు.

December 16, 2024 / 04:42 PM IST

బాల్యవివాహాలు జరిపితే చట్టపరమైన చర్యలు

ASR: బాల్యవివాహాలు ఆపాల్సిన భాద్యత అందరిపై ఉందని, బాల్యవివాహాలు జరిపితే చట్టపరమైన చర్యలు ఉంటాయని అరకులోయ సీడీపీవో శారద హెచ్చరించారు. సోమవారం స్ధానిక FPO ఆఫీసులో జరిపిన కిశోరి వికాసం మండల స్ధాయి శిక్షణలో ఆమె మాట్లాడారు. శిక్షణలో రక్తహీనత, గృహాహింసా చట్టంపై అవగాహణ కల్పించారు. ఈ కార్యక్రమంలో లాయర్ సింహాచలం, జిల్లా బాలల పరిరక్షణ అధికారి సద్దు, కన్వినర్ ప్రసన్నకుమార్ ఉన్నారు.

December 16, 2024 / 04:41 PM IST

ఉదయగిరిలో రేపటి నుంచి శిక్షణ

NLR: ఉదయగిరి ఎంపీడీవో కార్యాలయంలోని శ్రీ శక్తి భవనంలో మంగళ, బుధవారాల్లో సచివాలయ సిబ్బంది, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ కార్యక్రమం జరుగుతుందని ఎంపీడీవో అప్పాజీ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు 9 అంశాలపై శిక్షణ ఇస్తారన్నారు. ప్రధానంగా పారిశుద్ధ్య మెరుగుపై దృష్టి పెట్టడం జరుగుతుందన్నారు.

December 16, 2024 / 04:41 PM IST

ప్రజా సమస్యల వేదికకు 150 అర్జీలు

TPT: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 150 అర్జీలు వచ్చాయని కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. అర్జీదారుల సమస్యలను సావధానంగా వింటూ అర్జీలకు సంతృప్తి స్థాయిలో పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు.

December 16, 2024 / 04:38 PM IST

పకృతి వ్యవసాయ కూరగాయలు అమ్మకాలు

VZM: పాచిపెంట వ్యవసాయ కార్యాలయం ఆవరణలో మండల వ్యవసాయ అధికారి కొల్లి తిరుపతి రావు ఆధ్వర్యంలో సోమవారం పకృతి వ్యవసాయం పద్ధతిలో పండించే కాయగూరలు ఆకుకూరలు అమ్మకాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రసాయనిక ఎరువుల వాడిన కూరగాయలు వినియోగం ఆరోగ్యానికి హానికరం అని, ప్రతి ఒక్కరు ఇల్ల అవసరాలు కోసం ఐనా ఎరువులు లేని కూరగాయలు పండించుకోవాలని కోరారు.

December 16, 2024 / 04:35 PM IST

బాల్యవివాహాల నిర్మూలన పోస్టర్‌ను ఆవిష్కరించిన కలెక్టర్

TPT: కలెక్టరేట్‌లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక సమావేశ మందిరంలో ఆదివాసి అభివృద్ధి సంస్థ, స్వచ్ఛంద సంస్థల ద్వారా ముద్రించిన బాల్య వివాహల నిర్మూలన గోడ పత్రికను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జేసీ శుభం బన్సల్, జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు, ఎన్జీవోల ప్రతినిధులు పాల్గొన్నారు.

December 16, 2024 / 04:31 PM IST

సామాజిక రుగ్మతలపై బోయి భీమన్న పోరాటం: మాజీ ఎమ్మెల్యే

కోనసీమ: మహాకవి, పద్మభూషణ్, డాక్టర్ బోయి భీమన్న వర్ధంతిని పురస్కరించుకొని మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ వేమా సోమవారం బోయి భీమన్న విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. మామిడికుదురులోని బోయ భీమన్న మానవ వనరుల కేంద్రం ప్రాంగణంలోని భీమన్న కాంస్య విగ్రహా వద్ద భీమన్న పద్యం, గద్యం, వచనం, సాహిత్య రచనలతో సమాజంలో ఉన్న రుగ్మతలపై పోరాటం చేశారని వేమా కొనియాడారు.

December 16, 2024 / 04:23 PM IST

93 ఫిర్యాదులు స్వీకరించిన కర్నూలు జిల్లా ఎస్పీ

కర్నూలు: జిల్లా ఎస్పీ బిందు మాధవ్ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తరలివచ్చి తమ సమస్యలపై వినతి పత్రాలు సమర్పించారు. వారితో ఎస్పీ ఆప్యాయంగ మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. నేటి కార్యక్రమంలో మొత్తం 93 ఫిర్యాదులు స్వీకరించినట్లు ఎస్పీ తెలిపారు.

December 16, 2024 / 04:21 PM IST