W.G: కాళ్ల మండలం కోలనపల్లికి చెందిన చెల్లెం ఐజక్(19) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మంగళవారం సోదరుడిని బస్సు ఎక్కించి తిరిగి వస్తుండగా, కాళ్లలోని దత్తాత్రేయ గుడి వద్ద బైక్ స్తంభాన్ని ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన అతడిని భీమవరం ఆసుపత్రికి తరలించగా, బుధవారం చికిత్స పొందుతూ.. ప్రాణాలు విడిచాడు. యువకుడి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.