SKLM: ఆమదాలవలసలోని ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాలలో శనివారం NSS ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. సాంకేతిక విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎం.ఏ.వి. రామకృష్ణ ఈ శిబిరాన్ని ప్రారంభించారు. రక్తదానం మహాదానం అని, ప్రతి యువకుడు సమాజానికి అవసరమైనప్పుడు రక్తదానం చేయడానికి ముందుకు రావాలని ఆయన అన్నారు.