VZM: గత నెల 25న రామభద్రపురం వద్ద ఇద్దరి మరణానికీ కారణమైన లారీని స్దానిక SI ప్రసాదరావు బుధవారం పట్టుకున్నారు. యాత వీధికి చెందిన ఇరువురిని ఢీకొట్టి ఆపకుండా వెళ్లిన వాహనం కోసం గాలిస్తే ఛత్తీస్గఢ్కు చెందిన స్వస్తిక్ మినరల్స్ లారీగా తేలింది. డ్రైవర్ ప్రమాదం తర్వాత లారిని కంపెనీకి అప్పగించి పారిపోయాడు. ఈ మేరకు లారీని ఛత్తీస్గఢ్ నుంచి తీసుకువచ్చారు.
ATP: గుంతకల్లులోని పలు కిరాణా దుకాణాలను గురువారం మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి అకస్మికంగా తనిఖీ చేశారు. మామజి అనే కిరాణా దుకాణ యజమానికి ప్లాస్టిక్ వినియోగిస్తుండడంతో రూ.2000 జరిమానా విధించి ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకున్నారు. కమిషనర్ మాట్లాడుతూ.. పర్యావరణానికి హానికరమైన ప్లాస్టిక్ వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
W.G: మొగల్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాల తీవ్రత, కేసుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే, దీనిని ఒక ‘హెవీ క్రైమ్’ స్టేషన్ గా పరిగణించవచ్చు. ఈ నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ, కేసుల త్వరితగతిన దర్యాప్తు కోసం ఖాళీ అయిన అదనపు ఎస్సై స్థానంలో ఉన్నత అధికారులు మరొక ఎస్సై త్వరలోనే నియమించే అవకాశం ఉంది. కాగా ఇక్కడ పని చేసిన ఎస్సై నాగలక్ష్మి ఇటీవల బదిలీ అయ్యారు.
E.G: కొవ్వూరు మండలంలో గురువారం ఉదయం 10 గంటల నుంచి జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కానుంది. పార్టీ సభ్యునిగా గుర్తింపు, గౌరవంతో పాటు భవిష్యత్తులో పార్టీ కార్యక్రమాల్లో ప్రాధాన్యత లభిస్తుందని మండల అధ్యక్షుడు సుంకర సత్తిబాబు తెలిపారు.జనసేన శ్రేణులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
KRNL: MRPS జిల్లా అధ్యక్షుడు భాస్కర్ మాదిగపై గుర్తుతెలియని వ్యక్తులు హత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. బుధవారం వెల్దుర్తి మండలం కలుగొట్ల నుంచి ఉయ్యాలవాడ వెళ్లి తిరిగి వస్తుండగా దుండగులు స్కార్పియో వాహనంతో వెంటాడి ఇనుప రాడ్లతో దాడి చేయడానికి ప్రయత్నించినట్లు, ఉయ్యాలవాడలో ఉన్న ఒక దుకాణంలో వెళ్లి ప్రాణాలు రక్షించుకున్నట్లు స్థానికులు తెలిపారు.
ELR: కొయ్యలగూడెం మండలం దిప్పకాయలపాడు-సరిపల్లి గ్రామాల మధ్య హుకుంపేట చెరువు సమీపంలో నిర్వహిస్తున్న కోడిపందాల స్థావరంపై బుధవారం అర్ధరాత్రి పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి ఏడు మోటార్ బైక్లు, మూడు కోడిపుంజులు, రూ.3,750 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వి.చంద్రశేఖర్ తెలిపారు.
SKLM: పలాస కాశీబుగ్గ డీఎస్పీ షేక్ షహ బాజ్ అహ్మద్ బదిలీ అయ్యారు. డీఎస్పీను తక్షణమే విధులు నుంచి రిలీవ్ చేసి, మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా బుధవారం ఆదేశించారు. ఈయన స్థానంలో ఇన్ఛార్జ్ డీఎస్పీగా ఎవరిని నియమిస్తారు అనేది తెలియాల్సి ఉంది.
