• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘మీ సమస్య 45 రోజుల్లో పరిష్కారం’

KDP: ప్రజలు, రైతులకు సంబంధించిన ఏ సమస్యనైనా 45 రోజుల్లో పరిష్కరిస్తామని తహశీల్దార్ నజీర్ అహ్మద్ పేర్కొన్నారు. సోమవారం పులివెందుల మున్సిపాలిటీలోని చిన్న రంగాపురం గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఆయన ప్రజలు, రైతులకు సంబంధించిన వివిధ సమస్యలు, భూసమస్యల వినతి పత్రాలను స్వీకరించారు. కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, గ్రామస్థులు, రైతులు పాల్గొన్నారు.

December 16, 2024 / 07:43 PM IST

అనంతలో ట్రాఫిక్ నిబంధనలు కఠినతరం

ATP: ఏపీ హైకోర్టు సూచనల మేరకు అనంతపురం నగరంలో ట్రాఫిక్ నిబంధనలు కఠినతరంగా ఉంటాయని డీఎస్పీ వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం ఆయన అనంతపురం సబ్ డివిజన్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నియంత్రణే ధ్యేయంగా రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు.

December 16, 2024 / 07:42 PM IST

విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా బిల్లులు దగ్ధం

PLD: ఎడ్లపాడులోని జాతీయ రహదారిపై సోమవారం సీపీఎం ఆధ్వర్యంలో పెంచిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. సీపీఎం నాయకులు పీటర్, హరిబాబు, సుబ్బారావులు మాట్లాడుతూ.. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకు పోరాటం చేస్తామన్నారు. విద్యుత్ బిల్లులను దగ్ధం చేసి తమ ఆందోళన తెలిపారు. కూటమి ప్రభుత్వ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు గుర్తు చేశారు.

December 16, 2024 / 07:41 PM IST

ఉద్యోగం ఇప్పిస్తానని మోసం.. ఎస్పీకి ఫిర్యాదు

నంద్యాల: జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ 96 ఫిర్యాదులను స్వీకరించారు. పట్టణంలోని శిల్ప నగర్‌కు చెందిన కుమార్ అనే వ్యక్తి ఉద్యోగం ఇస్తానని నమ్మించి నా వద్ద నుంచి రూ. 2.30 లక్షల రూపాయలు డబ్బులు తీసుకుని ఉద్యోగం ఇవ్వకుండా మోసం చేశారని నంద్యాలకు చెందిన సుమలత ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

December 16, 2024 / 07:41 PM IST

సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి: కమిషనర్

KKD: డయల్‌ యువర్‌ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థకు వచ్చే సమస్యల అర్జీల పరిష్కారానికి సత్వరం చొరవ చూపాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ భావన, నగరపాలక అధికారులను ఆదేశించారు. సోమవారం కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి కమిషనర్ భావన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎనిమిది మంది కమిషనర్‌కు తమ సమస్యలు వివరించారు.

December 16, 2024 / 07:40 PM IST

హ్యూమన్ రైట్స్ మహిళా సెక్రెటరీగా మున్ని

KDP: ప్రొద్దుటూరుకు చెందిన షేక్ మున్ని లోకాసమస్త హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇంటర్నేషనల్ లిబరేషన్ సంస్థ కడప జిల్లా మహిళా విభాగ జనరల్ సెక్రటరీగా నియమితులయ్యారు. సంస్థ ఫౌండర్, నేషనల్ ఛైర్మన్ జీపీ నరసింహులు తనను జిల్లా మహిళా విభాగ జనరల్ సెక్రెటరీగా నియమించినట్లు సోమవారం మున్ని తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

December 16, 2024 / 07:39 PM IST

రేపు చామలూరులో రెవెన్యూ సదస్సు

KDP: కొండాపురం మండలంలోని చామలూరులో భూ సమస్యల పరిష్కారం కోసం మంగళవారం రెవెన్యూ సదస్సు నిర్వహిస్తున్నట్లు తహశీల్దార్ సి గురప్ప తెలిపారు. గ్రామస్థాయి భూతగాదాలు రీసర్వే అవకతవకలు, భూ సమస్యలు ఉన్నవారు తమ దృష్టికి అర్జీల రూపంలో తీసుకురావాలని తహశీల్దార్ కోరారు. ఈ సదస్సును గ్రామ కమ్యూనిటీ హాలులో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

December 16, 2024 / 07:38 PM IST

గ్రామాల అభివృద్ధిలో గ్రామస్తులను భాగస్వామ్యం చేయాలి

VZM: గ్రామాల అభివృద్ధిలో గ్రామస్తులను భాగస్వామ్యం చెయాలని ఎంపీడీవో ఇప్పలవలస సురేష్ కోరారు. చీపురుపల్లి మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచ్లకు, మండల స్థాయి అధికారులకు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై సోమవారం శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల ద్వారా గ్రామాల్లో సుస్థిర అభివృద్ధి సాధించవచ్చన్నారు.

