• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఖేలో ఇండియాలో చీరాల యువకుడి దూకుడు

BPT: ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్‌లో వెయిట్‌లిఫ్టింగ్ 88 కేజీల విభాగంలో చీరాలకు చెందిన ప్రేమ్ సాగర్ ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. రెండు ట్రయల్స్‌లో అగ్రస్థానంలో నిలిచి మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. రాయ్‌పూర్‌లో జరిగే ఫైనల్ పోటీలకు సిద్ధమవుతున్నాడు. అతని తల్లి స్వాతి స్థానికంగా రాజకీయంగా క్రియాశీలకంగా ఉన్నారు.

March 26, 2026 / 01:23 PM IST

వైసీపీ నాయకుడిని పరామర్శించిన మాజీ మంత్రి కుమారుడు

NDL: ప్యాపిలి మండలం కల్చట్ల గ్రామంలో అనారోగ్యంతో ఉన్న సీనియర్ వైసీపీ నాయకుడు బాలా అంజిని మాజీ మంత్రి కుమారుడు బుగ్గన అర్జున్ అమర్నాథ్ రెడ్డి గురువారం పరామర్శించారు. ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. బాలా అంజి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. స్థానిక నాయకులు వెంకటేశ్వర రెడ్డి, రజినీకాంత్ రెడ్డి ఉన్నారు.

March 26, 2026 / 01:23 PM IST

నాగిరెడ్డిపల్లి సచివాలయంపై ప్రజల ఆగ్రహం

అన్నమయ్య: నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలో రూ. 40 లక్షలతో నిర్మించిన సచివాలయం-1 భవనం ఏడేళ్లు గడిచినా ప్రారంభానికి నోచుకోలేదు. చిన్నపాటి విద్యుత్ పనులు మినహా అన్నీ పూర్తయినా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో అద్దె భవనాల్లో సేవలు నిర్వహిస్తూ ప్రజాధనం వృథా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

March 26, 2026 / 01:23 PM IST

పారిశుద్ధ్య కార్మికులకు వస్త్రాల పంపిణీ

కర్నూలు: నగరపాలక సంస్థలో పారిశుద్ధ్య కార్మికులుగా విధులు నిర్వహిస్తున్న మహిళలకు బీసీ సంక్షేమ శాఖలో పదవీ విరమణ చేసిన వసతి గృహ సంక్షేమాధికారి కేటీ బాబు, రమాదేవి దంపతులు వస్త్రాలను పంపిణీ చేశారు. ఉగాది, రంజాన్, శ్రీరామనవమి పండుగలను పురస్కరించుకుని ఏటా నిర్వహిస్తున్న విధంగానే ఇవాళ ఈ కార్యక్రమం నిర్వహించినట్లు వారు పేర్కొన్నారు.

March 26, 2026 / 01:23 PM IST

మైక్రో ఫిల్టర్.. నీటి కష్టాలకు చెక్..!

W.G: ఆకివీడు మండలం మందపాడులో పలు అభివృద్ధి పనులను ఉండి MLA రఘురామరాజు గురువారం ప్రారంభించారు. PWS స్కీం కింద రూ. 9.5 లక్షలతో నిర్మించిన 0.5 MLD మైక్రో ఫిల్టర్‌ను జాతికి అంకితం చేశారు. అనంతరం ఉప్పుటేరు వద్ద నూతనంగా నిర్మించిన రేవును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కనుమూరి బాపిరాజు, స్థానిక నేతలు పాల్గొన్నారు.

March 26, 2026 / 01:22 PM IST

ఈ నెల 28న మెగా జాబ్ మేళా

TPT: తిరుపతి SVU ఎంప్లాయిమెంట్ కార్యాలయం మోడల్ కెరీర్ సెంటర్‌లో 28వ తేదీ ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కార్యాలయ అధికారి శ్రీనివాసులు పేర్కొన్నారు. 6 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. దాదాపు 560 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు చెప్పారు.

March 26, 2026 / 01:21 PM IST

వంటగ్యాస్ కొరత.. ఇబ్బందుల్లో ప్రజలు

KDP: లింగాల(M)లోని గ్రామాల్లో వంట గ్యాస్ కొరత కారణంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లింగాల మండలంలో సుమారు 500 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. పులివెందులలో ఓ గ్యాస్ ఏజెన్సీ వారానికోసారి ప్రత్యేక వాహనం ద్వారా గ్యాస్ సిలిండర్లను అందించేది. వారం రోజుల క్రితం సిలిండర్లు బుక్ చేసుకుని ఓటీపీలు వచ్చినప్పటికీ గ్రామాలకు గ్యాస్ సిలిండర్లను అందించలేదని వారు అవేదన వ్యక్తం చేస్తున్నారు.

