• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి’

PLD: మెగా జాబ్ మేళా బ్రోచర్‌ని సత్తెనపల్లిలో సోమవారం ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 22వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు సత్తెనపల్లిలోని విద్యా కేంద్రం డిగ్రీ కాలేజ్‌లో మెగా జాబ్ మేళా జరుగుతుంది అన్నారు. నియోజకవర్గంలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు.

December 16, 2024 / 06:15 PM IST

ట్రాఫిక్ నియమాలు పాటించాలి

SKLM: ట్రాఫిక్ నియమాలు పాటించి,హెల్మెట్ ధరించాలని ట్రాఫిక్ ఎస్సై సుధాకర్ అన్నారు. సోమవారం శ్రీకాకుళం కాంప్లెక్స్, ఎస్పీ కార్యాలయం ప్రాంతాలలో విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ మేరకు వాహన చోదకులు, ఆటో డ్రైవర్లుకు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు.

December 16, 2024 / 06:15 PM IST

జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

VZM: లక్కవరపుకోట మండల కేంద్రంలో జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ని-క్షయ్ శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా శృంగవరపుకోట నియోజకవర్గ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి పాల్గొన్నారు. ప్రజలందరూ టీబీ వ్యాధి పట్ల శ్రద్ధ వహించాలని, అలాగే టీబీ రహిత భారత్‌కు సహకరించాలని ఆమె ప్రజలను కోరారు.

December 16, 2024 / 06:14 PM IST

విశేషంగా ఆకట్టుకున్న రైతు సదస్సు

KDP: వల్లూరు మండల పరిధిలోని దిగువ పల్లెలోఏరువాక కేంద్రం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన రైతు సదస్సు అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డా అంకయ్య కుమార్, కేవీకే కోఆర్డినేటర్ వీరయ్య.. రైతులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ నరసింహారెడ్డి, పాల్గొన్నారు.

December 16, 2024 / 06:12 PM IST

ఆజ్ఞాతం నుంచి బయటకు పేర్ని నాని

కృష్ణా: రేషన్ బియ్యం మాయం కేసులో గత వారం రోజులుగా మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లిందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో పేర్ని నాని సోమవారం ప్రత్యక్షమయ్యారు. మచిలీపట్నంలోని తన నివాసంలో ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆ పార్టీ నేతలు సోషల్ మీడియాలో షేర్ చేశారు.

December 16, 2024 / 06:11 PM IST

సమస్యల పరిష్కారం కోసం జనవాణి

VSP: ప్రజా సమస్యల వేదికగా మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం వినతులు స్వీకరించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ ఆదేశాలు మేరకు మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన జనవాణి కార్యక్రమంలో విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు, జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొన్నారు.

December 16, 2024 / 06:09 PM IST

ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక‌కు 143 విన‌తులు

VZM: ఈరోజు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 143 వినతులు అందాయి. ఇందులో రెవిన్యూ శాఖ‌కు సంబంధించిన అంశాల‌పై 98, పంచాయ‌తీరాజ్ శాఖ‌కు13, గ్రామ వార్డు స‌చివాల‌య శాఖ‌కు, DRDAకు 6 చొప్పున‌, మున్సిపల్, విద్యుత్‌, వైద్య ఆరోగ్య‌, విద్యా శాఖ‌ల‌కు 4 వంతున‌, మిగిలినవి ఇతర శాఖకు చెందినవి అందాయి. వీటిని జేసీ సేతు మాధవన్ స్వీకరించారు.

December 16, 2024 / 06:09 PM IST

వీఎంఆర్డీఏ ప్రజా దర్బార్‌కి విశేష స్పందన

VSP: విశాఖ వీఎంఆర్‌డీఏ ప్రజాదర్బార్‌కు 15 అర్జీలు వచ్చినట్టు సంస్థ ఛైర్మన్ ప్రణవ్‌గోపాల్‌, కమీషనర్‌ విశ్వనాథన్‌ సోమవారం తెలిపారు. అర్జీదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అలానే రహదారి విస్తరణకి సంబందించి బాధితులతో స్వయంగా మాట్లాడి వారికి దైర్యం చెప్పారు. అనంతరం అధికారులతో వారి సమస్యలను చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

December 16, 2024 / 06:08 PM IST

339వ రోజుకు చేరుకున్న డొక్కా సీతమ్మ భోజన కార్యక్రమం

SKLM: రణస్థలం మండల కేంద్రంలో జనసేన పార్టీ నాయకులు గొర్ల సూర్య నిర్వహిస్తున్న డొక్కా సీతమ్మ ఉచిత భోజన కార్యక్రమం సోమవారం నాటికి 339వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా జనసేన నాయకులు, సుడా ఛైర్మన్ కోరికాన రవికుమార్ ఈ శిబిరానికి విచ్చేసి భోజనం చేశారు. అనంతరం ఆయనను సత్కరించారు. ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్న సూర్యకు ఆయన అభినందనలు తెలిపారు.

