• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

వైసీపీ పరిశీలకురాలిగా రమణి

VSP: వైసీపీ పార్టీ విశాఖ తూర్పు నియోజకవర్గ పరిశీలకురాలిగా మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణి కుమారి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆమె రీజినల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబును ఇవాళ మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.

March 18, 2026 / 11:54 AM IST

శిథిలావస్థలో బడులు.. అటకెక్కుతున్న చదువులు

PPM: వీరఘట్టం మండలం పెద్దూరు ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరింది. దశాబ్దాల కాలం కావడంతో భవనం శ్లాబు పెచ్చులు ఊడి పోయింది. దీంతో ప్రమాదం ఉన్నచోటే చదువులు కొనసాగించాల్సి వస్తోంది. ఇక్కడ 25 మంది చిన్నారులు చదువుతున్నట్లు ఉపాధ్యాయులు పేర్కొన్నారు. వానా కాలంలో వర్షపు నీరు కారుతోందని చెబుతున్నారు. అధికారులు స్పందించి కొత్త భవనం నిర్మించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.

March 18, 2026 / 11:54 AM IST

కొత్తచెరువులో ‘రైతన్న మీకోసం’ వారోత్సవాలు

సత్యసాయి: కొత్తచెరువు మండలం పోతులకుంట, మరువకుంటపల్లి గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘రైతన్న మీకోసం’ వారోత్సవాలను నేడు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా వివరించారు.

March 18, 2026 / 11:49 AM IST

ముస్లిం సోదరుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి: ఎమ్మెల్యే

ATP: అనంతపురం అంబేద్కర్ ఫంక్షన్ హాల్‌లో ప్రభుత్వం నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే బండారు శ్రావణి పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఆమె పేర్కొన్నారు. హజ్ యాత్రికులకు లక్ష రూపాయల సాయం, హజ్ హౌస్ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ముస్లిం సోదరుల అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని స్పష్టం చేశారు.

March 18, 2026 / 11:47 AM IST

రామాలయానికి ఆష్ట భుజి రథ సమర్పణ ఎప్పుడంటే..!

ELR: ఉంగుటూరు (M) కైకరం సుందర సీతారామస్వామి కళింగ రామాలయంలో భక్తులు సమకూర్చిన రూ. 5 లక్షలపైగా విరాళాలతో రూపొందించిన ఆష్ట భుజి టేకు రథం ఈనెల 21న సమర్పణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సమన్వయ కర్త కూన అప్పారావు బుధవారం తెలిపారు. కర్ణాటకలోని కుంట పట్నానికి చెందిన కుంట హస్త కళా సంస్థ ఈ దివ్య రథ నిర్మాణం చేశారని పేర్కొన్నారు.

March 18, 2026 / 11:46 AM IST

బావిలో పడి యువకుడు మృతి

CTR: ప్రమాదవశాత్తు బావిలో పడి యువకుడు మృతి చెందిన సంఘటన సదుం మండలంలో ఇవాళ వెలుగు చూసింది. గ్రామస్తుల కథనం మేరకు.. కంభం వారి పల్లి పంచాయతీ గాండ్ల పల్లెకు చెందిన మోహన్ బాబు (26) వ్యవసాయ పొలాల వద్ద మోటర్ మరమ్మతులు చేస్తూ ప్రమాదవశాత్తు నిన్న సాయంత్రం బావిలోపడ్డాడు. ఇవాళ అతని మృతదేహాన్ని గుర్తించి స్థానికులు వెలికి తీశారు.

March 18, 2026 / 11:44 AM IST

‘ఆకివీడులో శాంతి కమిటీ వేయండి’

W.G: ఆకివీడు పెదపేట గుడి వివాదంలో రాజకీయ నాయకులు ఏకపక్షంగా వ్యవహరించకూడదని CPM ఏరియా కమిటీ కోరింది. ఇరు వర్గాలను సమన్వయ పరుస్తూ మతసామరస్యం పెంపొందించాలని బుధవారం ఏరియా కార్యదర్శి కె. తవిటి నాయుడు సూచించారు. వివాద పరిష్కారానికి శాంతి కమిటీ వేయాలని, ఎవరూ రెచ్చగొట్టే ధోరణిలో ప్రయత్నించవద్దని కోరారు.

March 18, 2026 / 11:38 AM IST

నేడు శ్రీకాకుళంలో ఇఫ్తార్ విందు

SKLM: రంజాన్ పండుగను పురస్కరించుకుని ఇవాళ నగరంలో జిల్లా స్థాయి ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసినట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి షైక్ మహబూబ్ షరీఫ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ రోడ్డులోని శశి కన్వెన్షన్ హాల్‌లో సాయంత్రం 6 గంటల నుంచి ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు .

March 18, 2026 / 11:31 AM IST

‘ప్రతి ఇంటా సిరి సంతోషాలు వెల్లివిరియాలి’

VZM: తెలుగు వారి కొత్త సంవత్సరాధి ‘శ్రీ పరాభవ నామం’లో ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) జిల్లా ప్రజలకి శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది పచ్చడిలోని షడ్రుచులు మాదిరి జీవితంలోని కష్టసుఖాల సమ్మేళనానికి ప్రతీకలని, ప్రజలందరూ ధైర్యంతో, ఉత్సాహంతో కొత్త ఏడాదిలో అడుగుపెట్టాలని ఆయన పిలుపునిచ్చారు.

March 18, 2026 / 11:29 AM IST

పశు వైద్యశాల.. సమస్యల గోల..!

KDP: ఖాజీపేట(M) ఆంజనేయ కొట్టాల గ్రామంలోని పశు వైద్యశాలలో సమస్యలు వేధిస్తున్నాయి. ఈ ఆసుపత్రి ఇరుకుగా ఉండటంతో సిబ్బంది ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. మరుగుదొడ్డి, మంచినీరు వంటి కనీస సదుపాయం లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పశుసంవర్ధక శాఖ అధికారులు దృష్టి పెట్టి సమస్యలను పరిష్కరించాలని, ఆసుపత్రికి వచ్చే పాడి రైతులు ఉన్నత అధికారులను కోరుతున్నారు.

March 18, 2026 / 11:29 AM IST

ఇంటర్మీడియట్ పరీక్షలు.. 333 మంది గైర్హాజరు

TPT: రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం కెమిస్ట్రీ పేపర్-2 పరీక్ష జరుగుతుంది. ఇందులో భాగంగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా 84 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 24,332 మంది విద్యార్థులకు గాను 23,999 మంది విద్యార్థులు హాజరైనట్లు రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 333 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు అధికారులు తెలియజేశారు.

March 18, 2026 / 11:29 AM IST

విశ్రాంత జాయింట్ కలెక్టర్ కన్నుమూత

KRNL: కర్నూలు జిల్లా విశ్రాంత జాయింట్ కలెక్టర్-2 ఎస్. రామస్వామి బుధవారం మృతి చెందారు. 2022లో పదవీ విరమణ పొందిన ఆయన, గతంలో జిల్లా రెవెన్యూ అధికారిగా (DRO) అనేక ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు. రామస్వామి మృతికి జిల్లా ఉద్యోగ సంఘాల నాయకులు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. పరిపాలనలో ఆయన అందించిన విశేష సేవలను పలువురు కొనియాడారు.

March 18, 2026 / 11:27 AM IST

శ్మశానంలో పేకాట శిబిరం.. ఇద్దరు అరెస్ట్

కోనసీమ: అమలాపురం మండలం మున్సిపల్ కాలనీ వెనుక ఉన్న శ్మశానంలో పేకాట శిబిరంపై పట్టణ ఎస్సై NR కిషోర్ బాబు సిబ్బందితో కలిసి నిన్న రాత్రి మెరుపు దాడి చేశారు. పేకాట ఆడుతున్న కాలాడి వెంకటేశ్, తాళ్ల భగవాన్ రాజును అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.3,050 నగదు, పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. జూదాలు ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.

March 18, 2026 / 11:26 AM IST

నేడే ఎస్పీ కార్యాలయ ప్రారంభోత్సవం

అన్నమయ్య: మదనపల్లె- బెంగళూరు జాతీయ రహదారిలో మడికయ్యల శివాలయం వెళ్లే దారిలో ఏర్పాటు చేసిన నూతన జిల్లా పోలీసు కార్యాలయాన్ని ఇవాళ కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ప్రారంభించనున్నారు. డీఐజీ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటికే జిల్లా ఎస్పీ దీరజ్ అడిషనల్ ఎస్పీ వెంకటాద్రిలు భవనంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

March 18, 2026 / 11:26 AM IST

ఒకేసారి ఎన్నికల కోసం కసరత్తు

CTR: మూడు జిల్లాల పరిధిలో జిల్లా పరిషత్తుల ఏర్పాటు పని ప్రారంభమైంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని జిల్లా పరిషత్ ఎన్నికల నాటికి అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు కొత్తగా జిల్లా పరిషత్తులు ఏర్పాటు చేసేలా రాష్ట్రస్థాయిలో కసరత్తు నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్‌లో జడ్పీ పదవీకాలం ముగియనుండటంతో, ఆలోపు విభజించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

March 18, 2026 / 11:22 AM IST