W.G: చంద్రబాబు సర్కారు చేస్తున్న మోసాలు, అన్యాయాలు ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు పార్టీ శ్రేణులు కృషిచేయాలని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకులో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు చేస్తానన్న మంచిని చేయకుండా వాటి నుంచి ప్రజలను దృష్టి మరల్చేందుకు ప్రశ్నించిన వారిపై కేసులు నమోదుచేస్తున్నారని విమర్శించారు.