December 16, 2024 / 06:06 PM IST

పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల శిక్ష

VZM: 1వ పట్టణ పోలీసు స్టేషన్‌లో 2020లో నమోదైన పోక్సో కేసులో నిందితుడు విశాఖపట్టణం జిల్లా పద్మనాభం మండలం పొట్నూరు గ్రామానికి చెందిన అప్పలనాయుడుకు 20ఏళ్ల కఠిన కారాగార శిక్షను కోర్టు విధించిందని ఎస్పీ వకుల్ జిందాల్ సోమవారం తెలిపారు. మెంటాడకు చెందిన ఒక బాలికను ప్రేమ పేరిట శారీరకంగా అనుభవించి మోసం చేశాడనే ఫిర్యాదుతో పొక్సో కేసు నమోదైందన్నారు.

December 16, 2024 / 06:05 PM IST

‘జనసేన పార్టీని బలోపేతం చేస్తాం’

KRNL: కోసిగి మండలం గౌడ్ గల్ గ్రామంలో జనసేన పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జనసేన పార్టీని బలోపేతం చేయాలని లక్ష్మన్న పిలుపునిచ్చారు. జనసేన పార్టీ కార్యకర్తలు అందరికీ జనసేన పార్టీ అండగా ఉంటుందని లక్ష్మణ భరోసా ఇచ్చారు. గౌడ్గల్లు గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, వీధిలైట్లు కూడా లేవని లక్ష్మణ ఆవేదన వ్యక్తం చేశారు.

December 16, 2024 / 06:05 PM IST

‘ఎన్నికల్లో గెలిచిన వారు అభివృద్ధికి కృషి చెయ్యాలి’

GNTR: నీటి సంఘాల ఎన్నికలలో ఎన్నికైన నీటి సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, టీసీ మెంబర్లకు గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం అభినందన సభ జరిగింది. ఈ కార్యక్రమంలో తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పాల్గొని నూతనంగా ఎన్నికైన సభ్యులకు అభినందనలు తెలిపారు. ఎన్నికల్లో గెలిచిన వారు అభివృద్ధికి కృషి చెయ్యాలని ఎమ్మెల్యే తెలిపారు.

December 16, 2024 / 06:04 PM IST

వైసీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీపీ

SKLM: ఎచ్చెర్ల మండలం పెద్దరుప్పపేట గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త రుప్ప సన్యాసీరావు ఇటీవల స్వర్గస్తులైనారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎంపీపీ మొదలవలస చిరంజీవి సోమవారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయనతోపాటు మండల విప్ రాజారావు, వైసీపీ నాయకులు సత్తారు గోపి, సూర్యనారాయణ, తదితరులు ఉన్నారు.

December 16, 2024 / 06:01 PM IST

రాజ్యసభ సభ్యులను అభినందించిన మాగుంట

ప్రకాశం: రాష్ట్రం నుంచి రాజ్యసభకు కొత్తగా ఎన్నికై సోమవారం ప్రమాణస్వీకారం చేసిన సభ్యులను ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అభినందించారు. బీద మస్తాన్ రావు. సానా సతీష్ బాబు, ఆర్ కృష్ణయ్యలు కొత్తగా ఎన్నికయ్యారు. వీరిని రాజ్యసభ ఛైర్మన్ జగదీష్ దనఖర్, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, రామ్మోహన్ నాయుడు, సహచార పార్లమెంట్ సభ్యులు అభినందించారు.

December 16, 2024 / 06:00 PM IST

శిక్షణ తరగతులను ప్రారంభించిన ఎంపీపీ

SKLM: ఎచ్చెర్ల మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం సర్పంచులు పంచాయతీ కార్యదర్శుల శిక్షణ కార్యక్రమాన్ని ఎంపీపీ మొదలువలస చిరంజీవి జ్యోతి ప్రజ్వల చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీపీడీపీ ప్లాన్‌లో భాగంగా నిర్వహిస్తున్న ఈ శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. స్థానిక సంస్థల పరిపాలన హక్కులు, పరిమితులపై అవగాహన పెంచుకోవాలన్నారు.

December 16, 2024 / 05:55 PM IST