సత్యసాయి: కదిరి శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా మూడు రోజుల పాటు అదనపు బస్సులు నడపడంతో ఆర్టీసీకి రూ.89 లక్షల ఆదాయం సమకూరింది. డిపోలోని 105 బస్సులతో పాటు భక్తుల రద్దీని బట్టి ప్రత్యేక సర్వీసులు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులకు రవాణా సౌకర్యం కల్పించడమే కాకుండా, సంస్థకు భారీగా లాభాలు చేకూరాయి.