VZM: కృష్ణా జిల్లా గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో శనివారం జరిగిన రాష్ట్ర మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో నిర్వహించిన జావెలిన్ త్రోలో ఎస్ కోట వైస్ ఎంపీపీ ఇందుకూరి సుధారాణి బంగారు పతకం కైవసం చేసుకున్నారు. అలాగే జిల్లాకు చెందిన 50 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో తమ ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారు. ఈ మేరకు ఎమ్మెల్సీ ఇందుకూరి రఘరాజు క్రీడాకారులను అభినందించారు.
VZM: గంట్యాడ మండల కేంద్రంలో గల శ్రీనివాస, కనకదుర్గ రైస్ మిల్లులను శనివారం జేసి సేతు మాధవన్ సందర్శించి తనిఖీలు చేపట్టారు. మిల్లులో రికార్డులను పరిశీలించారు. రైతుల నుండి ధాన్యం సేకరణ ప్రక్రియను పరిశీలించారు. మిల్లు యజమానులు ధాన్యం తూకం విషయంలో అక్రమాలు చేస్తున్నట్టు వచ్చిన ఫిర్యాదు మేరకు మిల్లును తనిఖీ చేయడం జరిగిందని తెలిపారు.
SKLM: నరసన్నపేట మండలం ఉర్లాంలోని నివసిస్తున్న దొంపాక వరహాలమ్మ ఒంటరిగా జీవనం కొనసాగిస్తుంది. వృద్ధాప్య సమస్యలతో పాటు అనారోగ్యం బారిన పడి ఆమె శనివారం మృతి చెందింది. వరహాలమ్మ తమ్ముడు కొన్నేళ్ల క్రితం మరణించారు. అయితే ఆమె మృతి విషయం తెలుసుకున్న వరహాలమ్మ తమ్ముడి భార్య లక్ష్మి అంత్య క్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
NLR: పొదిలి పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం ఎస్.ఎస్ఎన్ డిగ్రీ కళాశాల, సాయంత్రం సాయిబాబా గుడి ఆవరణలో ఉచితంగా ధ్యానంపై సీనియర్ పిరమిడ్ మాస్టర్ జి.శైలజ శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ఎం. శ్రీనివాసరావు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
NDL: జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైల క్షేత్రంలో నేటి సాయంత్రం స్వామి అమ్మవారికి పల్లకి ఉత్సవాన్ని సాంప్రదాయపద్ధతిగా నిర్వహిస్తారు. సర్కారీ సేవ కింద దేవస్థానం ప్రతిరోజు వివిధ ప్రత్యేక పూజ కార్యక్రమాలను చేపడుతోంది. అలాగే ధర్మపథంలో భాగంగా.. ఆలయ దక్షిణ మాడవీధుల్లోని నిత్య కళారాధన వేదిక వద్ద వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు.
NDL: రుద్రవరం మండలం కోటకొండ చెరువులో ఎర్రమట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. రాత్రి వేళ పెద్ద ఎత్తున భారీ వాహనాలతో ఎర్రమట్టిని తోడేస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఘటనపై అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన కరువైందని వాపోయారు. ఎర్రమట్టి తవ్వకాలపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
అన్నమయ్య: రామసముద్రం మండలం పెద్దకురపల్లి పంచాయితీ మట్లవారిపల్లి జడ్పీ హైస్కూల్లో ఆదివారం శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలను హెచ్ఎం బాలసుబ్రమణ్యం నిర్వహించారు. పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. అనంతరం అందరికీ మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
SKLM: జిల్లాలోని BRR వంశధార, నారాయణపురం ఆనకట్ట మైనర్ ఇరిగేషన్ కింద మొత్తం 2,628 నీటి సంఘాల ప్రాదేశిక స్థానాలకు శనివారం ఎన్నికలు జరగగా 2606 స్థానాలకు ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయి. పలు కారణాలతో ఇంకా 22 ప్రాదేశిక స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. 344 నీటి సంఘాలకు గాను రెండు మినహా మిగతా అన్నిచోట్ల గెలుపొందిన వారికి అధికారులు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.
SKLM: టెక్కలి మండలం స్థానిక అంబేద్కర్ జంక్షన్ సమీపంలో నివాసం ఉంటున్న ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. భార్య భర్తల మనస్పర్థల కారణంగా మనస్తాపానికి చెందిన నాగులు కుమారి(20) ఆదివారం ఫినాయిల్ తాగి ఆత్మహత్య చేసుకుంది. అనంతరం తీవ్ర అస్వస్థతకు గురై అపస్మారక స్థితిలోకి చేరుకుంది. స్థానికులు గుర్తించి 108 అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు.
NLR: పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన క్యాంపు కార్యాలయంలో 16వ డివిజన్ ఇంఛార్జిగా జయరామిరెడ్డి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మాట్లాడారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నిజమైన కార్యకర్తగా జయరామిరెడ్డి సేవలు చేశారని కొనియాడారు.
NLR: సైదాపురం మండలం తుమ్మల తలుపూరు గ్రామంలో సాగు నీటి సంఘం ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి. దీనిలో భాగంగా అధ్యక్షుడిగా గుత్తా వెంకట కృష్ణయ్య నాయుడు, ఉపాధ్యక్షుడిగా కోసూరు బాలకృష్ణయ్య సభ్యులుగా పెమ్మసాని పార్ధసారధి నాయుడు, వేలూరు సంజీవయ్య నాయుడు, కోసూరు చిన్నబ్బయ్య,పెమ్మసాని ప్రసాద్ నాయుడు ఎన్నికయ్యారు. వారికి పలువురు అభినందనలు తెలిపారు.
NLR: బుచ్చి మండలంలో శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, చైర్పర్సన్ నోట్ల సుప్రజ మురళి శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కొరకు ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలను అర్పించారని కొనియాడారు.
NLR: బుచ్చి మండలంలో శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, చైర్పర్సన్ మొర్ల సుప్రజ మురళి శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కొరకు ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలను అర్పించారని కొనియాడారు.
NLR: బుచ్చి మండలంలో శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, చైర్పర్సన్ మొర్ల సుప్రజ మురళి శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కొరకు ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలను అర్పించారని కొనియాడారు.
NLR: గుంటూరులో జరిగే మాలల మహాగర్జనకు నాయుడుపేట, దొరవారిసత్రం, ఓజిలి, పెళ్లకూరు, చిట్టమూరు మండలాల నాయకులు బయలుదేరారు. వారు మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ వల్ల మాలలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. నేటి ప్రభుత్వాలు పునరాలోచించుకోవాలని, అలాకాని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని తెలిపారు.