కోనసీమ: సఖినేటిపల్లి (M) అంతర్వేదిలో ఆదివారం రావి సత్య నారాయణ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. స్థానికుల వివరాల ప్రకారం.. పిల్లలు లేక అన్న కుమారుడు రాంబాబుని సత్యనారాయణ పెంచుకున్నారు. అతని పేరున ఉన్న 40 సెంట్ల భూమిని తన పేరున రాయాలని పెంచుకున్న కొడుకు కొద్ది రోజుల నుంచి వేధిస్తున్నాడు. అందుకు సత్యనారాయణ నిరాకరించడంతో స్టూల్తో కొట్టి చంపినట్లు తెలిపారు.
ATP: గుత్తి మండలంలోని వివిధ గ్రామాల్లో చెత్త పేరుకుపోయి ప్రజలు అనారోగ్య బారిన పడుతున్నారు. గుత్తి మండలంలోని బాచుపల్లి, ఊటకల్లు, బేతపల్లి, యంగనపల్లి తదితర గ్రామాల్లో రోడ్డుకు ఇరువైపులా ప్లాస్టిక్ వ్యర్థపదార్థాలు పేరుకుపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయా పంచాయతీ అధికారులు స్పందించి గ్రామాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ప్రకాశం: గిద్దలూరులో ఆదివారం శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలు కూడా అర్పించిన వ్యక్తి శ్రీరాములు అన్నారు. యవత శ్రీరాములు అడుగుజాడల్లో నడవాలని బీజేపీ అధ్యక్షులు ఉదయ్ శంకర్ తెలిపారు.
ప్రకాశం: అమరజీవి పొట్టి శ్రీరాములు వర్థంతి సందర్భంగా ఆదివారం కనిగిరి పట్టణంలోని బొడ్డు చావడి వద్ద ఉన్న రాములు విగ్రహానికి కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉగ్ర తెలుగువారికి ప్రత్యేక రాష్ట్ర సాధనకై అమర నిరాహార దీక్ష చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఒలేటి చిన్న, ఆర్యవైశ్య నాయకులు, పాల్గొన్నారు.
NLR: దర్శిలో అమరజీవి పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా దర్శి YCP కార్యాలయంలో నాయకులు అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తదుపరి వారు మాట్లాడుతూ.. ఆంధ్ర రాష్ట్రానికి ఆయన చేసిన సేవలు తలుచుకొని కొనియాడారు.
ప్రకాశం: మార్టూరు మండలం కోనంకి నీటి సంఘం ఎన్నికల్లో ఛైర్మన్గా గెలుపొందిన శ్రీరాములు, వైస్ ఛైర్మన్ చక్రపాణి ఆదివారం పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలూరి వారిని అభినందించారు. ఈ సందర్భంగా రైతులకు సాగునీటిని చివరి భూములు వరకు అందించేందుకు కృషి చేయాలని సూచించారు.
NLR: కావలి పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆదివారం శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
NDL: సంజామల మండలం ముదిగేడు గ్రామ సచివాలయంలో అమరజీవి శ్రీపొట్టి శ్రీరాములు వర్ధంతి పురస్కరించుకొని పంచాయితీ కార్యదర్శి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి సచివాలయ ఉద్యోగులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఆంధ్ర రాష్ట్ర సాధనలో SPSR సేవలు చిరస్మరణీయం అని కొనియాడారు. మహబూబ్ బేగ్, సురేంద్ర, ప్రేమ్ రాజ్, మస్తాన్, రామకృష్ణ, గౌసియా, రేష్మ పాల్గొన్నారు.
NDL: సంజామల మండలం ముదిగేడు గ్రామ సచివాలయంలో అమరజీవి శ్రీపొట్టి శ్రీరాములు వర్ధంతి పురస్కరించుకొని పంచాయితీ కార్యదర్శి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి సచివాలయ ఉద్యోగులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఆంధ్ర రాష్ట్ర సాధనలో SPSR సేవలు చిరస్మరణీయం అని కొనియాడారు. మహబూబ్ బేగ్, సురేంద్ర, ప్రేమ్ రాజ్, మస్తాన్, రామకృష్ణ, గౌసియా, రేష్మ పాల్గొన్నారు.
SKLM: ఆమదాలవలసలో వైసీపీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం సందర్భంగా ఆదివారం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు ఆయన త్యాగాన్ని మన తెలుగుజాతి ఏనాటికీ మరచిపోదని అన్నారు. ఆ మహనీయుని స్ఫూర్తితో మనరాష్ట్ర అభ్యున్నతి కోసం అందరం పాటుపడాలని కోరారు.
NDL: ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలంలో రేపటి నుంచి శ్రీవారికి ధనుర్మాస ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ప్రధానార్చకులు క్రీడాంబి వేణుగోపాల్ స్వామి తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ .. ప్రతి ఏటా ఎగువ, దిగువ అహోబిలం క్షేత్రాలలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి, శ్రీ గోదాదేవి ఆండాళ్కు నెలరోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుందన్నారు.
కోనసీమ: గుంటూరులో జరుగుతున్న మహసభకు ఆదివారం కాజులూరు మండలం నుంచి మాలమహానాడు నేతలు భారీగా తరలి వెళ్లారు. బస్సులతో పాటు పలు వాహనాల్లో గుంటూరు సభకు మాలలు బయలు దేరారు. ఈ సందర్భంగా జై మాల, జై జై మాల నినాదాలు మిన్నంటాయి. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను అడ్డుకుంటామంటూ వారు ప్రతిజ్ఞ చేశారు.
KKD: టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడును అన్నవరం దేవస్థానం నూతన ఈవో సుబ్బారావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదివారం అన్నవరం దేవస్థానం నూతన కార్యనిర్వాహణ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించి, స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం టీడీపీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా యనమలను కలిసి శాలువా కప్పి పుష్పగుచ్చం అందజేశారు.
W.G: తణుకు పట్టణంలో సూర్యాలయం వీధిలో కొలువైవున్న శ్రీ సూర్యభగవానుడికి స్వామివారికి ప్రీతికరమైన ఆదివారం కావడంతో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. తణుకు, పైడిపర్రు, వేల్పూరు, చివటం, కొమరవరం, పాలంగి, తదితర గ్రామాల ప్రజలు స్వామి వారిని దర్శిచుకున్నారు. పూజలు అనంతరం విచ్చేసిన భక్తులకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించారు.
VZM: కృష్ణా జిల్లా గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో శనివారం జరిగిన రాష్ట్ర మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో నిర్వహించిన జావెలిన్ త్రోలో ఎస్ కోట వైస్ ఎంపీపీ ఇందుకూరి సుధారాణి బంగారు పతకం కైవసం చేసుకున్నారు. అలాగే జిల్లాకు చెందిన 50 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో తమ ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారు. ఈ మేరకు ఎమ్మెల్సీ ఇందుకూరి రఘరాజు క్రీడాకారులను అభినందించారు.