KNR: ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరచడమే లక్ష్యంగా పనిచేయాలని కరీంనగర్ అదనపు కలెక్టర్, డీఈవో డా. అశ్విని తానాజీ వాకిడే ఆదేశించారు. ఎంఈవోలు, హెచ్ఎంలతో నిర్వహించిన సమీక్షలో ఎఫ్ఎల్ఎన్ (FLN), ఎల్బాపీ (LIP) పురోగతిని విశ్లేషించారు. తెలుగు, ఆంగ్ల భాషల్లో పఠన నైపుణ్యాలు, గణితంలో యాక్షన్ ప్లాన్ రూపొందించాలన్నారు.