ప్రకాశం: మార్కాపురం పట్టణానికి చెందిన LAW విద్యార్థి ఎనిబేర బాబీ పై దాడి చేసిన వ్యక్తులను అరెస్టు చేయాలని MRPS ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నేలపాటి రాజు మాదిగ డిమాండ్ చేశారు. శుక్రవారం మార్కాపురం డీఎస్పీ, రూరల్ ఎస్సైను కలిసి ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చొరవ చూపాలన్నారు. కార్యక్రమంలో పందిటి కాశిరావు, వినయ్, దేవ ప్రభాకర్ పాల్గొన్నారు.
కృష్ణా జిల్లాలో అధికారుల నిర్లక్ష్యంపై జిల్లా కలెక్టర్ బాలాజీ చర్యలు తీసుకున్నారు. పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యం ప్రదర్శించిన డోకిపర్రు గ్రామ పంచాయతీ కార్యదర్శి (గ్రేడ్-2) రజియా సుల్తానాను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే జనాభా లెక్కల శిక్షణకు హాజరు కాకపోవడంతో వడ్లమన్నాడు సచివాలయ డీఏ కే.సురేంద్రకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.
అన్నమయ్య: మైనార్టీ బాలికల గురుకుల జూనియర్ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి జూనియర్ ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ పద్మ తెలిపారు. ఈ నెల 31లోపు దరఖాస్తు చేసుకోవాలని, ఏప్రిల్ 24న జిల్లా కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారని చెప్పారు. ఉర్దూ, ఇంగ్లీష్ మీడియంలలో MPC-40, BiPC-40, CEC-35 సీట్లు ఉన్నాయని తెలిపారు.
W.G: పాలకొల్లు కళాపరిషత్ ఆధ్వర్యంలో 17వ జాతీయ స్థాయి నాటికల పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరగనున్న ఈ పోటీల్లో తెలుగు రాష్ట్రాల కళాకారులు ప్రతిభను ప్రదర్శించనున్నారని అధ్యక్షుడు కేవీ కృష్ణ వర్మ తెలిపారు. తొలిరోజు ‘మంచి మనసులు’, ‘దేవుణ్ణి చూశా’ నాటికలు అలరించాయి. 15న ముగింపు సభ, బహుమతుల ప్రధానోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు.
SKLM: రణస్థలం ఎమ్మార్వో కార్యాలయం నుంచి వేణు గోపాలపురం వరకు బీటీ తారు రోడ్డు నిర్మాణ పనులు రూ.1.50 కోట్లతో ప్రారంభమయ్యాయి. శుక్రవారం సాయంత్రం ఈ పనులను ఎమ్మెల్యే ఈశ్వరరావు పరిశీలించారు. పనులు నాణ్యతతో చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు.
VSP: భీమిలి పరిధి కాపుల ఉప్పాడలో ఉంటున్న అప్పలరాజు కుటుంబ తగాదాల నేపథ్యంలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడడంతో గీతం ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఇక్కడి నుంచి కేజీహెచ్కి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
NTR: ఏపీ కేబినెట్ సమావేశంలో పనిచేసే మహిళలకు శుభవార్త ప్రకటించారు. మిషన్ శక్తి కింద వర్కింగ్ ఉమెన్స్ కోసం ‘సఖీ నివాస్’ పేరుతో హాస్టళ్ల ఏర్పాటు ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే అమరావతిలో భూకేటాయింపులు, సూక్ష్మ పరిశ్రమలకు ఆర్థిక ప్రోత్సాహం, సీఆర్డీఏ నిర్ణయాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ATP: తాడిపత్రి సమీపంలోని వజ్రగిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా జూటూరు నుంచి దేవాలయం వరకు రూ.2.50 కోట్లతో తార్ రోడ్డు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాడిపత్రిని ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చాలనే లక్ష్యంతో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సూచనల మేరకు ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఈ పనులపై ప్రత్యేక చొరవ తీసుకున్నారు.
KDP: జాయింట్ కలెక్టర్, జిల్లా సప్లై ఆఫీసర్, బద్వేల్ ఆర్డీఓ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు బద్వేల్, గోపవరం మండలాల్లోని పలు హోటళ్లలో తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తున్న 21 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో సి.ఎస్.డి.టి శివశంకర్, ఎస్ఐ గీత ప్రసాద్ రెడ్డి, వీఆర్ఓ అయ్యావారయ్య, వీఆర్ఏ నాగభూషణం పాల్గొన్నారు.
విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద ఈనెల 16న జీడి మామిడి రైతులతో నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు జిల్లా రైతు సంఘం అధ్యక్షులు బీ రాంబాబు తెలిపారు. శనివారం గజపతినగరంలో ఆయన మాట్లాడుతూ.. ఉచిత పంటల బీమా ప్రభుత్వమే అమలు చేయాలని, 2024 -25 బీమా పరిహారం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు నిరసన గోడ పత్రికను విడుదల చేశారు.
BPT: సంతమాగులూరు మండలంలోని సంఘం గ్రామంలో అద్దంకి–సంతమాగులూరు సర్కిల్ పోలీసులు కాంబింగ్ సెర్చ్ నిర్వహించారు. గ్రామంలో అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు, పత్రాలు పరిశీలిస్తూ పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తుల గురించి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు.
అన్నమయ్య: లక్కిరెడ్డిపల్లిలో ఇన్నోవా కార్ టైరు పగిలి అదుపు తప్పి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికులు వెంటనే రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, మెరుగైన చికిత్స కోసం కడపకు రిఫర్ చేశారు. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో సురక్షితంగా బయటపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు.
E.G: తాళ్లపూడి మండలం ప్రక్కిలంక గ్రామంలో శనివారం నిర్వహించిన ‘అన్నదాత సుఖీభవ-PM కిసాన్’ పంపిణీలో కలెక్టర్ కీర్తి చేకూరి, MLA ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. మూడో విడత కింద 14,884 మంది రైతులకు రూ.8.39 కోట్లు జమ చేస్తున్నట్లు వారు ప్రకటించారు. ఏటా రూ.20,000 పెట్టుబడి సాయం అందించి అన్నదాతలను ఆదుకోవడమే లక్ష్యమని వెల్లడించారు.
NDL: మహానంది పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆలయ పరిసరాల్లో చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఈవో శ్రీనివాసరెడ్డి తెలిపారు. వేసవిలో ఎండల తీవ్రత దృష్ట్యా భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నడిచే మార్గాల్లో గ్రీన్ మ్యాట్లు, చల్లటి తాగునీటి సౌకర్యం కల్పిస్తామని, దీనికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ కూడా నిర్వహిస్తున్నట్లు వివరించారు.
TPT: తిరుమలలో ఇవాళ భక్తుల రద్దీ బాగా పెరిగింది. టోకెన్ లేని భక్తులకు దర్శనానికి సుమారు 20 గంటల సమయం పడుతోంది. నారాయణగిరి షెడ్లలో భక్తులు వేచి ఉన్నారు. శుక్రవారం 67,264 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. 29,410 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.28 కోట్లుగా నమోదైందని టీటీడీ వెల్లడించింది.