• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

చేపల మార్కెట్ ప్రాంగణాన్ని తనిఖీ చేసిన నెల్లూరు కమిషనర్

NLR: నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ నందన్ పారిశుద్ధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక 6వ డివిజన్ శెట్టిగుంట రోడ్డు ప్రాంతంలోని చేపల మార్కెట్‌ను బుధవారం సందర్శించారు. చేపల మార్కెట్ ప్రాంగణంలో వసతులను కమిషనర్ పరిశీలించి వినియోగదారులకు పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.

October 15, 2025 / 01:20 PM IST

వ్యాపార స్థలం కోసం ఘర్షణ

GNTR: దీపావళి పండుగ సమీపిస్తున్న వేళ వ్యాపారస్తులు వ్యాపారం చేసుకునేందుకు రోడ్డుమీద స్థలాలు ఇప్పటినుంచి ఏర్పాటు చేసుకుంటున్నారు. కొరిటెపాడు లైబ్రరీ సెంటర్‌లో వ్యాపార స్థలం కోసం వ్యాపారస్తులు ఘర్షణ పడటం స్థానికంగా కలకలం రేపింది. ఇద్దరి మధ్య ఘర్షణ మొదరడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు.

October 15, 2025 / 01:18 PM IST

అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధికి కృషి

E.G: రాజమండ్రిలోని 42వ వార్డులో ఉన్న ఆయేషా మసీదులో ముస్లింల సౌకర్యార్థం షెడ్డు నిర్మాణానికి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ బుధవారం శంకుస్థాపన చేశారు. ముస్లింల కోరిక మేరకు తన భవాని చారిటబుల్ ట్రస్ట్ నిధులతో ఈ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధికి తాము అహర్నిశలు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు.

October 15, 2025 / 01:18 PM IST

సూపర్ జీఎస్టీతో ప్రజలకు ఎంతో మేలు: ఎంపీడీవో

NDL: మహానందిలో బుధవారం ఎంపీడీవో మహబూబ్ దౌలా సూపర్ జీఎస్టీపై అవగాహన ర్యాలీ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయం, విద్యా, చిరు వ్యాపారాలపై జీఎస్టీ తగ్గించి సామాన్యులకు మేలు కలిగించిందన్నారు. రైతుల పరికరాలపై తక్కువ జీఎస్టీ ఉండటంతో ఆదాయం పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం తిరుపాల్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి భాస్కర్ పాల్గొన్నారు.

October 15, 2025 / 01:17 PM IST

‘జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు ఎంతో మేలు’

కృష్ణా: కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు ఎంతో మేలు జరిగిందని, ప్రజల ఆదాయం పెరిగిందని ఏపీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ రావి వెంకటేశ్వరరావు అన్నారు. ‘సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్’ ప్రచార కార్యక్రమాన్ని కూటమి నేతలు బుధవారం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని రావి వెంకటేశ్వరరావు, జనసేన ఇన్‌ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, టీడీపీ అబ్జర్వర్ నూకాలమ్మలు ర్యాలీ నిర్వహించారు.

October 15, 2025 / 01:16 PM IST

పంచాయతీ కార్యదర్శులతో సమావేశం

AKP: గొలుగొండ ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం ఇంఛార్జ్ ఎంపీడీవో శ్రీనివాసరావు పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, పథకాల అమలు, పరిశుభ్రత తదితర అంశాలపై చర్చించారు. గ్రామ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, గ్రామాల్లో పారిశుధ్యం పనులుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

October 15, 2025 / 01:11 PM IST

ఎర్రచందనం స్వాధీనం.. దుండగులు పరార్

CTR: ఎర్రచందనం తరలిస్తున్న వాహనం బోల్తా పడ్డ సంఘటన బంగారుపాలెం మండలంలో జరిగింది. కాటప్ప గారి పల్లె రోడ్డు సమీపంలో పలమనేరు నుంచి చిత్తూరు వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి బైక్‌ను ఢీకొని రోడ్డు పక్కన లోయలోకి దూసుకుపోయింది. కారులో 9 మంది ఎర్రచందనం దుంగలు ఉన్నట్టు సమాచారం. బైక్ పై వెళుతున్న ఓ వ్యక్తి ప్రమాదంలో గాయపడ్డాడు. దుండగులు పరారయ్యారు.

