కోనసీమ: మంత్రి వాసంశెట్టి సుభాష్ శుక్రవారం పర్యటన వివరాలను మంత్రి సిబ్బంది వెల్లడించారు. ఉదయం 9 గంటలకు రామచంద్రపురం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నందు 6 పడకల డయాలసిస్ సెంటర్ భవన నిర్మాణ శంఖుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. 9.30 గంటలకు రామచంద్రపురం లెప్రసీ కాలనీలో 30 ఇళ్లకి మరమ్మతు పనుల పరిశీలన కార్యక్రమంలో పాల్గొంటారు.