ATP: జిల్లాలో మార్చి నెలకు సంబంధించి పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం సిద్ధమైంది. జిల్లాలోని 2,76,547 మంది కోసం రూ.124 కోట్లు విడుదల చేసింది. ఏప్రిల్ 1వ తేదీ ఉదయం 7 గంటల నుంచి స్వచ్ఛంద సేవకులు, వార్డు సిబ్బంది నేరుగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వచ్చి పింఛన్ సొమ్ము అందజేస్తారని అధికారులు తెలిపారు. పింఛన్ కోసం ఎవరూ సచివాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు.