శ్రీకాకుళం పట్టణంలో ఉన్న అరసవల్లి శ్రీ సూర్యనారాయణస్వామిని ఏపీ హైకోర్టు జస్టిస్ హరినాథ్ శనివారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ, ఈవో ప్రసాద్ ఘన స్వాగతం పలికారు. తదుపరి స్వామి వారికి ప్రత్యేక పూజలు చేయించారు. ఆయనకు స్వామి వారి తీర్థ ప్రసాదాలను, చిత్రపటాన్ని అందజేశారు. ఆయన వెంట జిల్లా న్యాయమూర్తులు ఉన్నారు.