• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

విపత్తును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి: ఎమ్మెల్యే

WG: తుపాన్ విపత్తును ఎదుర్కొనేందుకు అధికారులంతా సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కోరారు. ఇవాళ సాయంత్రం తాడేపల్లిగూడెం క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. రెండు రోజులుగా కురిసిన వర్షాలకు చేలల్లో నీటిని బయటకు పంపేలా రైతులను అప్రమత్తం చేయాలన్నారు. శిథిల భవనాల్లో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు.

October 25, 2025 / 07:34 PM IST

‘అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలి’

VSP: నవంబర్‌లో విశాఖ వేదికగా జరిగే అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సు కోసం నగర అభివృద్ధి, సుందరీకరణ పనులను జోన్లలో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ శనివారం పరిశీలించారు. ఫ్లైఓవర్స్, రోడ్డు డివైడర్స్, ఫుట్ పాతులు, లైటింగ్, పెయింటింగ్, సెంటర్ మీడియన్ మొక్కల ట్రిమ్మింగ్ వంటివి నాణ్యతతో పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

October 25, 2025 / 07:31 PM IST

విద్యార్థులకు అవగాహన కల్పించాలి: MLC DC

KDP: పోరుమామిళ్ల పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని శనివారం ఎమ్మెల్సీ DC గోవిందరెడ్డి సందర్శించారు. 4 రోజుల క్రితం కాకినాడ జిల్లా తునిలో ఒక బాలికపై జరిగిన అత్యాచార యత్నం ఘటనకు సంబంధించి సాంకేతిక భద్రతా పరిస్థితులను పరిశీలించామన్నారు. విద్యార్థులకు, సిబ్బందికి ఇలాంటి ఘటనలపై అప్రమత్తంగా ఉండాలని సలహాలు సూచనలు అందించారు.

October 25, 2025 / 07:30 PM IST

విశాఖ నుంచి పంచారామాలు యాత్ర ప్రారంభం

VSP: ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ మేనేజర్ బీ. అప్పలనాయుడు, ద్వారకా బస్ స్టేషన్ నుంచి పంచారామాలు యాత్రను శనివారం RTC కాంప్లెక్స్ వద్ద ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజనీర్ గంగాధర్, డిపో మేనేజర్ మాధురి, సిబ్బంది పాల్గొన్నారు. యాత్రకు వెళ్లేవారు రిజర్వేషన్లు ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చు తెలిపారు. వివరాలకు 9959225602, 9959225594 నెంబర్లను సంప్రదించాలన్నారు.

October 25, 2025 / 07:28 PM IST

విశాఖ నుంచి పంచారామాల యాత్ర ప్రారంభం

VSP: ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ మేనేజర్ బీ. అప్పలనాయుడు, ద్వారకా బస్ స్టేషన్ నుంచి పంచారామాలు యాత్రను శనివారం RTC కాంప్లెక్స్ వద్ద ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజనీర్ గంగాధర్, డిపో మేనేజర్ మాధురి, సిబ్బంది పాల్గొన్నారు. యాత్రకు వెళ్లేవారు రిజర్వేషన్లు ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చు తెలిపారు. వివరాలకు 9959225602, 9959225594 నెంబర్లను సంప్రదించాలన్నారు.

October 25, 2025 / 07:28 PM IST

ఆలూరులో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం

KRNL: ఆలూరు మండలం మొలగవెల్లిలో కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమాన్ని MLA బుసినే విరుపాక్షి నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జగన్ 17 కాలేజీలను తీసుకునివస్తే.. కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరణ చేసేందుకు కుట్ర చేస్తుందని మండిపడ్డారు. మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తే పేద విద్యార్థులకు వైద్యవిద్య దూరమవుతుందని ఆరోపించారు.

October 25, 2025 / 07:27 PM IST

హౌసింగ్ అధికారులతో ఎమ్మెల్సీ సోము వీర్రాజు సమావేశం

E.G: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన PMAY–గ్రామీణ 2.0 పథకం అమలు చర్యలపై MLC సోము వీర్రాజు రాజమండ్రిలో హౌసింగ్ అధికారులతో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పట్టణ పేదలకు గృహాలను నిర్మించాలన్న సంకల్పంతో పీఎం నరేంద్ర మోదీ సారధ్యంలోని కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రజల అభ్యున్నతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు.

October 25, 2025 / 07:26 PM IST

సంజామలలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే

NDL: సంజామల మండలం పేరుసోమల గ్రామంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి శనివారం పర్యటించారు. పేరుసోమల గ్రామంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ప్రారంభించారు.

