KRNL: ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం వేరుసెనగ క్వింటా గరిష్ఠ ధర రూ.8,700, మధ్యస్థ ధర రూ.6,900, కనిష్ఠ ధర రూ.3,360కు వ్యాపారులు కొన్నారు. మార్కెట్కు 310 మంది రైతులు 9,937 వేరుసెనగ బస్తాలు అమ్మకానికి తెచ్చినట్లు అధికారులు తెలిపారు. ఆముదాలు గరిష్ఠ ధర రూ.5,600, మధ్యస్థ ధర రూ.5,600, కనిష్ఠ ధర రూ. 5,033 పలికినట్లు పేర్కొన్నారు.