SS: మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురికావడంపై మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాద వివరాలపై అధికారులతో మాట్లాడి, క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని ఆదేశించారు. బాధితులకు అన్ని సహాయ సహకారాలు అందించాలని సూచించారు.