October 25, 2025 / 07:25 PM IST

‘AMP-RJY మధ్య నాన్ అల్ట్రా డీలక్స్ బస్సు సర్వీసులు’

కోనసీమ: అమలాపురం నుంచి రాజమండ్రికి వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, AMP – RJY నాన్ అల్ట్రా డీలక్స్ బస్సు సర్వీసులను అక్టోబర్ 27, సోమవారం నుంచి ప్రారంభిస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణాధికారి రాఘవ కుమార్ తెలిపారు. ఈ బస్సులు వయా నడిపూడి, ముక్కామల మీదుగా ఉదయం 5.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు ప్రతి 2 గంటలకు అందుబాటులో ఉంటాయన్నారు.

October 25, 2025 / 07:24 PM IST

తపాలా శాఖ కార్యాలయంలో ఇండస్ట్రియల్ విజిట్

ASR: కంపెనీలు, ఆర్థిక రంగ సంస్థలు ఎలా పనిచేస్తాయన్న అంశాలపై అవగాహన ఉండాలని కొయ్యూరు తపాలా అధికారి శ్యామ్ విద్యార్థులకు సూచించారు. ఇండస్ట్రియల్ విజిట్‌లో భాగంగా, శనివారం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు తపాలా శాఖ విధుల గురించి వివరించారు. తపాలా కార్యాలయంలో జరుగుతున్న బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఇన్సూరెన్సు అంశాలపై అవగాహన కల్పించారు.

October 25, 2025 / 07:21 PM IST

200 మంది ఆటో డ్రైవర్లకు పోలీసుల అవగాహన

అనంతపురం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రాయదుర్గంలో రహదారి భద్రత, ప్రమాద నివారణపై పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సుమారు 200 ఆటో డ్రైవర్లు, స్థానికులు పాల్గొన్నారు. ట్రాఫిక్ నియమాలు, హెల్మెట్/సీట్ బెల్ట్ వినియోగం, మద్యం సేవించి డ్రైవ్ చేయకపోవడం, తప్పు పార్కింగ్ నివారణపై అవగాహన కల్పించారు.

October 25, 2025 / 07:20 PM IST

‘మహిళా సంఘాలు పంచ సూత్రాలు పాటిస్తే అభివృద్ధి తథ్యం’

SKLM: స్వయం శక్తి సంఘంలో మహిళలు సంపూర్ణ ఆర్థిక అభివృద్ధి సాధించడమే తమ లక్ష్యం అని మందస మండల ఐటీడీఏ వెలుగు అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ పైడి కూర్మారావు అన్నారు. శనివారం మందస మండలం బైరి సారంగిపురం పంచాయతీలో వివిధ మహిళా సంఘాలలో సభ్యులు ఆర్థిక అభివృద్ధి కోసం చేస్తున్న వివిధ వ్యాపారాలను పరిశీలించామని అన్నారు. పంచ సూత్రాలు పాటిస్తే అభివృద్ధి సాధ్యం అన్నారు.

October 25, 2025 / 07:18 PM IST

జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన విశాఖ వాసి

VSP: విశాఖలోని డాక్టర్‌ బీ.ఆర్‌.అంబేడ్కర్‌ గురుకుల కళాశాలలో ఇంటర్మీడియట్‌ చదువుతున్న చింతకాయల అభి క్రీడా ప్రతిభతో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈ నెల 22, 23 తేదీలలో ఏలూరు జిల్లా పెదవేగిలో జరిగిన రాష్ట్ర స్థాయి స్కూల్‌ గేమ్స్‌ అథ్లెటిక్‌ పోటీలలో ఆయన ఈ ఘనత సాధించాడు. అభిని శనివారం ప్రిన్సిపాల్‌ రత్నవల్లి అభినందించారు.

October 25, 2025 / 07:18 PM IST

విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన JC

KDP: మొంథా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ఈ నెల 27, 28 తేదీలలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు కడప JC అదితి సింగ్ శనివారం తెలిపారు. తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఆదివారం కూడా సెలవు కావడంతో వరుసగా 3 రోజులు సెలవులు వచ్చాయి.

October 25, 2025 / 07:15 PM IST

విద్యార్థులకు విద్యతోపాటు ఆత్మస్థైర్యం అవసరం: ఏఎస్పీ

ELR: విద్యార్థులకు విద్యాబుద్ధులతోపాటు ఆత్మస్థైర్యం, పోరాట ప్రతిమ అవసరమని ఏఎస్పీ నక్కా సూర్యచంద్రరావు అన్నారు. జిల్లాలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఏఎస్పీ శక్తి యా`పై అవగాహన కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించారు. విద్యార్థులు ప్రతి అంశంలోనూ ధైర్యంతో వ్యవహరించాలన్నారు. శక్తి యాప్‌ను వినియోగించడం ద్వారా ఆపదలో ఉన్నప్పుడు క్షణాల్లో పోలీసుల నుంచి సహాయం అందుతుందన్నారు.

October 25, 2025 / 07:14 PM IST