NDL: శ్రీశైలంలో కొలువైన దత్తాత్రేయ స్వామికి ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సహాయ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు, పండితులు ముందుగా దత్తాత్రేయ స్వామిని ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం గణపతి పూజ, దత్తాత్రేయ ఆరాధన, పాలాభిషేకం, పంచామృత అభిషేకం జరిపారు. పలు ప్రాంతాల భక్తుల దత్తాత్రేయ స్వామిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.
KRNL: తిరుచానూరులోని శ్రీ క్షేత్రాన్ని మంత్రాలయం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థులు ఆదివారం సందర్శించారు. శ్రీ స్వామీజీకి ఆలయ అర్చకులు, అధికారులు సంప్రదాయ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఉత్సవ స్వీకరణ అనంతరం శ్రీ స్వామిజీ శ్రీ పద్మావతి అమ్మవారి దివ్య దర్శనానికి వెళ్లారు. ఈ సందర్శనలో శ్రీ స్వామీజీ శ్రీ పద్మావతి అమ్మవారికి ప్రార్థనలు చేశారు.
కృష్ణా: కైకలూరులోని గాంధీ బొమ్మ సెంటర్లోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఆదివారం ఆయన వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆంధ్ర రాష్ట్రం కోసం 58 రోజులు పాటు ఆమరణ దీక్ష చేసిన ఆయన పోరాట స్ఫూర్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్యసంఘ క్యాలెండర్ ఆవిష్కరించారు.
ప్రకాశం: రాష్ట్ర అవతరణ కోసం ప్రాణం త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు త్యాగం మరువలేనిదని ఎర్రగొండపాలెం టీడీపీ ఇంఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు అన్నారు. ఆదివారం తమ పార్టీ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాల సాధన దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు.
NDL: రోటరీ క్లబ్లో ఘనంగా పొట్టి శ్రీరాములు వర్ధంతిని నిర్వహించామని పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్లు కందుకూరి శ్రీరామమూర్తి, చిన్నపరెడ్డి తెలిపారు. క్లబ్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని వారికి ఘనంగా నివాళులు అర్పించారు. దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలకు ఊపిరి పోసింది పొట్టి శ్రీరాములేనని.. ఆయనే లేకపోతే మనకు రాష్ట్రం వచ్చేది కాదని రోటరీ సభ్యులు తెలిపారు.
అన్నమయ్య: అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆదివారం మదనపల్లె పట్టణంలో ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఇందులో భాగంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో స్థానిక కన్యకా పరమేశ్వరి ఆలయం మందు గల ఆయన విగ్రహానికి పూలమాలవేసి ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయన చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకున్నారు. అనంతరం స్థానిక చిత్తూరు బస్టాండు వద్ద పెద్ద ఎత్తున అన్నదానం చేశారు.
KDP: జమ్మలమడుగు మండలం గూడెం చెరువు రాజీవ్ నగర్ కాలనీలో ఆదివారం శ్రీ సీతారామాంజనేయ స్వామి వార్ల నూతన విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీని ఘనంగా సన్మానించారు.
BPT: ఆంధ్రరాష్ట్ర ఏర్పాటుకై కృషిచేసి, అమరణ నిరాహారదీక్ష చేపట్టి ప్రాణాలు అర్పించిన మహానుభావుడు అమరజీవి పొట్టి శ్రీరాములు అని చెరుకుపల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారి షేక్ మహబూబ్ సుభానీ అన్నారు. పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆదివారం చెరుకుపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అర్పించారు.
ప్రకాశం: రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ (డీఆర్యూసీసీ) విజయవాడ డివిజన్ సభ్యుడిగా ఒంగోలుకు చెందిన నాదెండ్ల సుధాకరరావు నియమితులయ్యారు. ఈ మేరకు MP మాగుంట శ్రీనివాసులరెడ్డి చేతులమీదుగా ఆయన నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంపీ సహకారంతో రైల్వే ప్రయాణికుల వసతుల మెరుగుకు కృషి చేస్తానని తెలిపారు.
SKLM: టెక్కలి పట్టణంలో ఉన్న వైసీపీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ ఆదివారం పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు ఈనెల 21వ తేదీన నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కార్యకర్తలు నాయకులు, అభిమానులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ATP: గుత్తి పట్టణంలోని కొండలో వెలసిన అతి పురాతనమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం గుత్తి టీడీపీ మండల ఇంఛార్జ్ గుమ్మనూరు నారాయణ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఇరుముడి కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజల అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
ATP: గుత్తి పట్టణంలోని కొండలో వెలసిన అతి పురాతనమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం గుత్తి టీడీపీ మండల ఇంఛార్జ్ గుమ్మనూరు నారాయణ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఇరుముడి కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజల అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
SKLM: ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి, ప్రాణాలర్పించి, అమరజీవి అయిన మహాపురుషుడు, పొట్టి శ్రీరాములు, ఆంధ్రులకు చిరస్మరణీయుడని జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్, ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతిని పురస్కరించుకొని నగరంలోని పాత బస్టాండ్ పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఆదివారం నివాళులర్పించారు.
అన్నమయ్య: మదనపల్లె పట్టణంలోని రచయితల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో మినీ కలం కవితల సంపుటి పుస్తక ఆవిష్కరణ జరిగింది. కావ్య రచయిత అయిన మంజు ప్రీతం మాట్లాడుతూ.. తెలుగు భాష, సమాజం, సమస్యలు, ప్రేమానురాగాల ఈ పుస్తకం రచించడం జరిగిందని తెలిపారు. ఇలాంటి యువ కవులు రచయితలు భాషా పటిష్ట నిర్మాణానికి ప్రసారాల్ని రచయితల సంఘం కితాబునిచ్చారు.