• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

భీమడోలు మండలంలో 15 వినతులు పరిష్కరించాం

ELR: భూ సమస్యల పరిష్కారం ధ్యేయంగా, ప్రభుత్వం నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని వినియోగించుకోవాలని బిసి సంక్షేమ శాఖ జిల్లా అధికారి నాగమణి కోరారు. అంబర్ పేట గ్రామంలో సోమవారం రెవెన్యూ సదస్సులను నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తుల నుంచి 15 వినతులు రాగ, వాటిలో నాలుగు వినతులను పరిష్కరించామన్నారు.

December 16, 2024 / 07:23 PM IST

పరీక్ష పత్రాలు లీక్ చేస్తే ఉద్యోగం నుంచి తొలగిస్తాం

NLR: ప్రభుత్వ పాఠశాలలో జరిగే పరీక్ష ప్రశ్నా పత్రాలను లీక్ చేస్తే ఉద్యోగం నుంచి తొలగిస్తామని ఉదయగిరి ఎంఈవో-2 తోట శ్రీనివాసులు హెచ్చరించారు. ఎస్ఏ-1 పరీక్షల్లో భాగంగా సోమవారం జరగాల్సిన గణితం ప్రశ్న పత్రం లీక్ అవ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలు నిలిచిపోయాయన్నారు. విద్యాశాఖ ఆదేశాల మేరకు సైన్స్, సోషల్ ప్రశ్న పత్రాలను ఉదయగిరి పోలీస్ స్టేషన్‌కి అప్పగించామన్నారు.

December 16, 2024 / 07:15 PM IST

‘బ్రిడ్జ్ మరమ్మతులకు ప్రతిపాదనలను సిద్ధం చేయండి’

CTR: నగరి కీలపట్ల వద్ద డ్యామేజ్ అయిన లోలెవల్ బ్రిడ్జిను సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, నగరి MLA గాలి భాను ప్రకాష్‌తో కలిసి పరిశీలించారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా రాకపోకలకు ఇబ్బందులు లేకుండా లో లెవెల్ బ్రిడ్జ్ మరమ్మతులు చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ఆర్ అండ్ బి అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

December 16, 2024 / 07:14 PM IST

చేప ఉత్పత్తుల తయారీ పై శిక్షణ

SKLM: చేపలతో విలువదారిత ఉత్పత్తుల తయారు చేయడం ద్వారా మత్స్యకారులు, చేపల పెంపకందారులు ఆదాయం పొందవచ్చు అని ఆమదాలవలస KVK ప్రధాన శాస్త్రవేత్త కె.భాగ్యలక్ష్మి అన్నారు. KVK కేంద్రంలో జాతీయ మత్య అభివృద్ధి మండల ఆధ్వర్యంలో చేపలు, రొయ్యల విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ పై సోమవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

December 16, 2024 / 07:12 PM IST

నాటు సారా ఊటను ధ్వంసం చేసిన పోలీసులు

ప్రకాశం: దోర్నాల మండలంలోని వై.చర్లపల్లి అడవి ప్రాంతంలో నాటు సారా స్థావరాలపై సోమవారం పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 1000 లీటర్ల పులియ బెట్టిన బెల్లం ఊటను ధ్వంసం చేసినట్లు దోర్నాల ఎస్సై మహేష్ తెలిపారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ.. మండలంలో ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై మహేష్ హెచ్చరించారు.

December 16, 2024 / 07:11 PM IST

పాడేరులో ఈనెల 19వ తేదీన జాబ్ మేళా

ASR: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 19న పాడేరు పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారిణి డాక్టర్ పీ.రోహిణి తెలిపారు. డెలివరీ, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకు తదితర పలు ప్రముఖ కంపెనీలు పాల్గొని నిరుద్యోగ అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. పది, ఇంటర్, డిగ్రీ చదివిన అభ్యర్థులు హాజరు కావాలన్నారు.

December 16, 2024 / 07:07 PM IST

ఎమ్మెల్యే రేపటి పర్యటన షెడ్యూల్

CTR: గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ రేపటి పర్యటన షెడ్యూల్‌ను ఆయన కార్యాలయం సోమవారం విడుదల చేసింది. రేపు ఉదయం 11 గంటలకు కార్వేటినగరంలో జరిగే రెవెన్యూ సదస్సులో పాల్గొంటారని చెప్పారు. అనంతరం పాలసముద్రం, వెదురుకుప్పం, కార్వేటి నగరం మండలాల నీటి సంఘం సభ్యుల సన్మాన కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని సూచించారు.

