NTR: విజయవాడ 3వ డివిజన్లోని మహానాడు రోడ్డు సమీపంలో నూతనంగా నిర్మించనున్న వాటర్ పైపులైన్ పనులకు తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గద్దె మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలో పలు రహదారుల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టామన్నారు. కార్యక్రమంలో NDA కూటమి పక్షాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కోనసీమ: రైతులు ఆరుగాలం కష్టపడి పండించే పంటలను కోల్పోతే పరిహారం పొందేందుకు ఇన్సూరెన్స్ తప్పనిసరిగా చేయించుకోవాలని కోనసీమ జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ సూచించారు. ఈ మేరకు ఆయన ఇన్సూరెన్స్ స్కీమ్కు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టాటా ఇన్సూరెన్స్ కంపెనీకి రైతులు ఎకరానికి రూ.630 చెల్లించడం ద్వార రూ.42 వేల వరకు భీమా పొందవచ్చన్నారు.
NLR: సంగం పట్టణంలోని శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ సంగమేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం మార్గశిర మాసం, ఆరుద్ర నక్షత్రం సందర్భంగా విశేష పూజ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. మహన్యాస పూర్వ ఏకాదశ రుద్రాభిషేకం, పంచామృత అభిషేకం, సుగంధ ద్రవ్యములతో అభిషేకం, అన్నాభిషేకం కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. భక్తులు విచ్చేసి స్వామి అమ్మవార్లును దర్శించుకున్నారు.
ATP: రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో హిమోఫిలియా ఫ్యాక్టర్లను అందుబాటులో ఉంచాలని తహసీల్దార్ నాగరాజుకు సోమవారం బాధితులు విజ్ఞప్తి చేశారు. రాయదుర్గం మండలంలో 11 మంది వరకు బాధితులు ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
కృష్ణా: సీఎం చంద్రబాబు పోలవరం పర్యటనలో మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పోలవరం ప్రాజెక్టు వద్ద సీఎం చంద్రబాబును కలుసుకున్నారు. మంత్రి సీఎంకు ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. అనంతరం సీఎంతో కలిసి పోలవరం ప్రాజెక్టును పరిశీలించారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
VZM: నెల్లిమర్ల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థులు రాష్ట్రస్థాయి 9వ ఇంటర్ డిస్ట్రిక్ట్ టెన్నిస్, వాలీబాల్ పోటీల్లో సత్తా చాటారు. తాజాగా ఏలూరు జిల్లాలో జరిగిన పోటీల్లో ఈ పాఠశాల, కళాశాల విద్యార్థులు సిహెచ్ హారిక, వై యామిని, ఎం దాక్షాయని ప్రతిభ కనబరిచారు. త్వరలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారు. వీరిని పాఠశాల ప్రిన్సిపాల్ అభినందించారు.
ఎన్టీఆర్: విస్సన్నపేట మండలం కొండపర్వ గ్రామంలో ఎక్సైజ్ పోలీసులు ఆకస్మికంగా దాడులు చేశారు. మూటము బాలమ్మ, ప్రభావతి అనే ఇద్దరు మహిళల వద్ద నుంచి 72 తెలంగాణ మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. మహిళలను అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కేవీ సుధాకర్ తెలిపారు. దాడుల్లో ఎస్సై ఎం.రామశేషయ్య, కె.మధు, సిబ్బంది పాల్గొన్నారు.
W.G: మేగా ఇంజనీరింగ్ సంస్థ, బావర్ సంస్థ ప్రతినిధులతో సోమవారం ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు భేటీ అయ్యారు. వీటిలో భాగంగా పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ నిర్మాణం గురించి చర్చించారు. అలాగే ప్రాజెక్ట్ డిజైన్, పురోగతి ఇతర అంశాలను చర్చించి, పనులు వేగవంతం చేయాలని సంస్థ ప్రతినిధులను ఆదేశించారు.
SKLM: భూ సమస్యలు పరిష్కారానికి రెవెన్యూ సదస్సు నిర్వహిస్తున్నామని ఆమదాలవలస MRO రాంబాబు అన్నారు. సోమవారం కొర్లకోట గ్రామంలో నిర్వహించిన సదస్సులో భూ వివాదాలు, ఆక్రమణలు పై ఫిర్యాదులు స్వీకరించమన్నారు. బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ P.సూరపు నాయుడు, టీడీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి S.ఢిల్లేశ్వర్ రావ్ గ్రామంలో రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం ఇచ్చారు.
ప్రకాశం: వేటపాలెం పోలీస్ స్టేషన్ను డీఎస్పీ మహమ్మద్ మెయిన్ సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించారు. స్టేషన్లో పెండింగ్లో ఉన్న కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కంప్లైంట్ వచ్చిన వెంటనే పరిశీలించి, కేసులు నమోదు చేయాలని ఎస్సైకి సూచించారు.
ATP: కళ్యాణదుర్గం పట్టణంలోని విశ్రాంతి ఉద్యోగుల భవనంలో ఈనెల 17న విశ్రాంత ఉద్యోగుల దినోత్సవం నిర్వహిస్తున్నట్లు సోమవారం పెన్షనర్ల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శివప్రసాద్, తిప్పేస్వామి తెలిపారు. పెన్షనర్ల కోసం పోరాడిన వారి జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న విశ్రాంత ఉద్యోగుల దినోత్సవానికి పెన్షనర్లు హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు.
KRNL: బేతంచెర్ల పట్టణంలోని దుర్గా పేటలో ఉన్న హోసన్నా మందిరం ( చర్చి )నందు మినీ క్రిస్మస్ వేడుకలు మందిరం ఫాస్టర్ సామ్యు యేలు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంనకు డోన్ MLA కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. క్రీస్తు చూపించిన మార్గంలో శాంతి సమాధానంలో సమాజంలో మెలగాలని సందేశం ఇచ్చారు.
SKLM: కవిటి మండలం బొర్రపుట్టుగ పాఠశాలకు ఉపాధ్యాయురాలు భారతి నడుచుకుని వెళ్తుండగా బొర్రపుట్టుగ సమీపంలో సోమవారం ఆమెపై రాళ్ల దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి బంగారం కోసం పెనుగులాడి విఫలమై రాయితో దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. చికిత్స నిమిత్తం కవిటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఎస్సై రవి వర్మ కేసు నమోదు చేశామన్నారు.
ATP: జిల్లాలో అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని కోరుతూ వైఎస్ఆర్సీపీఐటీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం గుత్తి పట్టణంలోని ఏడీఏ కార్యాలయంలో ఏడీఏ వెంకటరాముడుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. పంట సాగు చేసి నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50,000 అందించాలన్నారు.