NLR: కళ్లున్నా చూడలేని కబోధులు, చెవులున్న వినపడని వారికి ఏం చెప్పినా ఫలితం ఉండదని పరోక్షంగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డిని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన మనుబోలులోని జగనన్న కాలనీలో పర్యటించారు. పేదలకు ఇల్లులు నిర్మించిన ఘనత తమ ప్రభుత్వం అని అన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం కనీసం నిధులు మంజూరు కూడా చేయడం లేదన్నారు.