SS: కదిరి సబ్ డివిజన్ వ్యాప్తంగా పేకాట కేంద్రాలపై పోలీసులు విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నారు. గురువారం తలుపుల మండలంలోని గుండువారిపల్లి సమీపంలో పేకాట ఆడుతున్న స్థావరంపై ఎస్సై చెన్నయ్య సిబ్బందితో కలిసి దాడులు చేశారు. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి, వారి నుంచి రూ. 12,650 నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.