KDP: టెన్త్ పరీక్షల నేపథ్యంలో ఖాజీపేటలోని అన్ని జిరాక్స్ సెంటర్ల యజమానులకు ఆదివారం పోలీస్ స్టేషన్లో SI వంశీధర్ సమావేశం నిర్వహించారు. పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు లేదా ఎలాంటి పరీక్షా మెటీరియల్ జిరాక్స్ తీయకూడదని స్పష్టం చేశారు. పరీక్షల సమయంలో జిరాక్స్ సెంటర్ యజమానులు నిబంధనలు పాటించాలన్నారు. నియమాలను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు.
విజయనగరం జిల్లా PRTU 5వ జిల్లా కార్యనిర్వహక వర్గ సమావేశం గజపతినగరంలో ఆదివారం నిర్వహించారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసుల నాయుడు పాల్గొని ఉపాధ్యాయ సమస్యలను ప్రభుత్వం తీర్చాలన్నారు. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకపోతే నిరసన చేపడతామన్నారు.
W.G: భీమవరం కొలువైన శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి స్వర్ణ వస్త్ర నిధికి పట్టణానికి చెందిన సరిపల్లి రామరాజు దంపతులు 8 గ్రాముల బంగారం ఆదివారం విరాళంగా అందజేశారు. ఆలయ ఉపప్రధాన అర్చకులు కొప్పేశ్వరరావు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారికి ఆలయ ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్ నాగభూషణం శేష వస్త్రం, అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు.
NTR: రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు సోమవారం జరగనుంది. ఈ మేరకు విజయవాడ ఏ ప్లస్ కన్వెన్షన్ హాల్ను సెంట్రల్ ఏసీపీ దామోదర్ పరిశీలించారు. ఇఫ్తార్ విందుకు 600 మందికి వీఐపీ పాసులు జారీ చేసినట్లు తెలిపారు. ముఖ్య అతిథులుగా సీఎం చంద్రబాబు మంత్రులు రానున్నట్లు చెప్పారు. ఈ మేరకు 250 మందితో ప్రతిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
కృష్ణా: పెనమలూరు పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. చెడు నడత కలిగిన రౌడీ షీట్ హోల్డర్లు, డీసీలు, కేడీలు ఇతర సస్పెక్ట్ పీట్ హోల్డర్లను గుర్తించి పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ నిర్వహించారు. సమాజంలో సత్ప్రవర్తనతో జీవించాలని సూచిస్తూ, భవిష్యత్తులో నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని SI రమేష్ హెచ్చరించారు.
ATP: గుత్తిలోని ఫుట్బాల్ క్రీడా మైదానంలో జరుగుతున్న గుత్తి కోట ఉత్సవాల సందర్భంగా గుత్తికోట సంరక్షణ సమితి, రాయలసీమ నాణెముల సేకరణ సంఘం వారి ఆధ్వర్యంలో ఆదివారం పురాతన నాణెముల ప్రదర్శన స్టాళ్లను ప్రారంభించారు. గుత్తి కోటను పరిపాలించిన రాజుల కాలం నాటి నాణేలను ఈ ప్రదర్శనలో ఉంచామన్నారు. పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.
NLR: కలిగిరి మండలం పెదపాడు సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురుగా వస్తున్న బైకును టాటా మ్యాజిక్ వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళుతున్న రత్నరాజు(40) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు ప్రకాశం జిల్లా విలపర్ల వాసిగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలను సేకరిస్తున్నారు.
AKP: కోటవురట్ల మండలంలో ఇందేశమ్మ ఘాట్ రోడ్డును హోంమంత్రి వంగలపూడి అనిత ఆదివారం పరిశీలించారు. రహదారి విస్తరణలో భాగంగా ఘాట్ రోడ్డును తొలగించి పనులు చేపట్టేందుకు ప్రభుత్వం రూ. 16 కోట్లు నిధులు మంజూరు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. ఇక్కడ రహదారి విస్తరణ జరిగితే నర్సీపట్నం రేవు పోలవరం రోడ్డులో రహదారి సౌకర్యం మెరుగవుతుందన్నారు.
కోనసీమ: మామిడికుదురు మండలంలోని అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామివారి ఆలయంలో అమలు చేస్తున్న నిత్య అన్న ప్రసాదం ట్రస్టుకు కాకినాడకు చెందిన చింతపల్లి మాధవరాజు, శ్రీలక్ష్మి దంపతులు రూ. 1,00,008 విరాళంగా అందించారు. విరాళాన్ని ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త మొల్లేటి చక్రపాణికి ఆదివారం అందజేశారు. అనంతరం దాతల కుటుంబానికి స్వామివారి చిత్రపటం, ప్రసాదాలు అందించారు.
సత్యసాయి: పుట్టపర్తి కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదివారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మంజూరైన 4,923 వ్యక్తిగత మరుగుదొడ్లలో 3,725 పనులు పూర్తయ్యాయని, మిగిలినవాటిని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. వేసవి తాగునీటి ఎద్దడి నివారణకు రూ.299.37 లక్షలతో ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు.
SKLM: ప్రభుత్వం ఆదేశాల మేరకు శ్రీకాకుళం మున్సిపాలిటీలోని అరసవల్లి మున్సిపల్ హై స్కూల్లో అభ్యాసకులకు అక్షరాస్యత పరీక్షను అధికారులు ఆదివారం నిర్వహించారు. ఈ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ సందర్శించారు. పరీక్ష నిర్వహణ తీరును అధికారులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో శత శాతం అక్షరాస్యత లక్ష్యం అని అన్నారు.
KDP: పులివెందుల చరిత్రలో YS వివేకా హత్య దారుణ ఘటన అని TDP నియోజకవర్గ ఇంఛార్జ్ బీటెక్ రవి పేర్కొన్నారు. ఆదివారం ఆయన పులివెందులలో మాట్లాడుతూ.. ఆర్థికంగా డబ్బులు ఉండి వ్యవస్థలను మేనేజ్ చేసి తాత్కాలికంగా శిక్ష నుంచి తప్పించుకోవచ్చు కానీ, ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్నవారు ఎప్పటికి తప్పించుకోలేరన్నారు. నేరస్తులు కర్మ సిద్ధాంతం ప్రకారం వారికి తప్పకుండా శిక్ష పడుతుందని తెలిపారు.
SKLM: టెక్కలి బీజేపీ కార్యాలయంలో టెక్కలి పట్టణానికి చెందిన పలువురు యువకులు బీజేపీ పార్టీలో చేరారు. ఆదివారం బీజేపీ మండల అధ్యక్షుడు జర్జాన రాంజీ వారికి పార్టీ కండువా వేసి స్వాగతం పలికారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి దిశగా సాగుతుండటంతో యువత బీజేపీ వైపు ఆకర్షితులవుతున్నారని ఆయన తెలిపారు.
ప్రకాశం: త్రిపురాంతకం(మం) కేశినేనిపల్లి వద్ద అనంతపురం-అమరావతి జాతీయ రహదారిపై లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీలో ఉన్నవారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అతివేగమే ప్రమాదానికి ప్రధాన కారణమని స్థానికులు చెబుతున్నారు. కేశినేనిపల్లి వద్ద తరచూ జరుగుతున్న ప్రమాదాలపై వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
CTR: జిల్లాలో గ్యాస్ సిలిండర్ల సరఫరా సాధారణంగా కొనసాగుతున్నందున ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా జాయింట్ కలెక్టర్ ఏ. రాజేంద్రన్ తెలిపారు. గ్యాస్ సరఫరాపై సందేహాలు ఉంటే కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్ 08572-242734కు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంప్రదించవచ్చని చెప్పారు.