కృష్ణా: యనమలకుదురు గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో హుండీల లెక్కింపు కార్యక్రమం జరిగింది. 82 రోజుల కాలానికి హుండీ ఆదాయం మొత్తం రూ.23,40,500గా వచ్చినట్లు ఆలయ ఈవో ఎన్. భవాని తెలిపారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు, గ్రామస్థులు, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు యనమలకుదురు శాఖ సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు.