AP: నంద్యాల జిల్లా మహానంది పుణ్యక్షేత్రం పరిసరాల్లోని నల్లమల అడవిలో కార్చిచ్చు వేగంగా వ్యాపిస్తోంది. రాత్రి మోకాళ్ళ తిప్ప, దయ్యాలతిప్ప ప్రాంతాల్లో మంటలు దిగువ నుండి ఎగువకు పాకాయి. వీటిని అదుపు చేయడం అటవీశాఖకు సాధ్యపడకపోవడంతో వన్యప్రాణులు ప్రాణభయంతో వణికిపోతున్నాయని స్థానికులు చెబుతున్నారు. హెలికాప్టర్ల ద్వారా మంటలను ఆర్పి అడవిని కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.