NDL: శ్రీశైలం క్షేత్రం ఉగాది ఉత్సవాలకు సిద్ధమైంది. ఈ వేడుకల కోసం కర్ణాటక నుంచి కన్నడ భక్తులు భారీగా తరలివస్తున్నారు. క్షేత్రమంతా భజనలు, నృత్యాలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. సోమవారం నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, పాదయాత్రగా వస్తున్న భక్తుల శివనామస్మరణతో నల్లమల కొండలు మారుమోగుతున్నాయి. భక్తుల రాకతో శ్రీగిరి పరిసరాలు కిక్కిరిసిపోయాయి.
PPM: జిల్లాలో నిర్వహించిన ఇంటర్ మొదటి సంవత్సరం సివిక్స్ పరీక్షకు 164మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు విద్యాధికారి నాగేశ్వరరావు తెలిపారు. జనరల్ 1624 మందికి గాను 163 హాజరు కాలేదన్నారు. జనరల్ బ్రిడ్జ్ విభాగంలో 1 విద్యార్థికి అతను హాజరు కాలేదు అని ఆయన వెల్లడించారు. పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని, నిబంధనల ప్రకారం పకడ్బందీ చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.
KRNL: దేవనకొండలోని ZPHS పాఠశాలలో గుర్తుతెలియని దుండగులు బరితెగించారు. పదో తరగతి పరీక్షల కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పగలగొట్టి వాటి కేబుళ్లను దొంగిలించినట్లు శనివారం హెచ్ఎం నజీర్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.
ASR: డుంబ్రిగూడ మండలం అరకు గ్రామంలోని కొండవీదిలో అసంపూర్తిగా ఉన్న అంగన్వాడీ భవన నిర్మాణంను పూర్తి చేయాలని కాంగ్రెస్ మాజీ ఎంపీపీ చట్టారి సాయిబాబా, చిన్నస్వామి ఇవాళ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భవనం లేక చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తాత్కాలిక ప్రదేశాల్లో కార్యకలాపాలు నిర్వహించాల్సి వస్తోందని, తక్షణమే అధికారులు స్పందించాలని కోరారు.
ALR: జిల్లా పోలవరం మండలంలో ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. 2024లో జరిగిన ఈ ఘోర ఘటనపై విచారణ చేపట్టిన ఏలూరు పోక్సో కోర్టు జడ్జి మల్లికార్జునరావు నిందితుడు తమ్మన బోయిన రామకృష్ణను దోషిగా తేల్చారు. నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ. 5 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.
NLR: ఎండనక, వాననక తమ రక్తాన్ని చెమటగా మార్చి రైతన్నలు పంటలు పండిస్తారు. మార్కెట్లో పంట అమ్ముకునే సమయంలో కొంతమంది దళారుల మాయ మాటలు నమ్మి మోసపోతారు. నగదు త్వరగా చెల్లిస్తామని నమ్మబలికి పంటలను కొనుగోలు చేసే దళారులు రైతులను నట్టేట ముంచిన ఘటనలు చాలా జరిగాయి. ఇప్పటికైనా నెల్లూరు జిల్లా రైతులు దళారులను నమ్మి మోసపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు తెలిపారు.
అన్నమయ్య: అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా కోడూరు మండలం ఎస్ ఉప్పరపల్లిలో బొప్పాయి పంటల తోటను కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ పరిశీలించారు. రైతులతో ప్రత్యక్షంగా సమస్యలను అడిగి తెలుసుకున్నారు .రైతులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యంత్రాంగం సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
NTR: ఏపీ మైన్స్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన చంద్ర శేఖర్ను మంత్రి కొల్లు రవీంద్ర విజయవాడలో ఇవళ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చంద్ర శేఖర్కు మంత్రి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెరిగేలా చంద్రశేఖర్ సమర్థవంతంగా విధులు నిర్వహించాలని సూచించారు.
తిరుపతిలో గ్యాస్ సంక్షోభానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసనకు దిగాయి. కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ ఆధ్వర్యంలో గ్యాస్ సిలిండర్లను నెత్తిన పెట్టుకుని వినూత్నంగా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్యాస్ సంక్షోభాన్ని నివారించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ధ్వజమెత్తారు.
SKLM: ఆమదాలవలస పట్టణంలోని లక్ష్మీ నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 60 మందికి పైగా టెన్త్ క్లాస్ విద్యార్థులకు పరీక్ష కిట్లను జనసేన ఆమదాలవలస నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీ.రామ్మోహన్ రావు శనివారం విద్యార్థులకు అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు పరీక్ష సమయంలో ఆందోళన చెందకుండా పరీక్షలు ప్రశాంతంగా రాయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, నాయకులు పాల్గొన్నారు.
సత్యసాయి: మడకశిరలోని పలు వార్డుల్లో మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు శనివారం సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని మున్సిపల్ శాఖ అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు. సీసీ రోడ్లు నిర్మాణం, తాగునీటి సరఫరా మెరుగుదల, వీధి దీపాల ఏర్పాటును త్వరగా పూర్తి చేయాలని సూచించారు.
CTR: ఇరుపక్షాలు రాజీ పడే క్రమంలో సత్వర న్యాయం పొందడానికి లోక్ అదాలత్ తోడ్పడుతుందని సీనియర్ సివిల్ జడ్జ్ ఆరిఫా షేక్ అన్నారు. పుంగనూరు పట్టణంలోని న్యాయస్థానాల ప్రాంగణంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. రాజీకి ముందుకు వచ్చిన కక్షిదారులను విచారించి వారి ఇరువురి సమ్మతం మేరకు న్యాయమూర్తులు రాజీ చేశారు.
ప్రకాశం: పెద్దారవీడు మండలం గొబ్బూరు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు కూటమి నాయకులు ఎగ్జామ్ పాడ్స్ అందజేశారు. పరీక్ష ఫలితాల్లో అందరూ ఉత్తీర్ణులు అవ్వాలన్నారు. 570 మార్కులు సాధించిన విద్యార్థులకు లాప్టాప్ బహుమతిగా ఇస్తామని దూదేకుల కాసిం, నల్లపాటి ఈశ్వర్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
KRNL: బేతంచెర్ల మండలం బలపాలపల్లె గ్రామంలోని ఎస్సీ కాలనీలో డైనేజీ కాలువలు శుభ్రం చేయకపోవడంతో మురికినీరు రోడ్లపై ప్రవహిస్తోంది. దీంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలువల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం, మురికి నీటితో దుర్వాసన, దోమల బెడద పెరిగి రోగాలు ప్రబలే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే డ్రైనేజీని శుభ్రం చేయించాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు.
NDL: అహోబిలం మఠం ముఖ్య కార్యనిర్వహణ అధికారిక కీడాంబి వేణుగోపాల్ స్వామి శనివారం బాధ్యతలు చేపట్టారు. పీఠాధిపతి శ్రీ వన్ శఠగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశీన్ ఆదేశాల మేరకు ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆళ్ల గడ్డకు చెందిన ప్రముఖ వైద్యులు, వెంకటసబ్బారెడ్డి హాస్పిటల్ ఎండి డాక్టర్ నరసింహారెడ్డి, మేనేజర్ మాధవన్ తదితరులు ఆయనను కలిసి అభినందనలు తెలిపారు.