• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ప్రేమ, శాంతి ఏసుప్రభు చూపిన మార్గాలు: చదలవాడ

GNTR: ప్రేమ, శాంతి ఏసుప్రభు చూపిన మార్గాలని ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు అన్నారు. శనివారం నరసరావుపేటలోని స్థానిక లూధరన్ చర్చిలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. సమాజంలో సోదర భావం పెరిగి అన్ని కుటుంబాలకు మంచి జరగాలని ఆకాంక్షించారు.

December 15, 2024 / 08:42 AM IST

సోమశిలకు 4,126 క్యూసెక్కుల వరద

NLR: అనంతసాగరం మండలం సోమశిల జలాశయానికి ఆదివారం ఎగువ ప్రాంతాల నుంచి 4,126 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతున్నట్లు అధికారులు తెలిపారు. జలాశయం పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 72.809 టీఎంసీల నీటిమట్టం నమోదయింది. పెన్నా డెల్టాకు 1,500 క్యూసెక్కులు, కండలేరుకు 1200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయంలో 295 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతుంది.

December 15, 2024 / 08:41 AM IST

‘జిల్లాలో 281 సాగునీటి సంఘాలు ఏకగ్రీవం’

AKP: అనకాపల్లి జిల్లాలో సాగునీటి సంఘాల ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. ఈ మేరకు శనివారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేశారు. నాతవరం మండలం తాండవ రిజర్వాయర్ పరిధిలో 16 సంఘాలకు, మధ్య తరహా ప్రాజెక్టులకు సంబంధించి 28 సంఘాలకు, చిన్న తరహా సంఘాలు 256కు ఎన్నికలు నిర్వహించామన్నారు. వీటిలో 281 సాగునీటి సంఘాలు ఏకగ్రీవం అయినట్లు తెలిపారు.

December 15, 2024 / 08:40 AM IST

‘ఉనికి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్న వైసీపీ నేతలు’

కృష్ణా: జనరంజకంగా సాగుతున్న కూటమి ప్రభుత్వ పాలనను చూసి ఓర్వలేక వైసీపీ నేతలు ఉనికి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. శనివారం మచిలీపట్నం వచ్చిన ఆయన మంత్రి కొల్లు రవీంద్ర నివాసంలో మీడియాతో మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లలో ఎటువంటి ఇబ్బందులు లేనప్పటికీ రైతుల పేరు చెప్పి వైసీపీ నేతలు కలెక్టరేట్ల వద్ద ధర్నాలు విడ్డూరంగా ఉందన్నారు.

December 15, 2024 / 08:30 AM IST

ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు

NDL: సంజామల మండల వ్యాప్తంగా సాగునీటి సంఘాల ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్లు తహాశీల్దార్ అనిల్ కుమార్ తెలిపారు. సంజామల SRBC సాగునీటి సంఘం అధ్యక్షుడిగా తలారి మల్కి హుస్సేని, ఉపాధ్యక్షుడిగా మూరబోయిన శివయ్య ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా TDP నేత పెండేకంటి కిరణ్ కుమార్, తహాశీల్దార్ గెలుపొందిన అభ్యర్థులకు డిక్లరేషన్ ఫారం అందజేశారు.

December 15, 2024 / 08:30 AM IST

చోరికి పాల్పడిన వ్యక్తి అరెస్ట్

NDL: ఆత్మకూరు స్వరాజ్‌నగర్‌కు చెందిన ఆదిలక్ష్మి అనే మహిళ ఈనెల 7న బెంగళూరు వెళ్ళారు. 9న ఆమె తిరిగి రాగా ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించి పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసిన ఎస్సై హుస్సేన్ బాషా దర్యాప్తు చేపట్టి శనివారం చోరీకి పాల్పడిన షేక్ ఖాదర్ బాషా(గుండు)ను శనివారం అరెస్ట్ చేసి రూ.1,45,000 విలువగల ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

December 15, 2024 / 08:28 AM IST

బైక్ ఢీకొని వ్యక్తి మృతి

SKLM: కంచిలి మండలం కొన్నాయిపుట్టుగ సమీపంలో సంభవించిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. మాణిక్య పురానికి చెందిన రమేష్ అనే వ్యక్తి నడుచుకుంటూ వెళ్తుండగా అటుగా వస్తున్న ద్విచక్రవాహనదారుడు ఢీకొట్టాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సోంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

December 15, 2024 / 08:26 AM IST

పేకాట శిబిరంపై దాడి..8 మంది అరెస్ట్

SKLM: నరసన్నపేట మండలంలో జమ్ము గ్రామ పరిసరాలలో ముందస్తు సమాచారంతో పేకాట శిబిరంపై దాడి చేయడం జరిగిందని ఎస్సై సి. హెచ్ దుర్గాప్రసాద్ తెలిపారు. శనివారం జమ్ము గ్రామంలోని ఒక మిల్లు వద్ద పేకాట ఆడుతున్న 8 మందిని అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు. 1,300 రూపాయలు, ఒక మొబైల్ స్వాధీనం చేసుకున్నామన్నారు. 8 మందిని అరెస్టు చేయడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు.

