NLG: అధిక శబ్దం కలిగించే ద్విచక్ర వాహనాల మాడిఫైడ్ సైలెన్సర్లను పోలీసులు ధ్వంసం చేశారు. బుధవారం నల్లగొండ పట్టణంలో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నిబంధనల అమలు, శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం నియంత్రణలో భాగంగా పర్యావరణ రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అడిషనల్ ఎస్పీ రమేష్ తెలిపారు.