• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘వాహనదారులు హెల్మెట్ ధరించి ప్రాణ రక్షణ పొందాలి’

ELR: వాహనదారులు హెల్మెట్ ధరించి ప్రాణ రక్షణ పొందాలని చేబ్రోలు ఎస్సై సూర్య భగవాన్ అన్నారు. శనివారం ఉంగుటూరు టోల్గేట్ వద్ద చేబ్రోలు పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. హెల్మెట్లు ధరించినవారికి జరిమానాలను విధించకుండా, వాహన దారులతో హెల్మెట్లను కొనుగోలు చేయించారు. హెల్మెట్ పై వాహనదారులకు అవగాహన కల్పించారు.

February 21, 2026 / 02:05 PM IST

స్వయంగా చెత్తను ఊడ్చిన డిప్యూటీ స్పీకర్

W.G: ఆకివీడు మండలం దుంపగడపలో శనివారం ఉపసభాపతి కనుమూరు రఘురామకృష్ణ రాజు, కలెక్టర్ నాగరాణి పర్యటించారు. గ్రామంలో స్వచ్ఛ రథాన్ని ప్రారంభించి, స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వయంగా రహదారిని శుభ్రం చేసి చెత్తను తొలగించారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని కోరారు. అనంతరం వర్మీ కంపోస్ట్ ఎరువు విక్రయాలను ప్రారంభించారు.

February 21, 2026 / 02:03 PM IST

శిథిలావస్థలో ఐసీడీఎస్ కార్యాలయం.. ప్రాణభయంతో సిబ్బంది

ASR: రాజవొమ్మంగి ఐసీడీఎస్ కార్యాలయం శిథిలావస్థకు చేరుకోవడంతో సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. భవనంపైకప్పు పెచ్చులు ఊడిపడుతుండటంతో నెలవారీ సమావేశాల నిర్వహణ వారికి ప్రాణసంకటంగా మారింది. ఏదైనా పెను ప్రమాదం జరక్కముందే ఉన్నతాధికారులు స్పందించి, కార్యాలయానికి వెంటనే నూతన భవనాన్ని కేటాయించాలని సిబ్బంది కోరుతున్నారు.

February 21, 2026 / 02:03 PM IST

జనార్దన్‌కు ఎలక్ట్రిక్ త్రీ వీలర్ స్కూటర్ అందజేత

రామాపురం మండలం కల్పనాయుని చెరువు గ్రామానికి చెందిన వైఎస్ఆర్‌సిపి సీనియర్ కార్యకర్త జనార్దన్‌కు రూ.లక్షకు పైగా విలువ చేసే ఎలక్ట్రిక్ మూడు చక్రాల స్కూటర్‌ను ఎంపీ మిథున్ రెడ్డి సహకారంతో మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అందజేశారు. ప్రమాదంలో కాలు కోల్పోయిన జనార్దన్‌కు నేతలు అండగా నిలిచి ధైర్యం చెప్పారు. స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకలు పాల్గున్నారు.

February 21, 2026 / 02:01 PM IST

రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

GNTR: ఫిరంగిపురం గ్రామ శివారులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వేములూరిపాడుకు చెందిన నాగరాజు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. బైక్‌పై వెళ్తున్న అతడిని వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. తలకు బలమైన గాయం కావడంతో స్థానికులు 108 ద్వారా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం తర్వాత ఆపకుండా వెళ్తున్న లారీని స్థానికులు వెంబడించి పట్టుకున్నారు.

February 21, 2026 / 02:01 PM IST

‘ప్రతి యువకుడు రక్తదానానికి ముందుకు రావాలి’

SKLM: ఆమదాలవలసలోని ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాలలో శనివారం NSS ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. సాంకేతిక విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎం.ఏ.వి. రామకృష్ణ ఈ శిబిరాన్ని ప్రారంభించారు. రక్తదానం మహాదానం అని, ప్రతి యువకుడు సమాజానికి అవసరమైనప్పుడు రక్తదానం చేయడానికి ముందుకు రావాలని ఆయన అన్నారు.

February 21, 2026 / 02:01 PM IST

అంబేడ్కర్ సర్కిల్లో స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర

KRNL: ఆలూరు అంబేడ్కర్ సర్కిల్లో శనివారం స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం జరిగింది. టీడీపీ ఇంఛార్జ్ వైకుంఠం జ్యోతి పాల్గొని పరిసరాల పరిశుభ్రత ప్రాముఖ్యతను వివరించారు. స్వచ్ఛమైన గ్రామాలు, పట్టణాలే ఆరోగ్యకర సమాజానికి పునాది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, పారిశుధ్య కార్మికులు, ప్రజలు పాల్గొని పరిసరాలను శుభ్రం చేశారు.

