SKLM: టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ గోవిందమ్మ తెలిపారు. ఈ మేరకు ఇంటర్, ITI , డిగ్రీ, బీటెక్ పూర్తి చేసి 19 నుంచి 30 ఏళ్ల వయసు గల యువకులు అర్హులన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
GNTR: ఇటీవల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన గోపీ మూర్తి, పీడీఎఫ్ నేత కే.ఎస్.లక్ష్మణరావు తదితరులు సోమవారం తాడేపల్లి పరిధి ఉండవల్లి నివాసంలో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గోపీ మూర్తిని లోకేశ్ అభినందించారు. పాఠశాల విద్యావ్యవస్థలో తెస్తున్న సంస్కరణల గురించి ఈ సందర్భంగా వివరించారు.
GNTR: మంగళగిరిలోని AIIMSలో నేడు జరగనున్న ప్రథమ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులకు ధ్రువపత్రాలను ప్రదానం చేయనున్నారు. అలాగే దేశంలో ఆరోగ్య రంగం అభివృద్ధి కోసం జరుగుతున్న చర్యలపై ప్రసంగించనున్నారు. రాష్ట్రపతి రాకతో అధికారులు భద్రతా ఏర్పాట్లను చేస్తున్నారు.
CTR: సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఈనెల 19వ తేదీన కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంలో పర్యటించనున్నట్లు ఆ పార్టీ నేతలు వెల్లడించారు. ఇందులో భాగంగా ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమానికి నాయకులు, పార్టీ కార్యకర్తలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
కృష్ణా: రాష్ట్ర గనుల శాఖామంత్రి కొల్లు రవీంద్రను మచిలీపట్నంలోని ఆయన నివాసంలో మాజీ ఉపసభాపతి బూరగడ్డ వేదవ్యాస్ సోమవారం పరామర్శించారు. ఇటీవల ఆయన సోదరుడు వెంకటరమణ ఆకస్మికంగా మృతి చెందడంతో విషయం తెలుసుకున్న బూరగడ్డ మంత్రిని పరామర్శించి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
CTR: నగిరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాశ్ను ఎమ్మార్పీఎస్ బృందం సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్బంగా నగిరి నియోజకవర్గంలోని పలు సమస్యలపై వారికి వినతి పత్రం రూపంలో అందించారు. సమస్యలను త్వరగా పరిష్కరించాలని వారు MLAకు విన్నవించారు.
SKLM: ఎచ్చెర్ల నియోజకవర్గంలో రెవెన్యూ పరమైన ప్రధాన సమస్యలను పై ఎమ్మెల్యే N.ఈశ్వరరావు తన క్యాంప్ కార్యాలయంలో సోమవారం రివ్యూ మీటింగ్ను నిర్వచించారు. ఈ సమావేశంలో 4 మండలాల అధికారులు పాల్గొన్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో పాలన పరంగా ఎదురవుతున్న సమస్యలు, రీ సర్వే జరిపిన తరువాత ఏర్పడిన ఇబ్బందులను చర్చించినట్లు తెలిపారు.
VZM: బొబ్బిలిలో సిగరెట్ వ్యాపారులను విజిలన్స్ అధికారులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. ఇంకుల రమేష్, రాయగడ రమేష్ అనే వ్యక్తులు బిల్లులు లేకుండా సిగరెట్లు ఒడిస్సా నుండి తెస్తుండగా బొబ్బిలి పట్టణంలో విజిలన్స్ అధికారి రామారావు సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. మొత్తం ఆరు సిగరెట్ బైల్స్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
E.G: వై.రామవరం మండలం కేంద్రంలోని గిరిజన గ్రామాల్లో రహదారి సదుపాయం కల్పించాలని కోరుతూ ఆదివాసీ చైతన్య వేదిక అధ్యక్షుడు వెదుళ్ల లచ్చి రెడ్డి సోమవారం రిలే నిరాహార దీక్ష చేపట్టారు. రవాణా సౌకర్యం లేక డోలీల మీద ఆధారపడుతు గ్రామస్థులు నిత్యవసరాలు, వైద్య సేవల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. స్పందించకపోతే దీక్షను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ASR: అరకులోయ మండలం సుంకరమెట్ట, బిసుపురం గ్రామాల పరిధిలోని కాఫీ తోటలను జీసీసీ ఛైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ సందర్శించారు. ఈ మేరకు కిడారి మాట్లాడుతూ.. రైతులు కాఫీని జీసీసీకి విక్రయించాలని కోరారు. కాఫీకి ఏవరూ ఇవ్వనంత రేటు జీసీసీ ప్రకటించిందని, రైతులకు లోను సౌకర్యం కూడా కల్పిస్తుందని కిడారి పేర్కొన్నారు. రైతులు కాఫీని దళారులకు అమ్మి మోసపోవద్దని సూచించారు.
CTR: కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్త్రీ స్వేచ్ఛ-సాధికారితపై అవగాహన సదస్సు సోమవారం నిర్వహించారు. ప్రిన్సిపల్ నారాయణమూర్తి మాట్లాడుతూ.. మహిళలు నేడు అన్ని రంగాలలో అభివృద్ధి చెంది మకుటం లేని మహారాణుల్లాగా వెలుగుతున్నారన్నారు. ముఖ్యంగా మహిళలు విద్యారంగంలో రాణించాలని సూచించారు.
కర్నూల్: జిల్లాలోని నర్సింగ్ కళాశాలలు ఫీజుల పేర్లతో ఆర్థిక దోపిడీ చేస్తున్నా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న డీఎంహెచ్ఐపై కఠిన చర్యలు తీసుకోవాలని నర్సింగ్ స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు భాస్కర్ నాయుడు డిమాండ్ చేశారు. సోమవారం పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నవ్యకు ఫిర్యాదు చేశారు.
కృష్ణా: కంకిపాడు మండల పరిధిలోని కందలంపాడులో సోమవారం రెవెన్యూ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ తహశీల్దార్ భావన్నారాయణ పాల్గొని రైతుల దగ్గర నుంచి పలు రకాల సమస్యల అర్జీలను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అర్జీలను సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
W.G: జిల్లాలో పర్యాటక ప్రదేశాలను గుర్తించాలని వాటిని అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సోమవారం సీఎం చంద్రబాబు ఈ అంశాన్ని ప్రస్తావించారని, ఈ మేరకు ప్రతి అసెంబ్లీ పరిధిలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు 10 ఎకరాల భూమిని సేకరించాలని సూచించారు.
VZM: కాన్స్టీట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో న్యూ ఢిల్లీలో జరుగుతున్న “5వ ఎంపీల బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఫైనల్” జరుగుతుంది. దీనిలో భాగంగా కేంద్ర కార్మిక, ఉపాధి, యువజన వ్యవహారాలు మరియు క్రీడల శాఖా మంత్రి డా.మన్సుఖ్, L.మాండవియా తో కలిసి విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.