• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

విశాఖ సీపీ కార్యాలయానికి 117 ఫిర్యాదులు

VSP: ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో భాగంగా పోలీస్ కమీషనరేట్‌లో సోమవారం 117 ఫిర్యాదులు వచ్చాయని కమిషనర్ శంఖబ్రత భాగ్చీ తెలిపారు. ప్రజలు నుంచి నేరుగా ఆయన ఫిర్యాదులు స్వీకరించారు. సంబంధిత పోలీసు అధికారులు ఫిర్యాదులను పరిశీలించి ఫిర్యాదుదారులతో స్వయంగా ఆదేశించారు. పిర్యాదు దారుల సమస్యలను తెలుసుకొని చట్టపరంగా సమస్య పరిష్కారించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.

December 17, 2024 / 06:36 AM IST

కులం పేరుతో దూషించిన వ్యక్తికి జైలుశిక్ష

VSP: కులం పేరుతో దూషించిన కారణంగా విశాఖ ఎయిర్ పోర్ట్ ప్రాంతానికి చెందిన వ్యక్తికి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ 12వ అదనపు న్యాయమూర్తి సత్యదేవి సోమవారం తీర్పు ఇచ్చారు. ఎస్సీ కులానికి చెందిన ఓ మహిళతో 2017లో నారాయణమూర్తి ఒప్పందం కుదుర్చుకుని రూ.1.10 లక్షలు అడ్వాన్స్ ఇచ్చి భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు.

December 17, 2024 / 06:32 AM IST

లోక్ అదాలత్‌లో రాజీ అయిన 31 మద్యం కేసులు

VSP: లోక్ అదాలత్‌లో 31 మద్యం కేసులు రాజీ అయినట్లు అరకు ఎక్సైజ్ సర్కిల్ సీఐ సంతోష్ తెలిపారు. అరకులోయ సివిల్ కోర్టులో జరిగిన లోక్ అదాలత్‌లో 30 డ్యూటీ పెయిడ్ లిక్కర్ (DPL) కేసులు, ఒకటి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్(NDPL)కేసు రాజీ అయ్యాయన్నారు. ఈ 31 కేసుల రాజీ ద్వారా ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పినాల్టీ రూపంలో ప్రభుత్వ ఖజానాకు రూ.1,56,360లు జమయ్యాయన్నారు.

December 17, 2024 / 06:31 AM IST

నేటి సత్యవేడు ఎమ్మెల్యే పర్యటన వివరాలు

TPT: వరదయ్యపాలెం మండలంలో మంగళవారం సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పర్యటించనున్నట్లు మండల ఐటీడీపీ అధ్యక్షులు నందనం శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉదయం 11 గంటలకు మండల కేంద్రంలోని గోవర్ధనపురం హైస్కూల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించనున్నట్లు తెలిపారు. కూటమి నాయకులు, కార్యకర్తలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

December 17, 2024 / 06:18 AM IST

క్షమాపణలు చెప్పిన మంత్రి కొలుసు

కృష్ణా: మంత్రి కొలుసు పార్థసారథి సోమవారం క్షమాపణలు చెప్పారు. ఆదివారం నూజివీడులో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి జోగి రమేశ్ ప్రత్యక్షమవ్వడంపై ఆయన మాట్లాడారు. కార్యకర్తల మనోభావాలు దెబ్బ తింటే క్షమించాలని కోరారు. ఆ కార్యక్రమం పార్టీ పరంగా కాకుండా సామాజికపరంగా జరిగిందని తెలిపారు. తనను అక్కున చేర్చుకొని గౌరవించిన చంద్రబాబుకి క్షమాపణలు తెలియజేస్తున్నానని అన్నారు.

December 17, 2024 / 06:05 AM IST

నేడు జగ్గంపేటలో ఉచిత వైద్య శిబిరం

KKD: జగ్గంపేటలోని గోకవరం రోడ్, నెహ్రూ కాలనీలోని ఫెన్షనర్ల భవనం నందు మంగళవారం మధ్యాహ్నం 1గంట నుంచి పెన్షనర్స్, వాకర్స్ ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ క్యాంపు నందు బీపీ, షుగర్, ఎముకలు(ఆర్ధో) నరాలు (న్యూరో) , కంటి, పంటి వ్యాధులకు ప్రముఖ వైద్యులచే చికిత్స అందిస్తారని తెలిపారు.

December 17, 2024 / 05:57 AM IST

కోలార్ పర్యటించిన మంత్రి సత్యకుమార్

సత్యసాయి: కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, మంత్రి నారా లోకేశ్‌తో కలిసి సోమవారం పర్యటించారు. టాటా డిజిటల్ నెర్వ్ సెంటర్‌ను సందర్శించారు. వైద్యం కోసం అక్కడ వినియోగిస్తున్న ఆధునిక టెక్నాలజీ గురించి తెలుసుకున్నారు. ప్రైమరీ, సెకండరీ హెల్త్ కేర్‌లో అందుతున్న సేవలు గురించి అధికారులు, రోగులతో మాట్లాడి తెలుసుకున్నారు.

