• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

జవాన్ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

VZM: నెల్లిమర్ల నగరపంచాయతీ పరిధి జరజాపుపేటలో ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన సీఆర్పీఎఫ్ జవాన్ కాళ్ల మోహనరావు కుటుంబానికి ఆర్థిక సాయమందించారు. గ్రామంలోని మాజీ సైనికులు, సైనిక ఉద్యోగులు జవాన్ కుటుంబానికి రూ.30వేల ఆర్థిక సాయాన్ని సోమవారం అందజేశారు. మోహనరావు ఇటీవల సెలవుపై స్వగ్రామానికి వచ్చి అనారోగ్యంతో మృతి చెందారు.

December 16, 2024 / 05:54 PM IST

ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయండి: పరిటాల శ్రీరామ్

ATP: అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ను ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి పరిటాల శ్రీరామ్ కలిశారు. పెనుకొండ సబ్ కలెక్టర్ కార్యాలయంలో మంత్రిని కలిసి వినతి పత్రం అందజేశారు. ధర్మవరంలో మహిళా ఇండస్ట్రియల్ పార్క్, స్టిచ్చింగ్ యూనిట్ పరిశ్రమ ఏర్పాటు చేయాలని కోరారు. ఆర్థికంగా చితికిపోయిన చేనేత మహిళలకు ఉపాధి కల్పించాలని విన్నవించారు.

December 16, 2024 / 05:54 PM IST

వాహనాలను తనిఖీ చేసిన ఎస్సై

కృష్ణా: గుడివాడ మండలం దొండపాడు రోడ్డు వద్ద ఎస్సై చంటిబాబు వాహనాలను సోమవారం తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. స్కూల్ పిల్లలను ఆటోలో తీసుకువెళ్లే డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కువమంది పిల్లలను ఎక్కించుకొని, రిస్క్ చేయవద్దని అన్నారు. తల్లిదండ్రులు డ్రైవర్లను నమ్మి పిల్లలను ఆటోలలో పంపుతున్నారని, ప్రయాణంలో ఏదైనా ఇబ్బందులు ఎదురైనా చిన్నారులు చెప్పలేరని అన్నారు.

December 16, 2024 / 05:53 PM IST

అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి

ప్రకాశం: పంగులూరు మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలోని సమావేశం మందిరం నందు సోమవారం మండలంలోని గ్రామ సర్పంచులకు కార్యదర్శులకు సచివాలయ సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని ఎంపీడీవో స్వరూపరాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీల సుస్థిరాభివృద్ధికి ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు భాగస్వాములు కావాలని అన్నారు.

December 16, 2024 / 05:53 PM IST

రెండు లీటర్ల సారా సీజ్

ELR: చింతలపూడి మండలం గొల్లగూడెం, పశ్చాపురం గ్రామాల్లో నాటు సారా స్థావరాలపై ఎక్సైజ్ పోలీసులు సోమవారం దాడులు జరిపారు. ఈ నేపథ్యంలోనే ఓ మహిళను అదుపులోకి తీసుకొని 2 లీటర్ల సారా సీజ్ చేసామని సీఐ అశోక్ తెలిపారు. పాత కేసుల్లో నేరస్తుడు ఓ వ్యక్తిని మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ముందు బైండ్ ఓవర్ చేశామన్నారు. ఇందులో ఈ దాడుల్లో ఎస్సై అబ్దుల్ ఖలీల్, సిబ్బంది పాల్గొన్నారు.

December 16, 2024 / 05:51 PM IST

ఏపీ సీడ్స్ ద్వారా రాయితీ విత్తనాలు

SKLM: ఏపీ సీడ్స్ ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు రాయితీపై అందించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. ఈ మేరకు అమరావతిలో అధికారులతో సోమవారం సమావేశమయ్యారు. చిరుధాన్యాలు సాగు, వినియోగం పెంచే విధంగా విత్తన దశ నుంచే రాయితీ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. రాయితీపై ఇస్తున్న విత్తనాలను రైతులు సద్వినియోగ చేసుకోవాలన్నారు.

