• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

నేడు ఉపాధి పనులపై బహిరంగ సభ

TPT: ఉపాధి హామీలో గత ఏడాది చేపట్టిన పనులపై జరిగిన సామాజిక తనిఖీలోని వివరాలను వెల్లడించేందుకు మంగళవారం ఉదయం పాకాల మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ అరుణ తెలిపారు. లబ్దిదారులు, కూలీలు, రైతులు హాజరు కావాలని.. సమస్యలుంటే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

December 17, 2024 / 04:48 AM IST

ఈనెల 18న కాకినాడలో డీఆర్సీ సమావేశం.. కలెక్టర్

KKD: జిల్లా సమీక్ష కమిటీ (డీఆర్సీ) సమావేశాన్ని ఈనెల 18న మధ్యాహ్నం 1:30 గంటలకు కలెక్టరేట్లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ షాన్మోహన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరి నారాయణ హాజరవుతారని తెలిపారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొంటారన్నారు.

December 17, 2024 / 04:47 AM IST

జాతీయస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు తేజశ్రీ ఎంపిక

CTR: ఈనెల 18వ తేదీ నుంచి 23వ తేదీ వరకు జమ్మ-కాశ్మీర్లో నిర్వహించనున్న జాతీయ స్థాయి సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ పోటీలకు వెదురుకుప్పం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థిని తేజశ్రీ ఎంపికైందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు తెలిపారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి గ్రామానికి, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

December 17, 2024 / 04:46 AM IST

‘ప్రజల ఆస్తుల రక్షణే రెవెన్యూ సదస్సుల ధ్యేయం’

VZM: ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి సోమవారం ఎల్.కోట తహసీల్దారు ఆద్వర్యంలో జరిగిన రెవెన్యూ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల ఆస్తుల రక్షణ ధ్యేయంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారని, గ్రామంలో భూ తగాదాలు, రీసర్వేలో జరిగిన తప్పులు ఈ సదస్సులో పరిష్కార మార్గాలు చూపుతారని తెలిపారు. వచ్చే నెల 8 వరకు ఈ సదస్సులు నిర్వహిస్తారన్నారు.

December 17, 2024 / 04:46 AM IST

నేడు విద్యుత్ సరఫరాకు అంతరయం

బాపట్ల: నిజాంపట్నం మండలంలో మంగళవారం విద్యుత్ మరమ్మతులు నిర్వహిస్తున్నామని సోమవారం సాయంత్రం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ విజయ శ్రీనివాస్ తెలిపారు. 132KV రేపల్లె విద్యుత్ సబ్ స్టేషన్‌లో మరమ్మతుల నిమిత్తం 8AM నుంచి 2 PM వరకు నిజంపట్నంలో విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని ఆయన తెలిపారు. వినియోగదారులు, ప్రజలు సహకరించాలని కోరారు.

December 17, 2024 / 04:46 AM IST

అగ్ని ప్రమాద బాధితులకు సహాయం

SKLM: పొందూరు మండలం కోటిపల్లి గ్రామంలో పురిల్లు అగ్నిప్రమాదంలో అన్ని కోల్పోయిన బాధితులకు శ్రీకాకుళం రెడ్‌క్రాస్ సంస్థ సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో సహాయం చేసేవారు మానవత దృక్పథం చాటుకోవడంతో పాటుగా కష్టంలో ఉన్న మమ్మల్ని ఆదుకోవడం చాలా సంతోషమని బాధితులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

December 17, 2024 / 04:44 AM IST

ఉత్తమ ఆసుపత్రిగా తీర్చిదిద్దుతాం: MLA శ్రీనివాస్

E.G: రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిని రాష్ట్రంలోనే ఉత్తమ ఆసుపత్రిగా తీర్చిదిద్దుతామని రాజమండ్రి సిటీ MLA ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆసుపత్రి వద్ద సోమవారం జరిగిన అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రిలో రోగులకు సంతృప్తికరమైన వైద్య సదుపాయాలను సేవలను అందించాలని వైద్యాధికారులను సూచించారు.

December 17, 2024 / 04:33 AM IST

ప్రభుత్వ విప్‌తో నీటి సంఘాల అధ్యక్షులు భేటి

మన్యం: ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరీని గుమ్మలక్ష్మీపురం టీడీపీ క్యాంప్‌ కార్యాలయంలో సోమవారం నీటి సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు మర్యాదపూర్వకంగా కలసి ఆమెతో భేటి అయ్యారు. ఈ సందర్భంగా నీటి సంఘాల ఎన్నికలలో గెలిచిన అభ్యర్థులతో మాట్లాడుతూ చిత్తశుద్ధితో పనిచేసి రైతులకు ఉపయోగపడేలా కార్యక్రమాలు చేపట్టాలని వారికి సూచించారు.

