కోనసీమ: రహదారి ప్రమాదాల్లో ప్రాణనష్టాన్ని నివారించేందుకు వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని రావులపాలెం సీఐ సిహెచ్. విద్యాసాగర్ హెచ్చరించారు. గురువారం రాత్రి ఆలమూరు సెంటర్లో ఎస్సై జి. నరేష్తో కలిసి హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పించారు. హెల్మెట్ లేని ప్రయాణం మృత్యుపాశమని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.