October 15, 2025 / 01:11 PM IST

తెనాలిలో పర్యటించిన మున్సిపల్ ఛైర్‌పర్సన్

GNTR: తెనాలి పట్టణంలోని 18వ వార్డులో మున్సిపల్ ఛైర్‌పర్సన్ తాడిబోయిన రాధిక ఇవాళ పర్యటించారు. వార్డులో జరుగుతున్న స్పెషల్ శానిటేషన్ పనులను పరిశీలించారు. స్థానిక ప్రజలతోపాటు మున్సిపల్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. కాల్వలలో వ్యర్ధాలు వేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. వ్యర్ధాలు అడ్డుపడి మురుగు పారుదల సక్రమంగా ఉండటం లేదని పేర్కొన్నారు.

October 15, 2025 / 01:09 PM IST

‘ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి’

అనంతపురం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని బుధవారం జిల్లా కలెక్టర్ ఆనంద్, ఎమ్మెల్యే వెంకట ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం రోగులకు అందిస్తున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో జరిగిన కాన్ఫరెన్స్ హాల్లో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో వీరు పాల్గొన్నారు.

October 15, 2025 / 01:07 PM IST

‘నేటి యువతకు అబ్దుల్ కలాం స్పూర్తిదాయకం’

GNTR: భారత అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం అందుకున్నారని జిల్లా వైసీపీ అధ్యక్షురాలు నూరి ఫాతిమా పేర్కొన్నారు. ఇవాళ గుంటూరులోని పొన్నూరు రోడ్‌లో 94వ అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళుర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. నేటి యువతకు కలాం స్పూర్తిదాయకమని కొనియాడారు.

October 15, 2025 / 01:07 PM IST

‘యువతకు శాశ్వత స్ఫూర్తిగా కలాం’

GNTR: మాజీ రాష్ట్రపతి, భారత రత్న డా. ఏపీజే అబ్దుల్ కలాం జయంతి గుంటూరు కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా , వివిధ శాఖల అధికారులు కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మిసైల్ మ్యాన్‌గా దేశ గౌరవం పెంచిన కలాం యువతకు శాశ్వత స్ఫూర్తి అన్నారు.

October 15, 2025 / 01:05 PM IST

అబ్దుల్ కలాం స్ఫూర్తి ఎప్పటికీ సజీవమే: కమిషనర్ ప్రసాద్

SKLM: భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం స్ఫూర్తి ఎప్పటికీ సజీవంగా నిలిచి ఉంటుందని మున్సిపల్ కమిషనర్ ప్రసాదరావు తెలిపారు. బుధవారం శ్రీకాకుళం స్వాతంత్ర సమరయోధుల వనంలో 94వ జయంతి సందర్భంగా అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ.. అబ్దుల్ కలాం ప్రపంచానికి ప్రభావితం చేసిన అత్యంత దేశభక్తుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

October 15, 2025 / 01:00 PM IST

బొబ్బిలిలో E-KYCను పరిశీలించిన ఏపీవో

VZM: బొబ్బిలి మండలం కాసిందొరవలస పంచాయతీ ఎరకందొరవలస గ్రామంలో జరుగుతున్న ఉపాధిహామీ కూలీల E-KYCను ఏపీవో లక్ష్మీపతి రాజు పరిశీలించారు. ఉపాధిహామీ కూలీలు తప్పని సరిగా e-kyc చేసుకోవాలని కోరారు. పంచాయతీ పరిధిలో 666 జాబ్ కార్డులు ఉన్నాయని పేర్కొన్నారు. ఇందులో భాగంగా పలు అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

October 15, 2025 / 12:57 PM IST

ఘనంగా ప్రసన్నాంజనేయ ఆలయ ప్రతిష్ట మహోత్సవాలు

SKLM: పోలాకి మండలం దీర్ఘాసి లో నిర్మించిన శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బుధవారం జరిగిన ప్రతిష్ట మహోత్సవంలో భాగంగా నరసన్నపేట వైసిపి ఇన్చార్జ్ ధర్మాన కృష్ణ చైతన్య ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. దుర్గామాత ఆలయం చెంతనే ఆంజనేయ స్వామి ఆలయం ఏర్పాటు ఆనందదాయకమన్నారు.

October 15, 2025 / 12:53 PM IST

అధికారులతో కదిరి ఎమ్మెల్యే సమీక్ష

సత్యసాయి: కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ బుధవారం ఆర్డీవో వి.వి.ఎస్. శర్మ, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ అభివృద్ధి పనులు, ప్రజా సమస్యల పరిష్కారంపై చర్చించారు. అభివృద్ధి ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

October 15, 2025 / 12:52 PM IST