VZM: గంట్యాడ మండలం మదనాపురం గ్రామంలో రెండు రోజులపాటు జరిగిన శ్రీ బాల సాదు సన్యాసమ్మ తీర్థ మహోత్సవాలు గురువారం రాత్రితో ముగిశాయి. తీర్థ మహోత్సవంలో భాగంగా గురువారం గుర్రపు పందాలు ఎడ్ల పందాలు జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను నిర్వహించారు. స్థానికులు పెద్ద సంఖ్యలో ఈ పోటీలను తిలకించారు.