VZM: గత నెల 25న రామభద్రపురం వద్ద ఇద్దరి మరణానికీ కారణమైన లారీని స్దానిక SI ప్రసాదరావు బుధవారం పట్టుకున్నారు. యాత వీధికి చెందిన ఇరువురిని ఢీకొట్టి ఆపకుండా వెళ్లిన వాహనం కోసం గాలిస్తే ఛత్తీస్గఢ్కు చెందిన స్వస్తిక్ మినరల్స్ లారీగా తేలింది. డ్రైవర్ ప్రమాదం తర్వాత లారిని కంపెనీకి అప్పగించి పారిపోయాడు. ఈ మేరకు లారీని ఛత్తీస్గఢ్ నుంచి తీసుకువచ్చారు.