CTR: కుప్పం RDO శ్రీనివాసరాజును బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న 26 మంది రెవిన్యూ డివిజన్ ఆఫీసర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇందులో భాగంగా కుప్పం RDO శ్రీనివాసరాజు, నగరి RDO భవాని శంకర్ను ట్రాన్స్ఫర్ చేసింది.
NDL: నందికొట్కూరు మండలం అల్లూరులో దొంగతనం జరిగినట్లు ఎస్సై మణికంఠ తెలిపారు. గ్రామానికి చెందిన మద్దిలేటి సోమవారం ఇంటికి తాళం వేసి తిరుపతికి వెళ్లారు. మంగళవారం రాత్రి తిరిగి వచ్చేసరికి బీరువా తాళాలు పగలగొట్టి ఉన్నాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు 10 తులాల వెండి, అర తులం బంగారం,15 వేల నగదు అపహరణకు గురైనట్లు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
NTR: తిరువూరుకు చెందిన వైసీపీ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి రామడుగు రామకోటచారి బుధవారం టీడీపీలో చేరారు. విజయవాడ గురునానక్ కాలనీ ఎంపీ కార్యాలయంలో ఎంపీ కేసినేని చిన్ని రామకోటచారికి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్ శివనాథ మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. పార్టీలో సుమచిత గుర్తింపు ఉంటుందన్నారు.
PLD: రొంపిచర్ల మండలంలోని గోగులపాడు గ్రామంలో వేంచేసి ఉన్న యున్న అభయాంజనేయ స్వామికి గురువారం ప్రత్యేక పూజలు జరిగాయి. 31వ ఆలయ వార్షికోత్సవ సందర్భంగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలను అర్చకులు కృష్ణమాచార్యులు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక అలంకరణ చేశారు. మహిళలు పొంగళ్లు నిర్వహించి, మొక్కుబడులను తీర్చుకున్నారు. స్వామి వారిని దర్శించుకున్నారు.
గుంటూరు మిర్చి యార్డులో అన్నదాతల కోసం గురువారం నుంచి భోజన పథకం ప్రారంభం కానుంది. టెండర్ల ప్రక్రియ పూర్తి కావడంతో, అధికారులు గుత్తేదారుతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒక వ్యక్తికి అల్పాహారం, భోజనం కలిపి రూ. 88.25 ధరగా నిర్ణయించారు (టిఫిన్ రూ. 20, భోజనం రూ. 68.25). యార్డు ఛైర్మన్ కుర్రా అప్పారావు, కార్యదర్శి చంద్రికలు ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.
అనకాపల్లి పట్టణం భీముని గుమ్మం వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం అధికారులు హుండీలను తెరచి లెక్కించారు. కానుకల రూపంలో రూ.4,26,767 లక్షల ఆదాయం లభించినట్లు ఆలయ కార్యనిర్వాహక కార్యదర్శి చంద్ర తేజ తెలిపారు. 50 రోజులకు ఈ ఆదాయం లభించినట్లు పేర్కొన్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు.
VSP: ఫిజియోథెరపీ సెకండియర్ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన గాజువాక ఉడా కాలనీలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పైడా రజిని (21) అనే విద్యార్థిని ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రేమ కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ లెటర్లో వెల్లడించింది. న్యూపోర్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
KRNL: ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్చి 7వ తేదీన కర్నూలు డీఎస్ఏ స్టేడియంలో జిల్లాస్థాయి బాలికల పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా యోగా సంఘం వర్కింగ్ ప్రెసిడెంటు డా.ఎస్. ముంతాజ్బేగం ఇవాళ తెలిపారు. 7- 9 ఏళ్లు, 10- 13 ఏళ్లు, 14- 18 ఏళ్ల విభాగాల్లో పోటీలు జరుగుతాయని వెల్లడించారు. వివరాలకు 7981515467 నంబర్లో సంప్రదించాలని సూచించారు.