December 16, 2024 / 07:02 PM IST

‘ఎస్టీల సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలు అమలు’

W.G: ఎస్టీల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని వాటిని సక్రమంగా వినియోగించుకోవాలి ఎస్టీ కమిషన్ సభ్యుడు శంకర నాయక్ అన్నారు. కొవ్వూరు మండలం మద్దూరులో గిరిజన కుటుంబాలతో ఆయన సోమవారం ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వారికి వివరించారు. అలాగే వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

December 16, 2024 / 07:00 PM IST

విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు ముఖ్యం: శ్రావణ్

పల్నాడు: ఫిరంగిపురం దీనాపూర్‌లోని డాక్టర్ రంజన్ బాబు కమ్యూనిటీ జూనియర్ కళాశాలలో పల్నాడు జిల్లా రగ్బీ అసోసియేషన్ ఆధ్వర్యంలో 15,16 తేదీలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలు సోమవారంతో ముగిశాయి. కార్యక్రమంలో తాడికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పాల్గొని విజేతలకు కప్పులు, ప్రశంసా పత్రాలు అందజేశారు.

December 16, 2024 / 06:56 PM IST

దేవాలయాల్లో చోరీ చేసి దొంగల అరెస్టు

ప్రకాశం: దేవాలయాల్లో చోరీ చేసే దొంగలను అరెస్టు చేసినట్లు ఎస్పీ దామోదర్ చెప్పారు. ఒంగోలులో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నాగులుప్పలపాడు మండలం నిడమానూరు, చదలవాడలోని గుళ్లలో వెండి వస్తువులను సిపన్య, ఈశ్వర్, శ్రీకాంత్ చోరీ చేసి కాకినాడ కృష్ణారావుకు అమ్మారు. కృష్ణారావు రైలులో చెన్నై వెళుతుండగా అదుపులోకి తీసుకుని చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నామన్నారు.

December 16, 2024 / 06:52 PM IST

బాధితుడికి CMRF చెక్కును అందించిన మంత్రి

కోనసీమ: కే.గంగవరం (పామర్రు) మండలంలోని బ్రహ్మపురి గ్రామానికి చెందిన మేడ ఏడుకొండలు అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఏడుకొండలకు మంజూరు అయిన రూ.30 వేలు నగదు చెక్కును రామచంద్రాపురంలోని కార్యాలయం వద్ద సోమవారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆయనకు అందజేశారు. 

December 16, 2024 / 06:49 PM IST

ఎమ్మెల్యేను సన్మానించిన నూతన సాగునీటి సంఘం ఛైర్మన్

ATP: పామిడి సాగునీటి సంఘం ఛైర్మన్‌గా ఎన్నికైన ఓబులాపురం వెంకటేష్ సోమవారం గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంను మర్యాద పూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలిసి పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు. నూతన ఛైర్మన్ వెంకటేష్ మాట్లాడుతూ.. తన మీద నమ్మకం ఉంచి ఈ పదవి ఇచ్చిన ఎమ్మెల్యే జయరాంకు కృతజ్ఞతలు తెలిపారు.

December 16, 2024 / 06:47 PM IST

‘భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు’

W.G: భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రెవెన్యూ సదస్సులను రైతులు, ప్రజలు వినియోగించుకోవాలని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. కొవ్వూరులో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన సోమవారం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయంలో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపించారు.

December 16, 2024 / 06:41 PM IST

‘విగ్రహావిష్కరణ రాజకీయం చేయొద్దు’

కృష్ణా: సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ వేదికను రాజకీయం చేయవద్దంటూ గౌడ సంఘానికి చెందిన పలువురు నాయకులు స్పష్టం చేశారు. నూజివీడు పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో సోమవారం ఆరేపల్లి శ్రీనివాసరావు, పామర్తి నాగేంద్రులు మాట్లాడారు. గౌడ సంఘీయుల ఆధ్వర్యంలో రాజకీయాలకు అతీతంగా గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ చేసినట్లు తెలిపారు.

December 16, 2024 / 06:39 PM IST

‘STల సమస్యల పరిష్కారానికి కృత నిశ్చయంతో ఉన్నాం’

E.G: రాష్ట్రంలో అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు 34 షెడ్యూల్ తెగల వారు ఉన్నారని వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఎస్టీ కమిషన్ సభ్యులు శంకర్ నాయక్ తెలిపారు. రాజమండ్రి రూరల్ మండలం వేమగిరి పంచాయతీ వద్ద సోమవారం గిరిజన సంక్షేమ శాఖ అధికారి జ్యోతి మండల స్థాయి అధికారులతో ST కుల పెద్దలతో సమావేశం నిర్వహించి, వారి సమస్యలు తెలుసుకున్నారు.

December 16, 2024 / 06:38 PM IST