March 26, 2026 / 01:21 PM IST

సైడ్ కాలువల్లో పేరుకుపోయిన చెత్తా చెదారం

NTR: సైడ్ డ్రైనేజీ శుభ్రం చేయడంలో VMC అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పటమట హై స్కూల్ రోడ్డులోని సైడ్ డ్రైనేజీలు అధ్వానంగా ఉన్నాయని చెబుతున్నారు. దీంతో దోమలు బెడద విపరీతంగా ఉందని వాపోతున్నారు. లార్వా నాసిన్ మందులు పిచికారి చేయడం కూడా విస్మరించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

March 26, 2026 / 01:20 PM IST

ప్రజాదర్బార్‌లో అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే

PLD: వెల్దుర్తి మండలంలోని క్యాంప్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి అర్జీలు స్వీకరించారు. సంబంధిత సమస్యలపై అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి, త్వరితగతిన పరిష్కారం చూపాలని ఆదేశించారు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

March 26, 2026 / 01:18 PM IST

‘ఆలయ పూజారిపై వైసీపీ శ్రేణులు దాడి చేయడం దారుణం’

SS: తాడిమర్రి మండలం గూడ్దంపల్లిలో ఆలయ పూజారి శివయ్యపై వైసీపీ శ్రేణులు దాడి చేయడం దారుణమని నియోజకవర్గ బీజేపే ఇంఛార్జ్ హరీష్ బాబు మండిపడ్డారు. గురువారం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడిని ఆయన పరామర్శించారు. నిందితులను తక్షణమే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.

March 26, 2026 / 01:17 PM IST

వాడపల్లి వెంకన్న కళ్యాణ మహోత్సవాలకు మంత్రికి ఆహ్వానం

కోనసీమ జిల్లా తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాలకు తరలిరావాలని కోరుతూ జిల్లా ఇంఛార్జ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆహ్వానించారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో గురువారం మంత్రిని కలుసుకుని స్వామివారి కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రిక, ప్రసాదం అందజేశారు.

March 26, 2026 / 01:15 PM IST

పచ్చని తోరణాలు.. చల్లని నీడలో వాహనదారులు

KDP: పులివెందుల పట్టణంలోని పార్నపల్లె రింగ్ రోడ్డు నుంచి రంగనాథస్వామి రింగ్ రోడ్డు, శిల్పారామం వెళ్లే రోడ్డుకు ఇరువైపులా విస్తరించిన వృక్షాలు ఒక పచ్చని తోరణాలతో ఏర్పడి వాహనదారులకు చల్లని నీడను ఇస్తున్నాయి. మండు వేసవిలో పచ్చని ఆకులతో చిగురించి పచ్చదనాన్ని పంచుతున్నాయి. మహిళలు, పురుషులు వాకింగ్ చేస్తూ ఆహ్లాదాన్ని పొందుతున్నారు.

March 26, 2026 / 01:14 PM IST

అనుమతులు లేని బాణసంచా నిల్వలు స్వాధీనం

NLR: దడదర్తి మండలం కాట్రాయపాడులో వెంకటేశ్వర్లు అనే వ్యక్తి అనుమతులు లేకుండా బాణాసంచా విక్రయిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఎస్సై జంపాని కుమార్ తన సిబ్బందితో కలిసి గురువారం దాడులు చేశారు. నిల్వ చేసిన టపాసులు స్వాధీనం చేసుకున్నారు. మండలంలో ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

March 26, 2026 / 01:14 PM IST

ఎస్సైని సన్మానించిన యాంటీ కరప్షన్ ఫోరం సభ్యులు

SS: సోమందేపల్లి మండల నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన సుధాకర్ యాదవ్‌ను యాంటీ కరప్షన్ ఫోరం సభ్యులు గురువారం సోమందేపల్లి పోలీస్ స్టేషన్‌లో సన్మానించారు. సత్యసాయి జిల్లా హ్యూమన్ రైట్స్, యాంటీ కరప్షన్ ఫోరం అధ్యక్షులు నరసింహామూర్తి ఆధ్వర్యంలో సభ్యులు ఎస్సైను కలిసి శాలువా కప్పి, పూల బొకే అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో నాగభూషణ్ రెడ్డి పాల్గొన్నారు.

March 26, 2026 / 01:14 PM IST

చావలి గ్రామంలో మహిళల అవగాహన ర్యాలీ

TPT: పెళ్లకూరు (M) దిగువ చావలి గ్రామపంచాయతీలో టీబీ ముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మహిళల అవగాహన ర్యాలీ నిర్వహించారు. “టీబీ నివారణ మా లక్ష్యం-క్షయ వ్యాధి రహిత రాష్ట్రమే మా ధ్యేయం” అనే నినాదంతో ప్రతిజ్ఞ చేశారు. ప్రతి పౌరుడు వ్యాధి బారిన పడకుండా కాపాడడం మన బాధ్యత అని పంచాయతీ కార్యదర్శి మాధవి, ఏఎన్ఎం శోభన తెలిపారు.

March 26, 2026 / 01:12 PM IST