December 16, 2024 / 07:35 PM IST

‘తైక్వాండో శిక్షణతో విద్యార్థినిల్లో మానసిక ధైర్యం’

KDP: తైక్వాండో ఆత్మ విశ్వాసంతో ధైర్యంగా ముందుకెళ్లగలిగేలా తయారు చేస్తుందని వైవీయూ వీసీ ఆచార్య కె కృష్ణారెడ్డి అన్నారు. “ఫిట్ ఇండియా 11 వారోత్సవాలలో భాగంగా.. సోమవారం సాయంత్రం వైవీయూ వసతి గృహా విద్యార్థినిలకు క్యాంపస్‌లో తైక్వాండో శిక్షణ తరగతులను వీసీ కృష్ణారెడ్డి ప్రారంభించారు. తైక్వాండో శిక్షణ నిపుణులు నాగూర్ బాబు శిక్షణ ఇచ్చారు.

December 16, 2024 / 07:35 PM IST

బస్సు షెల్టర్ నిర్మాణానికి భూమి పూజ చేసిన: MLA

KDP: ప్రొద్దుటూరు గోపవరం పంచాయతీ ఉప్పాగులో ప్రజల సౌకర్యార్థం నూతన బస్ షెల్టర్ నిర్మాణానికి ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి సోమవారం భూమిపూజ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉప్పాగు గ్రామంలో ఎన్నో సంవత్సరాలుగా బస్ షెల్టర్ లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, త్వరితగతిన ఈ బస్సు షెల్టర్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు.

December 16, 2024 / 07:33 PM IST

‘గ్రామాల సమస్యల దరఖాస్తులకు ప్రాధాన్యత ఇవ్వండి’

ASR: ఏజెన్సీలోని మారుమూల గ్రామాలకు సంబంధించిన సమస్యల దరఖాస్తులకు ప్రాధాన్యత ఇచ్చి వెంటనే పరిష్కరించాలని ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం పేర్కొన్నారు. సోమవారం ఐటీడీఏ సమావేశపు హాలులో వివిధ శాఖల అధికారులతో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. 51మంది పలు సమస్యలపై దరఖాస్తులు అందజేశారు.

December 16, 2024 / 07:30 PM IST

పోలీసు సిబ్బందికి స్మార్ట్ లాక్స్ పంపిణీ

CTR: గుడిపల్లి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి సోమవారం ఎస్సై శ్రీనివాసులు స్మార్ట్ లాక్స్‌ను పంపిణీ చేశారు. ఇప్పటికే గ్రామాల్లో పోలీసులు స్మార్ట్ లాక్స్ వలన కలిగే ప్రయోజనాలను ప్రజలకు అవగాహన కల్పించారు. మండల ప్రజలు స్మార్ట్ లాక్స్ ఉపయోగించి దొంగతనాల నివారణకు చొరవ చూపాలని ఎస్సై విజ్ఞప్తి చేశారు.

December 16, 2024 / 07:29 PM IST

సివిల్ జడ్జిగా రోషిని.. కన్నా అభినందనలు

PLD: సత్తనపల్లి పట్టణంలోని 13వ వార్డుకు చెందిన షేక్ రోషిని జూనియర్ సివిల్ జడ్జిగా నియమితులయ్యారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కన్నా రోషిని ఇంటికి వెళ్లి అభినందించారు. సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందిన రోషిని కష్టపడి చదివి నేడు సివిల్ జడ్జిగా నియమితులవడం ఆనందకరం అన్నారు. కన్నా వెంట పలువురు కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

December 16, 2024 / 07:27 PM IST

చోరీలకు పాల్పడుతున్న దొంగలు అరెస్ట్

ప్రకాశం: పొదిలి మండలంలోని పలు గ్రామాల్లో గంజాయి అమ్మడం, ట్రాన్స్‌ఫార్మర్‌లోని రాగి తీగలను దొంగలించడం వంటివి చేస్తున్న 8మందిని అదుపులో తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.1,80,000 విలువైన సామాగ్రి, 1.2 కేజీల గంజాయి, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు పొదిలి సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఇంకో ముద్దాయి పరారీలో ఉన్నాడని త్వరలోనే పట్టుకుంటామని సీఐ తెలిపారు.

December 16, 2024 / 07:26 PM IST

‘రైతులకు సకాలంలో సాగునీటి అందించేందుకు కృషి చేయాలి’

KRNL: ఆదోనిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం నీటి వినియోగదారుల సంఘం ఎన్నికలలో మండలంలోని పలు గ్రామాల నుంచి నియామకమైన ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌లను సన్మానించారు. రైతులకు అవసరమైన సేవలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి అన్నారు. ఎన్నికైన అభ్యర్థులు రైతులకు సకాలంలో సాగునీటి అందించేందుకు కృషి చేయాలని అన్నారు.

December 16, 2024 / 07:26 PM IST