మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలంలోని జాతీయ రహదారిపై గురువారం రాత్రి స్థానిక ఎస్సై సాంబశివయ్య వాహన తనిఖీలు చేపట్టారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించి వారి డ్రైవింగ్ లైసెన్సులు పరిశీలించారు. ఇటీవల మార్కాపురం మండలం రాయవరం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని బస్సు డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.