TPT: జిల్లాలోని ఏర్పేడు, వెంకటగిరి, నాయుడుపేట తదితర ప్రాంతాల వరి పంటను నెల్లూరు జిల్లాలోని మిల్లర్లకు తరలిస్తున్నారు. ప్రభుత్వం వరిని కొనుగోలు చేస్తామని ప్రకటించినప్పటికీ, అది క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. రైతులు తీసుకువెళ్లే ధాన్యంలో తేమ ఉందని కారణాలు చెబుతూ మిల్లర్లు వెనక్కి పంపుతున్నారు. దీంతో దిక్కుతోచని రైతులు రూ. 2,000 కంటే తక్కువ ధరకే తమ పంటను దళారులకు విక్రయిస్తున్నారు.