VZM: గజపతినగరం పంచాయతీ కార్యాలయంలో ఆదివారం అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమరజీవి శ్రీరాములు చిత్రపటానికి సర్పంచ్ నరవ కొండమ్మ, పంచాయతీ కార్యనిర్వహణ అధికారి జి జనార్దనరావులు పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావానికి ప్రాణత్యాగం చేశారని కొనియాడారు.
E.G: తణుకు స్థానిక మహిళా కళాశాలలో డిసెంబర్ 15 న జరిగిన ఇంటర్ స్టేట్ కరాటే పోటీల్లో రాజమండ్రి రూరల్ కడియం విద్యార్థులు పొల్గొని ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు సాధించారు. సాయి సాన్విత, కార్తీక్, కనక సాగరిక ప్రథమ స్థానం సాధించారు. స్థానిక పెద్దలు పిల్లలను కోచ్ జానకి రాముడుని అభినందించారు.
E.G: కొవ్వూరు మండలం వాడపల్లి-బంగారమ్మపేట దగ్గర ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో అటుగా వెళుతున్న ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు వెంటనే స్పందించారు. ఘటనలో గాయాల పాలైన బాధితులను హుటాహుటిన కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి 108లో తరలించి హాస్పటల్ సూపరింటెంట్కి ఫోన్ చేసి మెరుగైన అత్యవసర చికిత్స అందించమని ఆదేశించారు.
కృష్ణా: విజయవాడలోని కలెక్టరేట్లో ఈనెల 16న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ ఆదివారం తెలిపారు. జిల్లాలోని ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం మీకోసం కార్యక్రమంలో అర్జీని అందజేసినట్లయితే గడువు లోగా పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు.
NLR: రోజు రోజుకు పెరుగుతున్న చలి తీవ్రత, వర్షాల వల్ల నిమ్మకాయల వినియోగం తగ్గి రైతులకు గిట్టుబాటు ధర కూడా దక్కడం లేదు. వాతావరణంలో జరుగుతున్న మార్పుల కారణంగా మూడు రోజుల నుంచి ధర తగ్గుముఖం పట్టింది. కిలోల లెక్కన రూ.15 నుంచి రూ.20 మాత్రమే ధర పలుకుతోంది. సంక్రాంతి వరకు ఇవే ధరలు ఉండవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ELR: జీలుగుమిల్లి మండల కేంద్రంలో పొట్టి శ్రీరాములు విగ్రహనికి ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈరోజు మనం ఆంధ్రులమని చెప్పుకుంటున్నాం అంటే దానికి పొట్టి శ్రీరాములు బలిధనమే అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
VSP: ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు అని జిల్లా రెవెన్యూ అధికారి భవాని శంకర్ అన్నారు. ఆదివారం కలెక్టరేట్లో పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగఫలం వల్లే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందన్నారు.
ప్రకాశం: దర్శి పట్టణ శివాజీ నగర్లోని క్రీస్తు మార్గం మినిస్ట్రీస్ చర్చిలో సెమీ క్రిస్మస్ వేడుకలను దర్శి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ కైపు వెంకట కృష్ణా రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్ పౌల్ వెంకటేశ్వర్లు, బ్రదర్ నరేంద్ర, పాస్టర్ రాజు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
ELR: అమరజీవి పొట్టి శ్రీరాములు జీవితం, వారు చేసిన పోరాటాలు భావితరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని కలెక్టర్ వెట్రిసెల్వి అన్నారు. ఏలూరు కలెక్టరేట్లోని గౌతమి సమావేశ మందిరంలో ఆదివారం పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతి నిర్వహించారు. పొట్టి శ్రీరాములు వంటి మహనీయుని త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
KDP: జమ్మలమడుగు మండలం దేవగుడి గ్రామంలోని తన నివాసంలో ఎమ్మెల్యే సి. ఆదినారాయణ రెడ్డి నియోజకవర్గంలోని నిరుపేద కుటుంబాల వారు రకరకాల అనారోగ్య కారణాలతో ఆస్పత్రుల్లోని అధిక ఖర్చు అయినా బాధితులకు ముఖ్య మంత్రి సహాయనిధి (CMRF) నుంచి మంజూరైన సుమారు 12 లక్షల రూపాయల 13 చెక్కులను లబ్ధిదారులకు ఆదివారం అందించారు.
NLR: అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా నెల్లూరులోని మాజీ మంత్రి కాకాణి ఆయన చిత్ర పటానికి నివాళులు అర్పించారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం చేసిన సేవలు అజరామరామం అని కొనియాడారు. ఆయన చేసిన త్యాగాలు చరిత్ర పుటల్లో నిలిచిపోతాయన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.
నంద్యాలలోని ఎస్సార్బీసీ కాలనీ పక్కన ఉన్న ఎస్పీవై రెడ్డి స్మార్ట్ సిటీని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండీ ఫిరోజ్ ఆదివారం సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. గత పాలకులు ఎస్పీవై రెడ్డి స్మార్ట్ సిటీని విస్మరించారని, ప్రజలు ఇక్కడ ఎదుర్కొంటున్న కరెంటు, రేషన్, వీధిలైట్ల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారని అన్నారు.
KRNL: కర్నూలులోని తుంగభద్ర నదీ తీర ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా పరిశీలించారు. నదీతీర ప్రాంతాల పరిశుభ్రత, సుందరీకరణపై మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబుకు సూచనలు ఇచ్చారు. అనంతరం హరహరి క్షేత్రంలోని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని, శ్రీ కాశీవిశ్వేశ్వర స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
VZM: గజపతినగరంలో భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) మండల మహాసభలు ఆదివారం ఘనంగా జరిగాయి. జిల్లా సహాయ కార్యదర్శి శిరీష పతాకాన్ని ఆవిష్కరించారు. ముఖ్య వక్తలు జగదీష్ రవికుమార్లు మాట్లాడుతూ.. విద్యారంగ సమస్యల పరిష్కారానికి అలుపెరగని పోరాటం చేసిందన్నారు. గత ప్రభుత్వం విద్యారంగాన్ని నాశనం చేయగా కూటమి ప్రభుత్వానికి అధికారం అప్పగించడం జరిగిందన్నారు.
VZM: పొట్టి శ్రీరాములు చిర స్మరనీయులని, వారి త్యాగ నిరతిని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. కలెక్టరేట్లో ఆదివారం అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినంను ఘనంగా నిర్వహించారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్ అంబేద్కర్, ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు తదితరులు ఆయన చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు.