• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

లేపాక్షి మండలంలో కల్లు దుకాణాలపై దాడులు

సత్యసాయి: లేపాక్షి మండలంలోని కల్లు దుకాణాలపై సోమవారం విజిలెన్స్, ఎక్సైజ్ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. లేపాక్షి, చుట్టుపక్క గ్రామాల్లో విజిలెన్స్ సీఐ అలీ బేగ్, ఎక్సైజ్ సీఐ లక్ష్మీదుర్గయ్యలు కల్లు నాణ్యత తనిఖీ చేయడం కోసం శాంపిల్స్ సేకరించారు. నాణ్యత లేనట్లుగా ఆరోపణలు రావడంతో ఈ దాడులు చేసినట్లు తెలిపారు.

December 16, 2024 / 05:27 PM IST

రైతుల సేవల్లో కూటమి ప్రభుత్వం ఉంటుంది: ఎమ్మెల్యే

KRNL: రైతులకు అవసరమైన సేవలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఆదోని శాసనసభ్యులు డాక్టర్ పార్థసారథి వాల్మీకి అన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నీటి వినియోగదారుల సంఘం ఎన్నికల్లో మండల పరిధిలోని పలు గ్రామాల నుంచి నియామకమైన ఛైర్మన్, వైస్ ఛైర్మన్లను ఎమ్మెల్యే సన్మానించి మాట్లాడారు. రైతులకు సకాలంలో సాగునీటి అందించేందుకు కృషి చేయాలన్నారు.

December 16, 2024 / 05:27 PM IST

‘ప్రజలకు తాగునీటి వసతి కల్పించండి’

KRNL: పరిధిలోని పలు పల్లెలలో గత వారం రోజులుగా ప్రజలు తాగు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని పల్లె ప్రజల తాగునీటి ఎద్దడిని వెంటనే పరిష్కరించాలని మండల బీజేపీ సమన్వయకర్త ప్రసాద్, అధికారులను కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండలంలోని పెద్టహేట, చిన్నహేట, సమ్మతగేరి, సులువాయి తదితర గ్రామాలలో తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

December 16, 2024 / 05:26 PM IST

‘కూటమి హామీని నిలబెట్టుకోవాలి’

KDP: రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేయాలని సీపీఎం కడప నగర కార్యదర్శి రామమోహన్ డిమాండ్ చేశారు. సోమవారం నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేడ్కర్ సర్కిల్లో సీపీఎం కడప నగర కమిటీ ఆధ్వర్యంలో విద్యుత్ బిల్లుల దగ్ధం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి ఉండాలన్నారు.

December 16, 2024 / 05:23 PM IST

సమస్యల పరిష్కారంలో అలసత్వం వద్దు: SP

అన్నమయ్య: ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు అలసత్వం చేయరాదని ఎస్పీ విద్యా సాగర్ నాయుడు స్పష్టం చేశారు. రాయచోటిలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో సోమవారం ప్రజల నుంచి ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఫిర్యాదులు స్వీకరించారు. సంబంధిత అధికారులకు బదిలీ చేస్తూ ప్రజల ఫిర్యాదులను సత్వరమే విచారించి న్యాయం చేయాలన్నారు.

December 16, 2024 / 05:21 PM IST

మీ కోసం కార్యక్రమానికి 62 వినతలు

SKLM: మీకోసం కార్యక్రమంలో వచ్చే ప్రజా పిర్యాదులను చట్ట ప్రకారం పూర్తి స్థాయిలో పరిష్కారానికి చర్యలు చేపట్టి త్వరితగతిన పరిష్కరించాలని ఎస్పీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో మీకోసం కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు ప్రజల నుంచి 62 వినతులు స్వీకరించినట్లు తెలిపారు. ప్రజా పిర్యాదులు పట్ల అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.

December 16, 2024 / 05:21 PM IST

మనుబోలు సాగునీటి సంఘం అధ్యక్షులకు సన్మానం

NLR: మనుబోలు మండలంలో ఇటీవల జరిగిన సాగునీటి సంఘం ఎన్నికలలో గెలుపొందిన వాళ్ళకి ఎమ్మెల్యే సోమిరెడ్డి సోమవారం శుభాకాంక్షలు తెలిపారు. కట్టువపల్లి, వెంకన్నపాలెం, బద్ధెవోలు గ్రామాల సాగునీటి సంఘం అధ్యక్షులు ఎండ్రపల్లి మహేంద్ర, హనుమంత నాయుడు, శానంపూడి సురేందర్ రెడ్డి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని కలిశారు.

December 16, 2024 / 05:21 PM IST

‘ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మేయర్’

VSP: విశాఖపట్నం నగర మేయర్ హరి వెంకట కుమారి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఆమె తన క్యాంపు కార్యాలయం నుంచి జీవీఎంసీ ప్రధాన కార్యాలయానికి ఆర్టీసీ బస్సులో చేరుకొని ప్రజలకు ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. విశాఖ నగరాన్ని కాలుష్య రహిత నగరంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అందుకే తాను ఆర్టీసీ బస్సులో ప్రయాణించినట్లు వివరించారు.

December 16, 2024 / 05:21 PM IST

‘బదిలీల బాగోతంపై దర్యాప్తు చేయండి’

VZM: గత సెప్టెంబర్ నెలలో ఉమ్మడి విజయనగరానికి చెందిన పార్వతీపురానికి సంబంధించి పంచాయతీ కార్యదర్శుల బదిలీల బాగోతంపై దర్యాప్తు జరపాలని NHRC జిల్లా అధ్యక్షులు వంగల దాలినాయుడు కోరారు. ఈ మేరకు సోమవారం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన PGRSలో పంచాయతీ కార్యదర్శుల బదిలీలు ప్రభుత్వ గైడ్‌లైన్స్‌కు విరుద్ధంగా జరిగాయంటూ DRO హేమలతకు ఆయన ఫిర్యాదు చేశారు.

December 16, 2024 / 05:17 PM IST

న్యాయమూర్తి ఆధ్వర్యంలో విద్యార్థులకు వివిధ రకాల పోటీలు

AKP: నర్సీపట్నం న్యాయస్థానాల ఆవరణలో సోమవారం సాయంత్రం సీనియర్ సివిల్ జడ్జి పి.షియాజ్ ఖాన్ వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. న్యాయవిజ్ఞానం మీద విద్యార్థుల ప్రతిభ వెలికి తీసేందుకు పోటీలు ఉంటాయన్నారు.

December 16, 2024 / 05:13 PM IST

మాజీ ఎమ్మెల్యేను పరామర్శించిన వైసీపీ నాయకులు

ATP: ఇటీవల ఆపరేషన్ చేయించుకుని హైదరాబాదులో విశ్రాంతి తీసుకుంటున్న అనంతపురం జిల్లా గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డిని సోమవారం గుత్తి మండల వైసీపీ నాయకులు కలిసి పరామర్శించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి త్వరగా కోలుకోవాలని గుత్తి వైసీపీ మండల కన్వీనర్ గోవర్ధన్ రెడ్డి తెలిపారు.

December 16, 2024 / 05:11 PM IST

మద్దిపాడు మండలంలో శిక్షణ తరగతులు

ప్రకాశం: సర్పంచులు, కార్యదర్శులు ఐక్యంగా గ్రామాల అభ్యున్నతకు నడుం బిగించాలని మద్దిపాడు ఎంపీడీవో కుమారి వి.జ్యోతి కోరారు. మద్దిపాడు మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం జరిగిన సుస్థిరమైన అభివృద్ధి లక్ష్యాలపై ఏర్పాటు చేసిన శిక్షణ తరగతుల కార్యక్రమాన్ని ఆమె పాల్గొని ప్రారంభించారు. గ్రామాభివృద్ధికి ప్రణాళికలను రూపొందించుకోవాలన్నారు.

December 16, 2024 / 05:09 PM IST

పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ధర్నా

KKD: పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఏలేశ్వరం మండల తహశీల్దార్ ఆఫీస్ వద్ద సీపీఐ(ఎంఎల్) లిబరేషన్, ఇళ్ల స్థలాల పోరాట కమిటీ అధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఏగుపాటి అర్జున్ రావు మాట్లాడుతూ.. ఏలేశ్వరంలో చాలా మంది నిరుపేదలు ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్నారు తెలిపారు. వారు జీవించడమే చాలా కష్టతరంగా ఉందని, కూలికి వెళ్తే అవి రోజువారీ ఖర్చులు కూడా చాలడం లేదన్నారు.

December 16, 2024 / 05:07 PM IST

నకిలీ టీసీని అరెస్టు చేసిన రైల్వే పోలీసులు

ATP: గుంతకల్ రైల్వే డివిజన్‌లో తిరుగుతున్న రైళ్లలో టీసీగా చలామణి అవుతూ రైళ్లలో ప్రయాణికుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తిని సోమవారం రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. రైల్వే జీఆర్‌పీ ఎస్సై మహేంద్ర మాట్లాడుతూ.. రైళ్లలో నకిలీ టీసీగా చలామణి అవుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి నకిలీ టీసీ ఐడెంటి కార్డును స్వాధీనం చేసుకున్నారు.

December 16, 2024 / 05:06 PM IST

రైలు కింద పడి ఇద్దరు యువతుల ఆత్మహత్య

ATP: పెనుగొండ రైల్వే స్టేషన్ సమీపంలోని మంగాపురం వద్ద సోమవారం గూడ్స్ రైలు కింద పడి ఇద్దరు యువతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. గమనించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు మృతులు ఒరిస్సాకు చెందిన యువతులుగా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

December 16, 2024 / 05:03 PM IST