December 17, 2024 / 05:56 AM IST

టీడీపీలో చేరిన వైసీపీ ఎంపీటీసీ

సత్యసాయి: గోరంట్ల మండలం బూదిలి పంచాయతీకి చెందిన వైసీపీ పార్టీ ఎంపీటీసీ మంజు పార్టీ విడి సోమవారం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా పెనుకొండ పట్టణంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో మంత్రి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

December 17, 2024 / 05:54 AM IST

మాజీ సీఎం జగన్‌కు సవాల్ విసిరిన మంత్రి

సత్యసాయి: జగన్ పాలన అంతా అప్పులమయమేనని, ఐదేళ్లలో వైసీపీ చేయని అభివృద్ధి కూటమి ప్రభుత్వం 5 నెలల్లోనే చేసి చూపించిందని మంత్రి సవిత అన్నారు. సోమవారం ఆమె పెనుకొండలో మాట్లాడారు. రాష్ట్రానికి తరలొస్తున్న వేల కోట్ల రూపాయల పెట్టుబడులే అభివృద్ధికి నిదర్శమన్నారు. తాము 5 నెలల కాలంలో చేసిన అభివృద్ధి చర్చకు సిద్ధమని జగన్‌కు మంత్రి సవిత సవాల్ విసిరారు.

December 17, 2024 / 05:52 AM IST

జిల్లా ఎస్పీకి 35 ఫిర్యాదులు

సత్యసాయి: సోమవారం జిల్లా పోలీసుల కార్యాలయంలో ఎస్పీ వి.రత్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొని 35 ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులపై పూర్తిస్థాయిలో విచారణ చేసి, చట్టపరంగా ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని, ఫిర్యాదులను మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు.

December 17, 2024 / 05:48 AM IST

‘టీడీపీతోనే రైతు సంక్షేమాభివృద్ధి సాధ్యం’

సత్యసాయి: టీడీపీతోనే రైతు సంక్షేమాభివృద్ధి సాధ్యమని, రైతుల సంక్షేమం కోసం చిత్త శుద్ధితో పనిచేయాలని సాగు నీటి సంఘాల కమిటీలకు మంత్రి సవిత సూచించారు. సోమవారం పెనుకొండ పట్టణంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన సాగునీటి సంఘాల అధ్యక్ష, ఉపాధ్యక్షులు, టీసీ మెంబర్లు.. మంత్రిని కలిశారు. మంత్రి మాట్లాడుతూ.. రైతు కళ్లల్లో ఆనందం చూడాలన్నదే సీఎం ధ్యేయమన్నారు.

December 17, 2024 / 05:46 AM IST

కేసీ కెనాల్లో మొసలి కలకలం

NDL: పాములపాడు మండలం బానకచర్ల గ్రామం దగ్గర నిప్పుల వాగుపై ఉన్న కేసీ కెనాల్లో మరోసారి మొసలి ప్రత్యక్షమైంది. 5 రోజులుగా కేసీకెనాల్లో మొసలి సంచరిస్తోంది. ఇది గమనించిన రైతులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వాళ్లు మొసలి ఉన్న ప్రాంతాన్ని పరిశీలించారు. దానిని పట్టుకునేందుకు ఏర్పాట్లు చేశారు. మొసలిని పట్టుకునేంత వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

December 17, 2024 / 05:41 AM IST

తల్లీ, కుమార్తెలను కాపాడిన పోలీసులు

KNL: తల్లి, కుమార్తెలను ఆత్మకూరు పోలీసులు కాపాడారు. ఆత్మకూరు మండలం సిద్దాపురం గ్రామానికి చెందిన మేరీ, ఈశ్వర్ గొడవ పడగా మేరీ పుట్టింటికి వెళ్లింది. అయినా మరోసారి భార్యాభర్తలు గొడవపడటంతో తన కుమార్తెలు రేణుక, నవీనలను తీసుకుని చనిపోతానని చెప్పి వెళ్లడంతో ఆమె తల్లి ఆత్మకూరు పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. ఫోన్ లొకేషన్ ఆధారంగా శ్రీశైలంలో ఉన్నట్లు గుర్తించారు.

December 17, 2024 / 05:39 AM IST

‘ఫిర్యాదులను తక్షణం పరిష్కరించండి’

W.G: జిల్లాలో అమలవుతున్న దీపం పథకం-2 అమలుపై జిల్లా కలెక్టర్ నాగరాణి అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దీపం పథకం- 2 నిరుపేదలకు ఎలా అందుతుంది, సంబంధించిన సబ్సిడీ బ్యాంకు ఖాతాలో జమ అవుతుందా అనే అంశాలపై ఆరా తీశారు. ఫిర్యాదులు వచ్చినా తక్షణం విచారించి పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.

December 17, 2024 / 05:25 AM IST

రాజోలులో నేటి నుంచి కిక్ బాక్సింగ్ పోటీలు

కోనసీమ: రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఇంటర్ కొలిగేటివ్ టోర్నమెంట్ కిక్ బా క్సింగ్ మెన్ అండ్ ఉమెన్స్ పోటీలు ఈనెల 17,18 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ పి. సాయిబాబు తెలిపారు. ఈ పోటీలకు నన్నయ యూనివర్సిటీ పరిధిలో ఉన్న అన్ని కళాశాలలు పాల్గొనాల్సిందిగా కోరారు. క్రీడాకారులు ఉదయం 9గంటలకు కళాశాలలో హాజరు కావాలన్నారు.

December 17, 2024 / 05:25 AM IST