December 17, 2024 / 04:31 AM IST

టిడ్కో కాలనీ సమస్యల పరిష్కారానికి కృషి: ఛైర్మన్

కోనసీమ: అల్లవరం మండలం బోడసకుర్రు టిడ్కో గృహ సముదాయాన్ని టిడ్కో ఛైర్మన్ వేములపాటి అజయ్ సోమవారం రాత్రి సందర్శించారు. 1632 టిడ్కో ఇళ్లు ఉన్నాయని చెప్పారు. నీటి సమస్య ప్రధానంగా ఉందన్నారు. దారి సమస్యతో పాటు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారన్నారు. వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని అజయ్ పేర్కొన్నారు.

December 17, 2024 / 04:27 AM IST

టిడ్కో కాలనీ సమస్యల పరిష్కారానికి కృషి: ఛైర్మన్

కోనసీమ: అల్లవరం మండలం బోడసకుర్రు టిడ్కో గృహ సముదాయాన్ని టిడ్కో ఛైర్మన్ వేములపాటి అజయ్ సోమవారం రాత్రి సందర్శించారు. 1632 టిడ్కో ఇళ్లు ఉన్నాయని చెప్పారు. నీటి సమస్య ప్రధానంగా ఉందన్నారు. దారి సమస్యతో పాటు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారన్నారు. వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని అజయ్ పేర్కొన్నారు.

December 17, 2024 / 04:27 AM IST

అన్నదమ్ముల హత్య కేసులో పురోగతి

PLD: జిల్లాలో కలకలం రేపిన అన్నదమ్ముల హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నకరికల్లులో సొంత అన్నదమ్ములను చెల్లెలు కృష్ణవేణి చంపిన సంగతి తెలిసిందే. గోరంట్ల మేజర్ కాలువలో తమ్ముడు రామకృష్ణ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. అలాగే నకరికల్లు సినిమా హాల్ బజారులోని నిందితురాలు ఇంటిని ఎస్పీ శ్రీనివాసరావు పరిశీలించారు.

December 17, 2024 / 04:26 AM IST

గర్భిణుల వసతి గృహాన్ని సందర్శించిన కలెక్టర్

మన్యం: జిల్లా కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ సోమవారం గుమ్మలక్ష్మీపురం మండలం వైటిసీలో గర్భిణుల వసతి గృహాన్ని సందర్శించి, పరిసరాలను స్థితిగతులను పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్య సేవలు, సదుపాయాలపై అక్కడ గర్భిణీ స్త్రీలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో కృషి విజ్ఞాన కేంద్రంలో జీడిపప్పు, ఇతర ప్రాసెసింగ్‌, నాటు కోళ్ల పెంపకం యూనిట్లను పరిశీలించారు.

December 17, 2024 / 04:25 AM IST

విలువిద్య పోటీల్లో యువకుడికి బంగారు పతకం

E.G: ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో ఇటీవల జరిగిన అంతర్ కళాశాల ఆర్చరీ (విలువిద్య) టోర్నమెంట్‌లో S.K.V.T ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి తేలం అజయ్ బంగారు పతకం సాధించాడు. సోమవారం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ DV రమణమూర్తి మాట్లాడుతూ.. 30 మీటర్ల విభాగంలో అజయ్ ఈ బంగారు పతకం సాధించినట్లు చెప్పారు. జాతీయ స్థాయిలో 50 మీటర్ల పోటీకి అర్హత సాధించినట్లుగా తెలిపారు.

December 17, 2024 / 04:21 AM IST

‘ధార్మిక కార్యక్రమాలకు టీటీడీ పెట్టింది పేరు’

కడప: తిరుమల తిరుపతి దేవస్థానం ఒంటిమిట్ట కోదండ రామాలయం వద్ద ఆల్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు వారి సౌజన్యంతో ధనుర్భాసం తిరుప్పావై ప్రవచనాలు డిసెంబర్ 16వ తేదీ నుంచి జనవరి 13వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఆలయ సూపరింటెండెంట్ హనుమంతయ్య తెలిపారు. సోమవారం ఆలయ ప్రధాన అర్చకులు వీణా రాఘవాచార్యులు ధనుర్భాస తిరుప్పావై నిర్వహించారు.

December 17, 2024 / 04:18 AM IST

నేటి ఎమ్మెల్యే బలరామకృష్ణ పర్యటన వివరాలు

E.G: రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మంగళవారం పర్యటన వివరాలను గాదరాడలోని ఆయన కార్యాలయ సిబ్బంది సోమవారం రాత్రి తెలిపారు. మంగళవారం ఉదయం బొమ్మూరులోని పాలిటెక్నిక్ కళాశాల వద్ద స్పోర్ట్స్ మీట్‌లో పాల్గొంటారని పేర్కొన్నారు. అనంతరం రాజానగరం మండల పరిషత్ కార్యాలయం వద్ద నిర్వహించే పంచాయతీ సుస్థిరాభివృద్ధి ప్రణాళిక శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు.

December 17, 2024 / 04:18 AM IST