కృష్ణా :పామర్రు వైసీపీ కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవం బుధవారం ఘనంగా జరిగింది.ఈ క్రమంలో వైసీపీ నేతలు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 1949 నవంబర్ 26వ తేదీన న్యాయం, స్వేచ్ఛ, మానవత్వం పునాదులతో పునాదులతో రూపొందించబడిందని వైసీపీ నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ATP: గుత్తిలో సామాజిక వాదుల ఆధ్వర్యంలో బుధవారం రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ముందుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.సామాజిక వాదులు రంగనాయకులు, జిఎం భాషా మాట్లాడుతూ.. రాజ్యాంగంలో బడుగు బలహీన వర్గాలకు, వెనుకబడిన వర్గాలకు రాజ్యాంగంలో సముచిత న్యాయం కల్పించిన వ్యక్తి అంబేద్కర్ అన్నారు.
VSP: విశాఖలో 76వ భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం వైసీపీ విశాఖ కార్యాలయంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు. జిల్లా ఎస్.సి విభాగం అధ్యక్షులు బోని శివరామకృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. వైసీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, మహిళా విభాగం అధ్యక్షురాలు పేడడరమణి కుమారి పాల్గొన్నారు.
NLR: అట్టడుగు, అణగారిన వర్గాల అభ్యున్నతి, ప్రజాస్వామ్య పరిఢవిల్లత, స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాతృత్వం వంటి విలువలకు మార్గదర్శక దీప స్తంభం రాజ్యాంగమని ప్రధానోపాధ్యాయురాలు పి. వేదవతి అన్నారు. బుచ్చి మున్సిపాలిటీ రామచంద్రాపురం పిఎంశ్రీ పాఠశాలలో భారత రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్,రాజేంద్రప్రసాద్ చిత్రపటాలకు ఘన నివాళులు అర్పించారు.
ప్రకాశం: తర్లుపాడు మండలం లింగారెడ్డి కాలనీ ప్రాథమిక పాఠశాలలో బుధవారం రాజ్యాంగ అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగడానికి ప్రాథమిక స్థాయి నుంచే రాజ్యాంగంపై అవగాహన పొందాలని హెచ్ఎం మౌలాలి విద్యార్థులకు తెలిపారు.ఈ సందర్భంగా విద్యార్థులు,ఉపాధ్యాయులు రాజ్యాంగ ప్రవేశిక ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ASR: కూటమి ప్రభుత్వం వ్యవసాయంలో అమలు పంచనూత్రాలు అన్నదాతకు అండగా నిలుస్తాయని రాష్ట్ర కనీస వేతనాల సలహమండలి డైరెక్టర్ సుబ్బారావు అన్నారు. డుంబ్రిగూడ మండలంలో పోతంగి పంచాయతీ పెదపాడు గ్రామంలో రైతన్నా మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం సుబ్బారావు మాట్లాడుతూ.. రైతు సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని పేర్కొన్నారు.
ATP: భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని పురస్కరించుకుని YSR కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా కార్యాలయంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్. అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. YSR జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆయన సేవలను కొనియాడారు.
NDL: ఆళ్లగడ్డ మండలం చింతకొమ్మదిన్నె గ్రామం వద్ద బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ముత్తులూరు నుంచి చాగలమర్రికి వెళ్తున్న ట్రాక్టర్ను వెనుక వైపు నుంచి లారీ ఢీకొంది. ట్రాక్టర్ యజమాని మహేశ్వర్ రెడ్డి (48) డ్రైవర్ వెంకటయ్య (32) గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు క్షతగాత్రులను 1033 ఆంబులెన్స్ లో ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
NLR: నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం చేజర్లలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థుల్లో అవగాహన పెంచే లక్ష్యంతో చిత్రలేఖన పోటీలను ఏర్పాటు చేశారు. డ్రాయింగ్ మాస్టర్ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
GNTR: మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజ్యాంగ ఆమోద దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. గౌతమ్ బుద్ధ రోడ్ వద్ద ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహానికి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. రాజ్యాంగానికి విరుద్ధంగా జరుగుతున్న వ్యతిరేక దాడులు, దౌర్జన్యాలపై వారు గళమెత్తారు.
ప్రకాశం: కనిగిరి మున్సిపల్ పరిధిలోని ఏడవ వార్డు కొత్తూరు నందు బుధవారం ఒంగోలు మాజీ పార్లమెంటు సభ్యులు మాగుంట సుబ్బరామిరెడ్డి 78వ జయంతి వేడుకలు టిడిపి నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కనిగిరి పట్టణ టీడీపీ అధ్యక్షులు ఫిరోజ్ ఆధ్వర్యంలో మా గుంట సుబ్బరామిరెడ్డి విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.
W.G: జిల్లాలోని తీర ప్రాంతాల్లో ఈనెల 27 నుంచి డిసెంబర్ 1 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ముఖ్యంగా 29, 30, డిసెంబర్ 1 తేదీల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ సూచించినట్లు జేసీ టి. రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. రైతులు అప్రమత్తంగా ఉండి, పొలాల్లో తేమ పెరగకముందే వరి కోతకు సిద్ధం కావాలని ఆయన సూచించారు.
SKLM: ఎల్ఎన్ పేట మండల కేంద్రంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని అధికారులు ఇవాళ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే గోవిందరావు పాల్గొన్నారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అంబేద్కర్ చూపించిన సమానత్వ, న్యాయం మార్గంలో అందరం నడవాలి అని పిలుపునిచ్చారు.
కృష్ణా: పెడన టౌన్ వైసీపీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం 76వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా భారతరత్న డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పెడన నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ ఉప్పాల రాము పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పెడన నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
VZM: రైతు బలపడితేనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి పేర్కొన్నారు.పెద్ద తాడివాడలో ‘రైతన్నమీ కోసం’ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని పథకాలను అమలు చేసోందని, ప్రతి రైతు ప్రభుత్వ సదుపాయాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.