KRNL: జిల్లా కలెక్టర్ ఎ. సిరి గురువారం విజయవాడకు బయలుదేరి వెళ్లారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబరు 30వ తేదీ వరకు దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలు గృహ గణన చేపడుతున్నాయి. అందులో భాగంగా రాష్ట్రంలో మే 1 నుంచి 30 వరకు నెల రోజుల పాటు గృహ గణన చేపడతామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తెలియజేసింది. ఏప్రిల్ 15 నుంచి 30 వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్కు అవకాశం ఉంది.