December 16, 2024 / 05:51 PM IST

ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులు పంపిణీ

SKLM: నందిగాం మండలం పెద్ద బాణాపురం గ్రామంలో సోమవారం ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులను పంపిణీ చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలలో ఒకటైన ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులను నమోదు చేసుకొని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ ఎగ్జిక్యూటివ్ నెంబర్ జగన్నాథ్, పరమేశ్వరరావు, శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

December 16, 2024 / 05:50 PM IST

మంత్రి బీసీ అధ్యక్షతన TFC భేటి

NDL: సచివాలయంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధ్యక్షతన సోమవారం టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం జరిగింది. నేషనల్ హైవే(NHAI) ప్రాజెక్టులు, రైల్వే ప్రాజెక్టుల పనుల వేగవంతం, రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ, అటవీ క్లియరెన్స్ వంటి అంశాలపై మంత్రి బీసీ టాస్క్ ఫోర్స్ కమిటీ అధికారులతో సమీక్షించారు. పెండింగ్ పనులపై సమీక్షించి మంత్రి దిశా నిర్దేశం చేశారు.

December 16, 2024 / 05:50 PM IST

వేతనాలు విడుదల చేయాలని వినతి పత్రం అందజేత

SKLM: ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్లకు గత ఆరు నెలలుగా వేతనాలు అందక అవస్థలు పడుతున్నారని రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు సిర్ల ప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన కొత్తూరు మండల విద్యాశాఖ అధికారి గోవిందరావుకు సోమవారం వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..  కార్మికుల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని తెలిపారు.

December 16, 2024 / 05:46 PM IST

‘పార్టీ కోసం కష్టపడే వారికే పదవులు’

NLR: పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి తప్పకుండా పదవులు వస్తాయని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. కార్యకర్తల కృషితోనే గూడూరులో టీడీపీ విజయం సాధించిందన్నారు. గూడూరులో పార్టీ బలోపేతానికి కార్యకర్తలు, నాయకులు మరింత కృషి చేయాలన్నారు.

December 16, 2024 / 05:45 PM IST

‘ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై నిరసన ర్యాలీ’

SKLM: రణస్థలం మండల కేంద్రంలో సుప్రీంకోర్టు ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ మాల సంఘాలు నేతలు సోమవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే గొర్ల కిరణ్ కుమార్ మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో షెడ్యూల్డ్ కులాల ప్రజలు మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు.

December 16, 2024 / 05:43 PM IST

‘ఆక్రమించిన భూమిపై నివేదిక ఇవ్వాలి’

VZM: రాష్ట్ర ప్రభుత్వం తన తండ్రికి కేటాయించిన 40 సెంట్ల భూమిని వేరొకరు ఆక్రమించుకొన్నారని ఆక్రమణలు తొలగించి తన భూమిని దక్కేలా చేయాలని ప్రజావినతులు పరిష్కార వేదికలో ఆర్జీదారుడు చేసుకొన్న వినతిని విజయనగరం జిల్లా కలెక్టర్ డా,బి.అర్.అంబేద్కర్ స్పందించారు. తక్షణం సమస్యను పరిష్కారం చేయాలంటూ బొబ్బిలి ఆర్డీవోను ఆన్‌లైన్ ద్వారా ఆదేశించారు.

December 16, 2024 / 05:43 PM IST

ఉపాధ్యాయురాలును పరామర్శించిన ఎమ్మెల్యే

SKLM: కవిటి మండలం బైరిపురం గ్రామానికి చెందిన ఉపాధ్యాయురాలు బి భారతి స్కూలుకి నడుచుకుంటూ వెళ్తుంటే దుండగులు అడ్డగించి తలపై తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇచ్చాపురం ఎమ్మెల్యే అశోక్ బాబు ప్రభుత్వ ఆసుపత్రికు వెళ్లి బాధ్యతరాలను పరామర్శించారు. స్థానికంగా ఉన్న వైద్యుల్ని మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

December 16, 2024 / 05:41 PM IST

నాటు సారాను స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ అధికారులు

నంద్యాల: జిల్లా ఎక్సైజ్ అధికారి రవికుమార్ ఆదేశాల మేరకు సోమవారం నందికొట్కూరులో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో అక్రమంగా నాటుసారా అమ్ముతున్న షికారి జోహారా అనే వ్యక్తి నుంచి పది లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ రామాంజనేయులు తెలిపారు. అక్రమ నాటు సార చట్టరీత్యా నేరమని విక్రదారులు నాటు సారా అమ్మకాలను మానుకోవాలన్నారు.

December 16, 2024 / 05:40 PM IST

నుడా ఛైర్మన్‌ని కలిసిన చంచల బాబు యాదవ్

NLR: నుడా ఛైర్మన్‌గా బాధ్యతలు చేపడుతున్న టీడీపీ సీనియర్ నాయకులు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిని, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, మాజీ జెడ్పీ ఛైర్మన్ పి.చెంచల బాబు యాదవ్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపి సాలువతో సన్మానించారు. రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీలో మరింత ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు.

December 16, 2024 / 05:38 PM IST