PLD: గురజాల శ్రీ పాత పాటేశ్వరి అమ్మవారి తిరునాళ్ల ఏర్పాట్లను పల్నాడు కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ శ్రీనివాస రావుతో కలిసి ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్లో యరపతినేని కలెక్టర్, ఎస్పీలతో సమావేశమయ్యారు. అనంతరం అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రకాశం: చదువుతో పాటు విద్యార్థులు క్రీడల్లో రాణించాలని మార్కాపురం టౌన్, రూరల్ ఎస్సైలు సైదా బాబు, డాక్టర్ రాజమోహన్ రావు అన్నారు. ఆదివారం మార్కాపురంలోని ఓ పాఠశాలలోని బాస్కెట్బాల్, టెన్నిస్ కోట్లను వాళ్ళు ప్రారంభించారు. విద్యార్థులు క్రీడల వల్ల మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వం పెంపొందుతుందని, వారిని తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు.
W.G: నరసాపురం నియోజకవర్గం కేపీ పాలెం మత్యకార సొసైటీ ప్రెసిడెంట్గా బొడ్డు నారాయణ మూర్తి, మోళ్ళ పర్రు మత్యకార సొసైటీ ప్రెసిడెంట్గా అండ్రాజు శ్రీనివాస్, కాళీపట్నం సౌత్ మత్యకార సొసైటీ ప్రెసిడెంట్గా అండ్రాజు సుబ్బరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వాళ్ళని మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు మర్యాద పూర్వకంగా కలిశారు.
W.G: పాలకోడేరు జెడ్పీటీసీ పెద్దిశెట్టి లక్ష్మీ తులసి, సుబ్రహ్మణ్యం దంపతులు డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు ఆధ్వర్యంలో వైసీపీ నుంచి ఆదివారం టీడీపీలో చేరారు. వారికి రఘురామ కృష్ణరాజు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఐసీసీ ఛైర్మన్ మంతెన రామరాజు, గంటా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
PPM: పొట్టి శ్రీరాములు తెలుగు ప్రజల హృదయాల్లో ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోయే గొప్ప మహనీయులని మాజీ ఎమ్మెల్యే అలజింగి జోగారవు అన్నారు. ఆదివారం పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ఆమరణ దీక్ష చేసి ప్రాణాలర్పించి రాష్ట్రాన్ని సాధించారన్నారు.
NLR: ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిల ఆధ్వర్యంలో నెల్లూరులోని వీపీఆర్ కన్వన్షన్ హాల్లో ఆదివారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. దేశంలోనే పేరొందిన 100 ప్రముఖ సంస్థల ప్రతినిధులతో జాబ్మేళాను నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది నిరుద్యోగ యువతీ, యువకులు ఈ జాబ్మేళాకు హాజరయ్యారు.
CTR: అమరజీ పొట్టి శ్రీరాములు వర్ధంతిని తిరుపతి ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి ఎస్పీ సుబ్బారాయుడు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఏపీ రాష్ట్ర సాధన కోసం ఆయన నిబద్ధతను గుర్తించుకోవాలని తెలిపారు. ఆయన ధైర్యం, దృఢ విశ్వాసం అందరికీ ఆదర్శనీయమన్నారు. ఆయన అడుగుజాడల్లో నడవాలని, నిస్వార్థత అలవర్చుకోవాలని సూచించారు.
E.G: ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం జీవితాన్ని అర్పించిన మహనీయుడు పొట్టి శ్రీరాములని ఐటీడీఏ పీవో కట్ట సింహాచలం అన్నారు. ఐటీడీఏ సమావేశహాల్లో ఆదివారం పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆంధ్ర ప్రజలు అంతా పొట్టి శ్రీరాములను తరతరాలుగా గుర్తించుకోవాలన్నారు.
KDP: రోడ్డు ప్రమాదాలు,అరికట్టేందుకు సిద్ధవటం పోలీసులు, హై లెవెల్ వంతెనపై రోడ్డుకు ఇరువైపులా ఉన్న మట్టి, కుప్పలు, ముళ్ళ చెట్లను ఆదివారం డోజర్ సహాయంతో తొలగించారు. ఈ సందర్భంగా హెడ్ కానిస్టేబుల్ రమణ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలు అరికట్టేందుకు బద్వేల్, కడప రహదారి, పోలీస్ లైన్ మలుపు వద్ద, రోడ్డుకు ఇరువైపులా ఉన్న ముళ్ళ పొదలను తొలగించామన్నారు.
KDP: ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని ఆదివారం 13వ వార్డులో ప్రొద్దుటూరు కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ ఇర్ఫాన్ బాషా పర్యటించారు. అనంతరం ఆయన వార్డు ప్రజలతో మాట్లాడి సమస్యల గురించి తెలుసుకున్నారు. ఏ సమస్య ఉన్న తనకు వెంటనే తెలియచేయాలని, ఆ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరిస్తానని 13వ వార్డు ప్రజలకు ఆయన భరోసా ఇచ్చారు.
VSP: వీఏంఆర్డీఏలో సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి 12 గంటల వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు వీఏంఆర్డీఏ ఛైర్పర్సన్ ఎంవీ.ప్రణవ్ గోపాల్ తెలిపారు. వీఏంఆర్డీఏకి సంబంధించిన అన్ని రకాల సమస్యలపై ప్రజలు వినతులు అందజేయవచ్చని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రణవ్ గోపాల్ నేరుగా పాల్గొని ఫిర్యాదులు స్వీకరిస్తానని తెలిపారు.
ELR: రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం పర్యటన సందర్భంగా ఆదివారం పోలవరంలో జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. హెలిప్యాడ్ మొదలు పోలవరం ప్రాజెక్ట్ మరియు బహిరంగ సభ వరకు పోలీసులు నిర్వహించాల్సిన విధుల గురించి అధికారులకు వివరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
KRNL: అమరజీవి పొట్టి శ్రీరాములు జీవిత చరిత్ర నేటి యువతరానికి ఆదర్శప్రాయుడని కలెక్టర్ పీ.రంజిత్ బాషా అన్నారు. పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతిని పురస్కరించుకొని ఆదివారం కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి పూలమాల లేసి కలెక్టర్ నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. భాషా ప్రయోక్త రాష్ట్రాల కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేస్తున్న సేవలు వెలకట్టలేనివి అన్నారు.
W.G: కీర్తిశేషులు పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆకివీడులో ఉన్న విగ్రహానికి సందర్శించి డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు, ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన రాంబాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం ఆంధ్ర రాష్ట్రానికి ఒక మైలురాయిని అంటూ ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
అనంతపురం నగరంలోని స్థానిక రెవెన్యూ భవనంలో ఆదివారం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ హాజరయ్యారు. అనంతరం పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.