December 15, 2024 / 08:24 AM IST

ఈనెల 18న స్టీల్ ప్లాంట్ వద్ద కర్మాగారం ఉద్యోగులు ధర్నా

VSP: బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉక్కు కర్మాగారం ఉద్యోగులు ఈనెల 18న స్టీల్ ప్లాంట్ అడ్మిన్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు పోరాట కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఆరోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు నిర్వహించే ధర్నాలో ఉద్యోగుల పాల్గొనాలన్నారు. ఉద్యోగులు, కార్మికులకు సకాలంలో వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

December 15, 2024 / 08:21 AM IST

కూరగాయల అలంకరణలో వరాల ఆంజనేయుడు

అన్నమయ్య: మదనపల్లె పట్టణంలోని శ్రీ వరాల ఆంజనేయ స్వామి కూరగాయల అలంకరణతో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ఆదివారం వేకువజామునే స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి అభిషేకాలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు. ఆయన మాట్లాడుతూ.. పౌర్ణమి పురస్కరించుకొని నేడు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించడం జరిగిందని తెలిపారు.

December 15, 2024 / 08:21 AM IST

నీటి సంఘం నాయకులను అభినందించిన ఎమ్మెల్యే అశోక్

SKLM: కవిటి రామయ్య పుట్టుగ పార్టీ కార్యాలయంలో శనివారం సోంపేట నీటి సంఘం నాయకులు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అశోక్ బాబును కలిశారు. ఈ మేరకు ఈరోజు జరిగిన ఎన్నికల్లో చీకటి, సోంపేట, గొల్లవాని చెరువు నీటి సంఘం ఎన్నికల్లో అధ్యక్ష, ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన తెల్లి యోగేశ్వరరావు, కేత చిరంజీవిలు, టీ. సీ మెంబర్లు కలిశారు. వీరిని ఎమ్మెల్యే అభినందించారు.

December 15, 2024 / 08:14 AM IST

శ్రీ వాసవి అమ్మవారికి మార్గశిర మాస పౌర్ణమి పూజలు

ATP: గుత్తి పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా అమ్మవారి ఆలయంలో ఆదివారం మార్గశిర మాసం పౌర్ణమి సందర్భంగా ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు వాసుదేవ శర్మ వేకువ జామున అమ్మవారి మూలమూర్తికి సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి బంగారు,వెండి ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు.

December 15, 2024 / 08:12 AM IST

పుట్టినరోజు నాడు తీవ్ర విషాదం

KRNL: రాజంపేటలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జిల్లాకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందాడు. కోవెలకుంట్లకు చెందిన కిరణ్ రాజంపేట ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్నాడు. శనివారం కిరణ్ పుట్టినరోజు కావడంతో పులివెందులకు చెందిన ఫ్రెండ్ బన్నీ చెన్నైలో చదువుతూ రాజంపేటకు వచ్చారు. కాగా, వీరి ఇరువురినీ ఆర్టీసీ బస్సు ఢీకొని పుట్టినరోజు నాడే మృతి చెందాడు.

December 15, 2024 / 08:10 AM IST

‘రాజీతో జిల్లాలో 2937 కేసులు పరిష్కారం’

SKLM: లోక్ అదాలత్‌లో జిల్లా వ్యాప్తంగా 19 బెంచీలు ఏర్పాటు చేసి 2937 కేసులను పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా శనివారం తెలిపారు. వాటిలో సివిల్ కేసులు 138, క్రిమినల్ 2,694, వాహన ప్రమాదాలకు సంబంధించినవి 43, ప్రీ లిటిగేషన్ కేసులు 62 ఉన్నట్లు వివరించారు.

December 15, 2024 / 08:10 AM IST

‘362 కేసులకు పరిష్కారం’

NDL: జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని కోర్టు ఆవరణలో నిర్వహించామని మూడవ అదనపు జిల్లా జడ్జి వాసు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. లోక్ అదాలత్‌లో సీసీ కేసులు 92, సివిల్ కేసులు 41, క్రిమినల్ కేసులు 118, ఎక్సైజ్ 16 కేసులు చొప్పున మొత్తం 362 కేసులు పరిష్కారం అయ్యాయని న్యాయమూర్తి వాసు తెలిపారు.

December 15, 2024 / 08:07 AM IST