అన్నమయ్య: పీలేరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. రామచంద్రారెడ్డి కాలనీలో ఐదేళ్ల బాలికపై అఘాయిత్యం జరిగినట్లు సమాచారం. ఘటనపై ఆగ్రహించిన స్థానికులు నిందితుడిగా భావిస్తున్న 15 ఏళ్ల బాలుడికి దేహశుద్ధి చేశారు.అనంతరం అతడు సమీప బంధువుల ఇంట్లో తలదాచుకోగా, పీలేరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన బాలుడిని చికిత్స నిమిత్తం పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.