February 21, 2026 / 02:01 PM IST

పరిశుభ్రతే ప్రగతికి సోపానం: ఏఆర్ అదనపు ఎస్పీ

KDP: శనివారం కడప పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఆర్ అదనపు ఎస్పీ బి. రమణయ్య మాట్లాడుతూ.. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడమే ఆరోగ్యకర సమాజానికి పునాది అని నొక్కి చెప్పారు. అనంతరం పోలీసు సిబ్బందితో స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎ, ఆర్ఎస్ఐ, ఇతర ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు.

February 21, 2026 / 02:01 PM IST

ఎల్లారమ్మ జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు: DM

VZM: జామి ఎల్లారమ్మ తీర్ధ యాత్రి నేపథ్యంలో ఈనెల 24 నుంచి 8 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఎస్‌.కోట RTC DM కే.సుదర్శనరావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఈ బస్సులను సాధారణ పల్లె వెలుగు ఛార్జీలతో నడపనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రత్యేక బస్సులను కొత్తవలస-జామి, జామి-కొత్తవలసకు ఉదయం 5:30 గంటలు నుంచి నడపనున్నట్లు పేర్కొన్నారు.

February 21, 2026 / 02:00 PM IST

నేర సమీక్ష సమావేశం నిర్వహించిన సీఐ

ప్రకాశం: వై.పాలెం సర్కిల్ కార్యాలయంలో సీఐ ఆధ్వర్యంలో శనివారం నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్కిల్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల ప్రగతిని గురించి సీఐ సమీక్షించారు. ముఖ్యంగా సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఎస్సైలు పాల్గొన్నారు.

February 21, 2026 / 01:49 PM IST

హిందువులు మనోభావాలను దెబ్బతీయటమే వైసిపి లక్ష్యం

PPM: రాష్ట్రంలో హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా కనిపిస్తోందని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర ఆక్షేపించారు. పార్వతీపురం టీడీపీ కార్యాలయంలో కూటమి నాయకులతో కలసి మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నాయకుల వైఖరి పై నిప్పులు చెరిగారు. శుక్రవారం మండలిలో ఆ పార్టీ ఎమ్మెల్సీలు వ్యవహరించిన తీరును రాష్ట్ర ప్రజలందరూ చీత్కరిస్తున్నారని అన్నారు.

February 21, 2026 / 01:42 PM IST

ప్రజాస్వామ్యంపై బీజేపీ దాడిని ఖండిద్దాం

VZM: ఢిల్లీ ఏఐ సమ్మిట్‌లో చైనా రోబోను స్వదేశీ తయారీగా చూపిస్తూ దేశ ప్రతిష్టను దిగజార్చిన వైనంపై శాంతియుతంగా నిరసన తెలిపిన యువజన కాంగ్రెస్ నాయకులపై, కార్యకర్తలపై బీజేపీ మూకలు దాడులకు దిగారు. ఇది అత్యంత హేయమైన చర్య అని విజయనగరం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరిపి విద్యాసాగర్ అన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై బీజేపీ దాడిని తీవ్రంగా ఖండించారు.

February 21, 2026 / 01:41 PM IST

సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్న హైకోర్టు జస్టిస్

శ్రీకాకుళం పట్టణంలో ఉన్న అరసవల్లి శ్రీ సూర్యనారాయణస్వామిని ఏపీ హైకోర్టు జస్టిస్ హరినాథ్ శనివారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ, ఈవో ప్రసాద్ ఘన స్వాగతం పలికారు. తదుపరి స్వామి వారికి ప్రత్యేక పూజలు చేయించారు. ఆయనకు స్వామి వారి తీర్థ ప్రసాదాలను, చిత్రపటాన్ని అందజేశారు. ఆయన వెంట జిల్లా న్యాయమూర్తులు ఉన్నారు.

February 21, 2026 / 01:32 PM IST

‘ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి’

SKLM: ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి, వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ మార్చి 5న విజయవాడలో జరిగే మహా ధర్నాను విజయవంతం చేయాలని ఎపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు డి. ధనలక్ష్మి అన్నారు. శనివారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఆశాలకు కనీస వేతనం పెంచాలన్నారు.

February 21, 2026 / 01:29 PM IST

‘స్వచ్ఛ రథం’ ప్రారంభించిన ఎమ్మెల్యే

NDL: ప్యాపిలి మండల పరిష్యత్ కార్యాలయంలో శనివారం స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి పాల్గొని ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ కోసం ప్రత్యేక స్వచ్ఛ రథాన్ని ప్రారంభించారు. ‘తుక్కు ఇవ్వండి సరకులు తీసుకోండి’ అనే నినాదంతో ఈ రథం ఇంటింటికీ వెళ్లి ప్లాస్టిక్ సేకరిస్తుందని తెలిపారు. నిత్యావసర సరుకుల గురించి వివరించారు.

February 21, 2026 / 01:29 PM IST