SKLM: టెక్కలిలోని బస్ స్టాండ్, దుకాణాలు, పలు ప్రాంతాల్లో పోలీసులు జాగిలాలతో బుధవారం సీఐ విజయ్ కుమార్ పర్యవేక్షణలో ముమ్మర తనిఖీలు నిర్వహించారు. గంజాయి, మత్తు, తదితర మాదక ద్రవ్యాల రవాణాను అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సీఐ తెలిపారు. మత్తు పదార్థాలు, గంజాయి అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు.